Pawan kalyan Introduces Akira Nandan to Prime Minister Modi: ఏపీలో ఎన్నికల కౌంటింగ్ ముగిసినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. జనసేనను 2014లో స్థాపించిన ఆయన 2019లో మొదటిసారి ప్రత్యక్ష ఎన్నికలకు వెళ్లారు. ఆ సమయంలో దారుణ పరాజయం ఎదురవడంతో తిరిగి 2024లో 21 సీట్లలో పోటీ చేసి 21 మందిని గెలిపించుకుని ఏపీ అసెంబ్లీకి వెళ్లబోతున్నారు. దానికి అదనంగా రెండు పార్లమెంట్ స్థానాలు కూడా జనసేన పార్టీకి దక్కాయి. ఇక ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ తెలుగుదేశం -బిజెపి- జనసేన కూటమిలో ముఖ్యుడిగా మారారు. కూటమి ఏర్పాటు కావడానికి పవన్ కళ్యాణ్ చొరవే కారణమని అందరూ భావిస్తున్నారు. అయితే ఎన్డీఏ సమావేశంలో పాల్గొనేందుకు తన మూడవ భార్య అన్నా లెజినోవాతో కలిసి పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లారు.
YS Jagan: రక్షణ లేకుండా పోయింది.. గవర్నర్ గారు వెంటనే జోక్యం చేసుకొండి..!
వీరి వెంట రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్ ల కుమారుడు ఆఖీరా నందన్ కూడా ఉన్నారు. మొన్న చంద్రబాబుతో భేటీ సమయంలో కూడా అఖీరా నందన్ తో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇప్పుడు అకీరా నందన్ ను ప్రధానమంత్రి మోడీకి పవన్ కళ్యాణ్ పరిచయం చేశారు. ఈ సందర్భంగా మోడీ అకిరా నందన్ మీద చేయి వేసి మాట్లాడుతున్న ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఇదే ఫోటోలో పవన్ భార్య అన్నా లెజినోవో కూడా కనిపిస్తున్నారు. మొత్తం మీద పవన్ కళ్యాణ్ తో పాటు అఖిరా నందన్ కూడా ఇప్పుడు వార్తల్లో నిలుస్తూ ఉండడం గమనార్హం.