Akkineni Multistarrer: అక్కినేని మల్టీస్టారర్కు బ్రేక్.. నాగార్జున, చైతూ, అఖిల్ సినిమా ఎందుకు ఆగిపోయింది?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Akkineni Multistarrer: అక్కినేని మల్టీస్టారర్ ప్రాజెక్ట్కు ఊహించని బ్రేక్ పడినట్లు తెలుస్తోంది. ఒకే తెరపై నాగార్జునతో పాటు ఆయన ఇద్దరు కుమారులు నాగ చైతన్య, అఖిల్ కనిపించబోతున్నారనే వార్త బయటకు వచ్చినప్పటి నుంచే ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మూడు తరాల స్టార్ ఇమేజ్ను ఒకే కథలో చూపించే ప్రయత్నం కావడంతో అభిమానులు కూడా ఈ ప్రాజెక్ట్పై భారీ ఆశలు పెట్టుకున్నారు. అయితే ఇప్పుడు ఆ కల తాత్కాలికంగా ఆగిపోయినట్లు తెలుస్తోంది. అసలు ఈ ప్రాజెక్ట్ ఎందుకు నిలిచిపోయింది? కథలో వచ్చిన సమస్య ఏంటి? ఇక అక్కినేని హీరోలు నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? అనే విషయాల్లోకి వెళ్తే…
ఈ మల్టీస్టారర్ చిత్రానికి దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వం వహించాల్సి ఉంది. జీ స్టూడియోస్, అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించేందుకు సిద్ధమయ్యాయి కూడా. జూలైలో షూటింగ్ ప్రారంభించి, 2027 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే లక్ష్యంతో ప్రణాళికలు కూడా సిద్ధం చేసినట్లు సమాచారం. అయితే కథ తుది రూపం దాల్చిన తర్వాత పరిస్థితులు మారిపోయాయి. అందుతున్న సమాచారం ప్రకారం, దర్శకుడు సిద్ధం చేసిన ఫైనల్ స్క్రిప్ట్తో నాగ చైతన్య, అఖిల్ పూర్తిగా సంతృప్తి చెందలేదని తెలుస్తోంది. కథలో ఇద్దరికీ కొన్ని సందేహాలు ఉండటంతో ప్రాజెక్ట్ను ముందుకు తీసుకెళ్లడం సరైన నిర్ణయం కాదని భావించినట్లు టాక్ వినిపిస్తోంది. ఇద్దరు హీరోలకు భిన్నమైన ప్రాజెక్ట్స్ ఉండటంతో, నాగార్జున కూడా ఈ దశలో సినిమాను ప్రారంభించకుండా వేచి చూడాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన ఇప్పటివరకు వెలువడకపోవడంతో, ప్రాజెక్ట్ నిలిచిపోయిందనే దానిపై ప్రకటన వచ్చే అవకాశాలు కూడా కనిపించడం లేదు.
Also Read
- Sandeep Reddy Vanga : ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్!
- Romanchakam Trailer: సందీప్ రెడ్డి వంగా ప్రెజెంట్స్.. ‘రోమాంచకం’ ట్రైలర్లో ఏదో గట్టిగానే ఉంది!
- Tollywood Debut: బిగ్ బాస్ బ్యూటీకి బిగ్ ఛాన్స్.. హీరోయిన్గా టాలీవుడ్లోకి ఎంట్రీ!
- Renukaswamy Case: రేణుకాస్వామి మర్డర్ కేసులో దర్శన్కు భారీ ఎదురుదెబ్బ..
మరోవైపు నాగ చైతన్య ఇప్పటికే వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆయన చేతిలో ప్రస్తుతం ‘దూత 2’తో పాటు దర్శకుడు క్లాక్స్తో ఒక కొత్త సినిమా, మరో హారర్ జానర్ ప్రాజెక్ట్ ఉన్నట్లు తెలుస్తోంది. విభిన్న కథలను ఎంచుకుంటూ కెరీర్ను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో ఉన్న చైతన్య, ఈ చిత్రాలపై పూర్తిగా దృష్టి పెట్టనున్నారని సమాచారం. అఖిల్ కూడా కొత్త ప్రాజెక్ట్ లతో వేగం పెంచారు. ప్రస్తుతం రెండు కొత్త కథలను పరిశీలిస్తున్న ఆయన, వాటిలో ఒక సినిమాను ఈ నెలలోనే ఖరారు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం ‘లెనిన్’ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న అఖిల్ ఈసారి మరింత బలమైన స్క్రిప్ట్తో ప్రేక్షకుల ముందుకు రావాలని భావిస్తున్నట్లు సినీ వర్గాల టాక్.
ఇక నాగార్జున విషయానికి వస్తే, తన కుమారులు తమ తమ ప్రాజెక్ట్లతో బిజీ అయిన తర్వాత ఆయన తన ప్రతిష్టాత్మక ‘కింగ్ 100’ ప్రాజెక్ట్పై పూర్తి దృష్టి పెట్టనున్నట్లు సమాచారం. అలాగే దసరా తర్వాత మరో కొత్త సినిమాకు కూడా ఆయన సంతకం చేసే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. మొత్తానికి అక్కినేని త్రయం కలిసి నటించే సినిమా ఇప్పట్లో సెట్స్పైకి వెళ్లే అవకాశాలు తగ్గినా, భవిష్యత్తులో మరింత బలమైన కథతో ఈ కల నిజమయ్యే అవకాశం మాత్రం పూర్తిగా కొట్టిపారేయలేం. అభిమానులు కూడా ఈ మల్టీస్టారర్ ప్రాజెక్ట్ మళ్లీ పట్టాలెక్కాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
తాజావార్తలు
-
Sandeep Reddy Vanga : ప్రభాస్ ‘స్పిరిట్’ కి A సర్టిఫికెట్ పక్కా.. నేను ఎంత గింజుకున్నా అంతే!
-
Modi-Rahul Gandhi: కులగణనపై మోడీకి ఖర్గే, రాహుల్గాంధీ లేఖ.. ఏముందంటే..!
-
Sandeep Reddy Vanga : ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్!
-
Power Bank Explosion : పవర్ బ్యాంక్ పేలి విద్యార్థికి తీవ్ర గాయాలు
-
OTR: మంత్రి కొండా సురేఖను కేబినెట్ నుంచి తప్పిస్తారా..?
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!