Akkineni Multistarrer: అక్కినేని మల్టీస్టారర్కు బ్రేక్.. నాగార్జున, చైతూ, అఖిల్ సినిమా ఎందుకు ఆగిపోయింది?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Akkineni Multistarrer: అక్కినేని మల్టీస్టారర్ ప్రాజెక్ట్కు ఊహించని బ్రేక్ పడినట్లు తెలుస్తోంది. ఒకే తెరపై నాగార్జునతో పాటు ఆయన ఇద్దరు కుమారులు నాగ చైతన్య, అఖిల్ కనిపించబోతున్నారనే వార్త బయటకు వచ్చినప్పటి నుంచే ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మూడు తరాల స్టార్ ఇమేజ్ను ఒకే కథలో చూపించే ప్రయత్నం కావడంతో అభిమానులు కూడా ఈ ప్రాజెక్ట్పై భారీ ఆశలు పెట్టుకున్నారు. అయితే ఇప్పుడు ఆ కల తాత్కాలికంగా ఆగిపోయినట్లు తెలుస్తోంది. అసలు ఈ ప్రాజెక్ట్ ఎందుకు నిలిచిపోయింది? కథలో వచ్చిన సమస్య ఏంటి? ఇక అక్కినేని హీరోలు నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? అనే విషయాల్లోకి వెళ్తే…
ఈ మల్టీస్టారర్ చిత్రానికి దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వం వహించాల్సి ఉంది. జీ స్టూడియోస్, అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించేందుకు సిద్ధమయ్యాయి కూడా. జూలైలో షూటింగ్ ప్రారంభించి, 2027 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే లక్ష్యంతో ప్రణాళికలు కూడా సిద్ధం చేసినట్లు సమాచారం. అయితే కథ తుది రూపం దాల్చిన తర్వాత పరిస్థితులు మారిపోయాయి. అందుతున్న సమాచారం ప్రకారం, దర్శకుడు సిద్ధం చేసిన ఫైనల్ స్క్రిప్ట్తో నాగ చైతన్య, అఖిల్ పూర్తిగా సంతృప్తి చెందలేదని తెలుస్తోంది. కథలో ఇద్దరికీ కొన్ని సందేహాలు ఉండటంతో ప్రాజెక్ట్ను ముందుకు తీసుకెళ్లడం సరైన నిర్ణయం కాదని భావించినట్లు టాక్ వినిపిస్తోంది. ఇద్దరు హీరోలకు భిన్నమైన ప్రాజెక్ట్స్ ఉండటంతో, నాగార్జున కూడా ఈ దశలో సినిమాను ప్రారంభించకుండా వేచి చూడాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన ఇప్పటివరకు వెలువడకపోవడంతో, ప్రాజెక్ట్ నిలిచిపోయిందనే దానిపై ప్రకటన వచ్చే అవకాశాలు కూడా కనిపించడం లేదు.
Also Read
- Kallu Mama Song: 28 ఏళ్లైనా తగ్గని క్రేజ్.. అండర్వరల్డ్ యాంథమ్గా నిలిచిన 'కల్లు మామ' పాట
- Star Daughters Debut : కొడుకుల టాస్క్ ఫినీష్.. ఇప్పుడు కూతుళ్ల వంతు
- Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
- Leonardo DiCaprio: ఒక్క టిప్తో వెయిటర్ జీవితాన్ని మార్చిన 'టైటానిక్' హీరో... కన్నీళ్ళు పెట్టించిన ఉదారత
మరోవైపు నాగ చైతన్య ఇప్పటికే వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆయన చేతిలో ప్రస్తుతం ‘దూత 2’తో పాటు దర్శకుడు క్లాక్స్తో ఒక కొత్త సినిమా, మరో హారర్ జానర్ ప్రాజెక్ట్ ఉన్నట్లు తెలుస్తోంది. విభిన్న కథలను ఎంచుకుంటూ కెరీర్ను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో ఉన్న చైతన్య, ఈ చిత్రాలపై పూర్తిగా దృష్టి పెట్టనున్నారని సమాచారం. అఖిల్ కూడా కొత్త ప్రాజెక్ట్ లతో వేగం పెంచారు. ప్రస్తుతం రెండు కొత్త కథలను పరిశీలిస్తున్న ఆయన, వాటిలో ఒక సినిమాను ఈ నెలలోనే ఖరారు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం ‘లెనిన్’ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న అఖిల్ ఈసారి మరింత బలమైన స్క్రిప్ట్తో ప్రేక్షకుల ముందుకు రావాలని భావిస్తున్నట్లు సినీ వర్గాల టాక్.
ఇక నాగార్జున విషయానికి వస్తే, తన కుమారులు తమ తమ ప్రాజెక్ట్లతో బిజీ అయిన తర్వాత ఆయన తన ప్రతిష్టాత్మక ‘కింగ్ 100’ ప్రాజెక్ట్పై పూర్తి దృష్టి పెట్టనున్నట్లు సమాచారం. అలాగే దసరా తర్వాత మరో కొత్త సినిమాకు కూడా ఆయన సంతకం చేసే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. మొత్తానికి అక్కినేని త్రయం కలిసి నటించే సినిమా ఇప్పట్లో సెట్స్పైకి వెళ్లే అవకాశాలు తగ్గినా, భవిష్యత్తులో మరింత బలమైన కథతో ఈ కల నిజమయ్యే అవకాశం మాత్రం పూర్తిగా కొట్టిపారేయలేం. అభిమానులు కూడా ఈ మల్టీస్టారర్ ప్రాజెక్ట్ మళ్లీ పట్టాలెక్కాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
తాజావార్తలు
-
Akkineni Multistarrer: అక్కినేని మల్టీస్టారర్కు బ్రేక్.. నాగార్జున, చైతూ, అఖిల్ సినిమా ఎందుకు ఆగిపోయింది?
-
AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం.. ముగ్గురు నిందితులకు 3 రోజుల ఈడీ కస్టడీ..!
-
Airtel Perplexity Pro: ఎయిర్టెల్ యూజర్లకు అలర్ట్.. రేపటిలోగా ఈ పని చేయకపోతే ఖాతా నుంచి డబ్బు కట్!
-
Explainer: ఇరు సైన్యాల మధ్య నలిగిపోయిన భారతీయ సిబ్బంది.. ఆ రాత్రి అసలేం జరిగింది?
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
ట్రెండింగ్
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?