అక్షయ్ కుమార్ ఎన్ని ప్రయోగాలు చేసినా హిట్ రావడం లేదని.. తనకు బాగా అచ్చొచ్చిన దర్శకుడు ప్రియదర్శన్తో కొలబరేటై సక్సెస్ టేస్ట్ చేశాడు. భూత్ బంగ్లాతో బౌన్స్ బ్యాక్ అయ్యాడు. ఇది వర్కౌట్ అయ్యిందో లేదో మలయాళ దర్శకుడికి మరో ఛాన్స్ ఇచ్చాడు ఖిలాడీ హీరో. కొన్నేళ్లుగా అక్షయ్ కుమార్ సీరియస్ రోల్స్ చేసినా, మల్టీస్టారర్స్తో వచ్చినా బ్యాక్ టు బ్యాక్ ప్లాప్స్ వచ్చాయి. ఓమైగాడ్2 తర్వాత బ్లాక్ బస్టర్ హిట్ కొట్టలేదు. దీంతో రూట్ మార్చి ప్రియదర్శన్తో కొలబరేటై భూత్ బంగ్లాతో మాసివ్ హిట్ అందుకున్నాడు. రూ. 120 కోట్లతో తెరకెక్కిన హారర్ కామెడీ రూ. 240 కోట్ల వరకు వసూలు చేసింది.
భూత్ బంగ్లా కమర్షియల్గా వర్కౌట్ అవ్వక ముందు ప్రియదర్శన్ వర్క్ తెలిసిన అక్షయ్ మలయాళ దర్శకుడికి మరో ఛాన్స్ ఇచ్చాడు. ఈసారి హారర్ కామెడీ కాకుండా సస్పెన్స్ థ్రిల్లర్ చేస్తున్నారు ఈ హిట్ కాంబో. హైవాన్ రిలీజ్ డేట్ లాక్ చేసుకుంది. సెప్టెంబర్ 11న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ తీసుకోబోతుంది కన్నడ ప్రొడక్షన్ హౌస్ కెవిఎన్. 18 ఏళ్ల తర్వాత అక్షయ్ కుమార్, సైఫ్ అలీఖాన్ కలిసి నటించబోతున్నారు. ఈ ఇద్దరు చివరి సారిగా తషాన్ మూవీలో కనిపించారు. మళ్లీ ఇన్నాళ్లకు కొలబరేట్ అయ్యారు. అలాగే హైవాన్లో మోహన్ లాల్ గెస్ట్ అప్పీరియన్స్ ఇవ్వబోతున్నాడని బజ్. కాజోల్, సయామీ ఖేర్, బాబీడియోల్ లాంటి స్టార్ కాస్ట్ వర్క్ చేస్తున్నారు. రీసెంట్లీ భూత్ బంగ్లా హారర్ కామెడీతో హిట్ అందుకున్న అక్షయ్ అండ్ ప్రియదర్శన్.. ఈ సారి సస్పెన్స్ థ్రిల్లర్తో సక్సెస్ చూస్తారేమో చూడాలి.

