దృశ్యం 2 సినిమాతో 250 కోట్లు రాబట్టి సూపర్ హిట్ కొట్టిన అజయ్ దేవగన్, లేటెస్ట్ గా భోలా సినిమాతో ఆడియన్స్ ముందుకి వచ్చాడు. ఖైదీ రీమేక్ గా తెరకెక్కిన భోలా సినిమా ఆడియన్స్ ని డిజప్పాయింట్ చేసింది. భోళా ఇచ్చిన షాక్ నుంచి తేరుకోవడానికి అజయ్ దేవగన్ ‘మైదాన్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకి రానున్నాడు. ఇండియన్ ఫుట్ బాల్ టీం మాజీ ప్లేయర్ అండ్ కోచ్ ‘సయ్యద్ అబ్దుల్ రహీమ్’ బయోపిక్ గా ‘మైదాన్’ సినిమా తెరకెక్కింది.
పాన్ ఇండియా రేంజులో రూపొందిన ఈ మూవీ గతేడాది జూన్ లోనే రిలీజ్ అవ్వాల్సింది. అనివార్య కారణాల వలన ఒకటి కాదు రెండు ఏకంగా ఇప్పటివరకూ ఏడు సార్లు మైదాన్ సినిమా వాయిదా పడింది. కొంతమంది సినీ అభిమానులైతే మైదాన్ సినిమాని మర్చిపోయి ఉంటారు కూడా. ఏడు సార్లు వాయిదా వేసిన తర్వాత ఈసారి మైదాన్ సినిమాని గ్యారెంటీగా రిలీజ్ చేస్తామంటూ మేకర్స్ ‘జూన్ 23’ని కొత్త రిలీజ్ డేట్ గా అనౌన్స్ చేసారు. రిలీజ్ డేట్ అనౌన్స్ చేసినా ప్రమోషన్స్ చెయ్యకుండా మేకర్స్ సైలెంట్ గా ఉండడంతో మైదాన్ సినిమా ఎనిమిదో సారి కూడా వాయిదా పడింది అనే మాట వినిపిస్తోంది. ఇదే జరిగితే మైదాన్ సినిమా థియేటర్ బిజినెస్ కి చాలా నష్టం వస్తుంది. కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ చేసినా హైప్ రావడం అయితే కష్టమే.
అమిత్ శర్మ డైరెక్ట్ చేసిన ఈ మూవీపై అజయ్ దేవగన్ కి చాలా హోప్స్ ఉన్నాయి. స్పోర్ట్స్ జోనర్ సినిమాలకి బౌండరీలు ఉండవు, ఎమోషన్ కనెక్ట్ అయితే చాలు భాషతో సంబంధం లేకుండా బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ జరిగిపోతుంది. ఇలాంటి మ్యాజిక్ కోచ్ ‘సయ్యద్ అబ్దుల్ రహీమ్’ లైఫ్ లో చాలానే ఉంది. వృత్తి పరంగా టీచర్ అయిన ‘సయ్యద్ అబ్దుల్ రహీమ్’ ఇండియన్ ఫుట్ బాల్ టీంలో ఒకప్పుడు ప్లేయర్, ఆ తర్వాత 1950 నుంచి 1963 వరకూ కోచ్ గా వ్యవహరించాడు. ‘సయ్యద్ అబ్దుల్ రహీమ్’ కోచ్ గా ఉన్న సమయం ఇండియన్ ఫుట్ బాల్ హిస్టరీలోనే గోల్డెన్ ఫేజ్ గా చెప్పుకోవచ్చు. ఒలంపిక్స్ లో ఆషియా నుంచి సెమిస్ చేరిన మొదటి టీంగా ఇండియ హిస్టరీ క్రియేట్ చేసింది. 1951, 1962లో ఏషియన్ చాంపియన్షిప్ లో ఇండియా గోల్డ్ మెడల్స్ ని కూడా గెలిచింది. ‘ది ఆర్కిటెక్ట్ ఆఫ్ మోడరన్ ఇండియన్ ఫుట్ బాల్’ గా పేరు తెచ్చుకున్న ‘సయ్యద్ అబ్దుల్ రహీమ్’ పాత్రలో అజయ్ దేవగన్ అద్భుతంగా నటించాడని ఇప్పటికే బాలీవుడ్ కథనాలు ప్రచురించింది. మరి అంత మంచి సినిమాని విడుదల చేయకుండా ఆలస్యం ఎందుకు చేస్తున్నారో మేకర్స్ కే తెలియాలి.