ఎం.ఎస్. రాజు దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం ‘7 డేస్ 6 నైట్స్’. సుమంత్ అశ్విన్, రోహన్, మెహర్ చాహల్, కృతికా శెట్టి నటించిన ఈ మూవీ జూన్ 24న విడుదల అవుతోంది. సోమవారం ఈ సినిమా కొత్త ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా విలేకరులతో ఎంఎస్ రాజు మాట్లాడుతూ ”కొత్త ట్రైలర్ చూడగానే యూత్ఫుల్ ఎంటర్ టైనర్ అని అర్థం అవుతుంది. ఈ సినిమాను లో-బడ్జెట్ సినిమాగా తోసేయాలని అనుకోలేదు. ప్రేక్షకులకు మంచి సినిమా ఇవ్వాలనే ట్రై చేశాం. చిన్న సినిమా ఎన్ని వండర్స్ క్రియేట్ చేస్తుందో చూపించాలని అనుకుంటున్నాం. ‘7 డేస్ 6 నైట్స్’ అనే బాంబు తీసుకొస్తున్నాం. తెలంగాణ, రాయలసీమ, ఆంధ్రా అన్నిచోట్లా ఎంత తక్కువ టికెట్ రేట్ ఉంటే అంతకు అమ్మమని డిస్ట్రిబ్యూటర్లకు చెప్పాను. ఓటీటీలో నేను డైరెక్ట్ చేసిన ‘డర్టీ హరి’లో పెద్ద హిట్. ఇప్పుడు ‘7 డేస్ 6 నైట్స్’ కూడా థియేటర్లలో అందరినీ మెప్పిస్తుంది. కాలేజీలు ఓపెన్ అయ్యాయి. యూత్ కు కావాల్సిన కంటెంట్ సినిమాలో ఉంది. అమ్మాయిలు, అబ్బాయిలు క్లాసులు ఎగ్గొడతారో? లేదో? చూడాలని ఉంది. ఈ సినిమాతో నిర్మాతలుగా మారిన మా అబ్బాయి, అమ్మాయికి ఆల్ ది బెస్ట్” అని అన్నారు.
ఎంఎస్ రాజు కుమార్తె రిషితా దేవి మాట్లాడుతూ ”సినిమా చూశా. నాకు బాగా నచ్చింది. ప్రేక్షకులు కూడా బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను” అని చెప్పారు.
హీరో కమ్ ప్రొడ్యూసర్ సుమంత్ అశ్విన్ మాట్లాడుతూ ”సినిమా రిలీజ్ కోసం ఎగ్జైటెడ్ గా ఉన్నాం. నిజాయతీగా చెప్పాలంటే నాకు’7 డేస్ 6 నైట్స్’ మాస్టర్ పీస్ లా కనిపించింది” అని చెబుతున్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాతల్లో ఒకరైన రజనీకాంత్.ఎస్, హీరోయిన్లు మెహర్ చాహల్, కృతికా శెట్టి, మరో హీరో రోహన్, లిరిక్ రైటర్ కృష్ణకాంత్ (కేకే), సంగీత దర్శకుడు సమర్థ్ గొల్లపూడి, కో ప్రొడ్యూసర్ శ్రీనివాసరాజు పాల్గొన్నారు.