Simham Navvindi: నలభై ఏళ్ళ ‘సింహం నవ్వింది!’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Simham Navvindi: నటరత్న యన్టీఆర్ తాను రాజకీయ రంగంలో అడుగు పెట్టే నాటికే తన నటవారసునిగా బాలకృష్ణను తీర్చిదిద్దారు. ఆ క్రమంలో యన్టీఆర్ ప్రధాన పాత్రలో, బాలకృష్ణ హీరోగా ‘సింహం నవ్వింది’ చిత్రాన్ని రామకృష్ణా సినీస్టూడియోస్ పతాకంపై నిర్మించారు. యన్టీఆర్ కు సన్నిహితుడైన దర్శకుడు డి.యోగానంద్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. యన్టీఆర్ పెద్ద కొడుకు జయకృష్ణ సమర్పకునిగా, మూడో కొడుకు హరికృష్ణ నిర్మాతగా, నాలుగో అబ్బాయి మోహన్ కృష్ణ సినిమాటోగ్రాఫర్ గా, ఐదో కుమారుడు బాలకృష్ణ హీరోగా ‘సింహం నవ్వింది’రూపొందించారు రామారావు. యన్టీఆర్ తొలిసారి 1983 జనవరి 9న ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఆ తరువాత రెండు నెలలలోపే ఈ చిత్రం జనం ముందు నిలచింది. 1983 మార్చి 3న విడుదలైన ‘సింహం నవ్వింది’ కామెడీ ప్రధానంగా రూపొందింది.
ఇంతకూ కథ ఏమిటంటే – నరసింహం ఇండస్ట్రియలిస్ట్. బ్రహ్మచారి. నియంతలా వ్యవహరిస్తూ ఉంటాడు. ఆయన వద్ద అసిస్టెంట్ మేనేజర్ గా పనిచేసే బాలకృష్ణ కష్టపడి పనిచేయడంతో బాస్ కు దగ్గరవుతాడు. బ్రహ్మచారి అయిన నరసింహం తన కంపెనీలో పనిచేసేవారు పెళ్ళి చేసుకోకూడదనీ నియమం అంటాడు. బాలకృష్ణ ప్రమోషన్ లిస్ట్ లో ఉంటాడు. అందువల్ల ప్రమోషన్ రాగానే తాను ప్రేమించిన రాధను పెళ్ళాడాలని భావిస్తాడు. కానీ, రాధ తండ్రి పానకాలు బలవంత పెట్టడంతో ఓ గుడిలో రాధ మెడలో మూడు ముళ్ళు వేస్తాడు బాలకృష్ణ. ఆ తరువాత హనీమూన్ కు ఓ ట్రావెలర్స్ బంగళాకు వెళతారు కొత్త జంట. అక్కడికి పనిమీద వెళుతూ నరసింహం కూడా దిగుతాడు. అక్కడ నుంచీ బాలకృష్ణ, రాధకు కష్టాలు మొదలవుతాయి. ఒంటరిగా ఉన్నానని రాధ చెబుతుంది. ఆమెకు తన కంపెనీలో ఉద్యోగం ఇస్తానంటాడు నరసింహం. ఆమె అన్న ఒక్క మాట నరసింహంను కలవర పెడుతుంది. అప్పుడు ఆమెకు తన గతాన్ని వివరిస్తాడు నరసింహం. ప్రేమలో మోసపోయిన కారణంగా తాను బ్రహ్మచారిగానే ఉండాల్సి వచ్చిందని చెబుతాడు. చివరకు నరసింహానికి బాలకృష్ణ, రాధ పెళ్ళి విషయం తెలుస్తుంది. అందువల్ల బాలకృష్ణకు అతను కోరుకున్న ప్రమోషన్ ఇస్తాడు, అయితే జీవితాంతం రాధకు అసిస్టెంట్ గానే ఉండాలనీ శిక్ష వేస్తాడు. అది విని బాలకృష్ణ కంగారు పడతాడు. అది చూసి సింహం లాంటి నరసింహం నవ్వుతాడు. కథ ముగుస్తుంది.
Also Read
- Swara Bhasker: ‘‘రామ మందిర తీర్పుతో బాధపడ్డా.. షారుఖ్, సల్మాన్లకు క్షమాపణలు’’.. స్వరా భాస్కర్ మరో వివాదం..
- Udaya Bhanu: 'పీఆర్' పాలిటిక్స్..ఉదయభాను బాధ కరెక్టే, కానీ తప్పదు?
- Prithviraj Sukumaran: రాజమౌళితో అంత ఈజీ కాదు, పిండేస్తారు.. పృథ్వీరాజ్ సుకుమారన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- Dragon Update: 'డ్రాగన్' డెడ్లైన్ మిస్సైతే..!
ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన కళారంజని నాయికగా నటించింది. అల్లు రామలింగయ్య, నూతన్ ప్రసాద్, త్యాగరాజు, రాళ్ళపల్లి, కె.కె.శర్మ, అన్నపూర్ణ, మమత, కాకినాడ శ్యామల, శ్రీలక్ష్మి ఇతర ముఖ్యపాత్రధారులు. అతిథి పాత్రలో ప్రభ కనిపించారు. పరుచూరి బ్రదర్స్ మాటలు రాసిన ఈ సినిమాకు కథ, దర్శకత్వం డి.యోగానంద్ అందించారు. సి.నారాయణ రెడ్డి, వేటూరి పాటలు రాయగా, చక్రవర్తి స్వరకల్పన చేశారు. ఇందులోని “ముంజలాంటి చిన్నదానా…”, “గువ్వా గువ్వా ఎక్కడికే…”, “హే భమ్ చిక భమ్…”, “జాబిలి వచ్చింది…”, “ఎలా ఎలా నీకుంది…”, “ఒక్కసారి నవ్వు…” అంటూ సాగే పాటలు అలరించాయి. యన్టీఆర్ పై చిత్రీకరించిన “ముంజలాంటి చిన్నదానా…” సాంగ్ ను వేటూరి రాయగా, ఎస్పీ బాలు ఆలపించారు. బాలకృష్ణ అన్ని పాటలను సినారె కలం పలికించగా, నందమూరి రాజా గానం చేశారు. అప్పటికే ముఖ్యమంత్రిగా జైత్రయాత్ర చేసిన యన్టీఆర్ ఈ లైటర్ వెయిన్ మూవీలో నటించడం అభిమానులకు అంతగా రుచించలేదు. దాంతో ‘సింహం నవ్వింది’ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయింది. బాలకృష్ణకు నటునిగా మంచి మార్కులు సంపాదించి పెట్టిందీ సినిమా. చిత్రమేమిటంటే, ఇదే కథను తరువాత 1987లో శివాజీగణేశన్, కార్తిక్ తో తమిళంలో ‘రాజా మరియాదై’ పేరుతో రీమేక్ చేశారు.
తాజావార్తలు
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Supreme Court: 6వ తరగతిలో త్రిభాషా విధానంపై సుప్రీం కోర్టు కీలక సూచన
-
Accident: కాకినాడ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. 30 మంది బంధువులు పెళ్లి వేడుక ముగించుకుని వెళ్తుండగా ఇలా..
-
Prithvi Shaw: యువ క్రికెటర్ పృథ్వీ షా–ఆకృతి అగర్వాల్ సంచలన నిర్ణయం.. పెళ్లికి ముందే బ్రేకప్..
-
Swara Bhasker: ‘‘రామ మందిర తీర్పుతో బాధపడ్డా.. షారుఖ్, సల్మాన్లకు క్షమాపణలు’’.. స్వరా భాస్కర్ మరో వివాదం..
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!