40 ఏళ్ళ ‘సత్యం-శివం’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగునాట తారలకు లభించే ఆదరణ అంతా ఇంతా కాదు. ఇక మహానటులకు అయితే మరపురాని ప్రేక్షకాభిమానం లభిస్తుంది. ఓ వైపు నటనతో ఆకట్టుకుంటూనే మరోవైపు స్టార్స్ గా తెలుగునాట జైత్రయాత్ర చేసిన ఘనత యన్టీఆర్, ఏయన్నార్ దే! వారిద్దరూ బాక్సాఫీసు వద్ద ఢీ అంటే ఢీ అంటూ పోటీపడ్డారు. అలాంటి ఈ ఇద్దరు ఏకంగా 14 చిత్రాలలో కలసి నటించారు. సూపర్ స్టార్ డమ్ చూసిన ఇద్దరు మహానటులు అన్ని చిత్రాలలో కలసి నటించింది ప్రపంచంలో మరెక్కడా కానరాదు. యన్టీఆర్, ఏయన్నార్ కలసి నటించిన తొలి చిత్రం ‘పల్లెటూరి పిల్ల’ (1950). వారిద్దరి కాంబోలో వచ్చిన చివరి చిత్రం ‘సత్యం-శివం’. 1981 మే 28న నటరత్న యన్టీఆర్ పుట్టినరోజు కానుకగా ఈ సినిమా విడుదలయింది. ఈ సినిమా వసూళ్ళ వర్షం కురిపించింది.
‘సుహాగ్’ ఆధారం…
‘సత్యం-శివం’ చిత్రం హిందీ సినిమా ‘సుహాగ్’ ఆధారంగా రూపొందింది. ఇందులో మరికొన్ని హిందీ చిత్రాల్లోని సన్నివేశాలను సందర్భానుసారంగా జోడించడం విశేషం. నేరచరిత గల నాగరాజు అనేవాడు భార్య, ఇద్దరు కొడుకులను వదిలేసి మరో అమ్మాయిని చేరదీస్తాడు. ఆ తల్లి తన ఇద్దరు కొడుకులతో జీవనం సాగించాలని అనుకుంటుంది. ఓ దొంగ ఆ ఇద్దరు బిడ్డల్లో ఒకరిని ఎత్తుకు వెళ్ళి, రౌడీగా పెంచుతాడు. అతనే శివం. తల్లిదగ్గర పెరిగి పెద్దయి ఇన్ స్పెక్టర్ అయినవాడు సత్యం. నాగరాజు దుర్మార్గానికి బలైపోయిన మరో స్త్రీ తన కూతురును కూడా అతని మొదటి భార్య దగ్గరకే చేర్చి కన్నుమూస్తుంది. ఆ ఆడబిడ్డను కూడా కన్నకూతురులా పెంచుతుంది ఆ మహాతల్లి. విధి ఈ ముగ్గురు తోబుట్టువులను ఏదో రూపంలో కలుపుతూ ఉంటుంది. సత్యం చెల్లెలిని శివం కూడా సొంత చెల్లిగా భావిస్తాడు. ఆమె ప్రేమించిన వాణ్ణి కాపాడబోయిన శివం, సత్యంకు విరోధి అవుతాడు. నాగరాజుకు వీళ్ళిద్దరూ తన కొడుకులు అన్న విషయం తెలియదు. అతని కారణంగానే సత్యం చూపు పోగొట్టుకుంటాడు. మళ్ళీ సత్యం, శివం దగ్గరవుతారు. సత్యం చూపు పోవడానికి కారకుడైన నాగరాజును తెలివిగా బురిడీ కొట్టించి, చట్టానికి పట్టిస్తారు. తాను చెడ్డవాడయినా, తనయులు మంచివాళ్ళని నాగరాజు తెలుసుకుంటాడు. తన కళ్ళను సత్యంకు దానం చేసి నాగరాజు జైలుకు పోవడంతో కథ ముగుస్తుంది.
Also Read
- Viswanath and Sons : అనిల్ రావిపూడి తరహాలో వెంకీ అట్లూరి... ఫస్ట్ సింగిల్ అనౌన్స్మెంట్ తోనే ప్రమోషన్స్ షురూ....
- Anandita Surgery Rumours : అలాంటి సర్జరీలు చేయించుకోలేదు... ట్రోలర్స్ పై మండిపడ్డ ఖుష్బూ కూతురు
- Dhurandhar: 'ధురంధర్’ స్క్రిప్ట్ పీఎంఓ నుంచి వచ్చిందా?.. నటుడు కీలక వ్యాఖ్యలు.!
- Gossip: పబ్ సాంగ్తో రాశి సింగ్ రచ్చ.. ఊపేస్తున్న ‘గాసిప్’ ఫస్ట్ సింగిల్
మోత మోగించిన పాటలు…
ఈ కథను కె.రాఘవేంద్రరావు తనదైన శైలిలో తెరకెక్కించారు. అందులోనూ శ్రీదేవి, రతి అగ్నిహోత్రి వంటి అందగత్తెలు ఉండడంతో కనువిందుగా పాటలు చిత్రీకరించారు. చక్రవర్తి బాణీల్లో వేటూరి సాహిత్యం భలేగా సాగింది. ఇందులోని “మోతగున్నావ్ పిల్లో…నా రాత ఎట్టాగుందో…” , “అందమే అందమా…”, “జంబలగిరి పంబ కాడ…”, “మంచి తరుణం మించి పోనీకు…”, “వెలుగునీడల్లో వెలుగనీ బంధం…” పాటలు ఆకట్టుకున్నాయి. సత్యానంద్ రచన కూడా అలరించింది. సత్యనారాయణ, పుష్పలత, మోహన్ బాబు, భానుచందర్, ప్రభాకర్ రెడ్డి, త్యాగరాజు, అల్లు రామలింగయ్య, మిక్కిలినేని, చలపతిరావు, పి.జె.శర్మ తదితరులు నటించారు.
అభిమానుల రచ్చ…
‘సత్యం-శివం’ సినిమా వచ్చే సమయానికి యన్టీఆర్, ఏయన్నార్ అభిమానుల మధ్య తీవ్రమైన పోటీ సాగుతోంది. ఎందువల్ల నంటే, ఆ యేడాది ఏయన్నార్ నటించిన ‘ప్రేమాభిషేకం’ ఘనవిజయం సాధించింది. ఆ సినిమా పలు కేంద్రాలలో విజయవిహారం చేయడం చూసి, అక్కినేని అభిమానులు రెచ్చిపోయారు. అయితే అప్పటికే యన్టీఆర్ కు అనేక సూపర్ హిట్స్ ఉన్న కారణంగా, ఏయన్నార్ ఫ్యాన్స్ కు పోటీగా రామారావు అభిమానులు కరపత్రాలు వెలువరించి రచ్చ చేయసాగారు. అలాంటి తరుణంలో వచ్చిన ‘సత్యం-శివం’ చిత్రంలో యన్టీఆర్ దే పైచేయిగా సాగింది. ఈ చిత్రానికి యన్టీఆర్ రెండో అల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు నిర్మాత. టైటిల్స్ లో డి.వెంకటేశ్వర్లు అని పడుతుంది. దాంతో యన్టీఆర్ పేరు సమర్పకునిగా ముందే టైటిల్స్ లో కనిపిస్తుంది. ఇక రామారావు రెగ్యులర్ మాస్ డైలాగ్స్, మారు వేషాలు కూడా ఇందులో అలరించాయి.
భలే విశేషం…
ఏయన్నార్ మ్యారేజ్ డే ఫిబ్రవరి 18న విడుదలైన ‘ప్రేమాభిషేకం’ సరిగా యన్టీఆర్ బర్త్ డే అయిన మే 28న వంద రోజులు పూర్తి చేసుకుంది. ఆ సినిమా 30 కేంద్రాలలో శతదినోత్సవం చేసుకుంది. అంతకు ముందే యన్టీఆర్ ‘అడవిరాముడు’ 32 కేంద్రాలలో వందరోజులు చూసింది. అందువల్ల అంత చేసి, ఇంత చేసి ‘ముప్పై’ కేంద్రాలే అంటూ యన్టీఆర్ ఫ్యాన్స్ ఎద్దేవా చేశారు. ఇలా ఫ్యాన్స్ పోటీతో ‘సత్యం-శివం’ భలేగా ఆకట్టుకుంది. ఈ సినిమా తొలివారం యాభై లక్షలకు పైగా వసూలు చేసి, ఆ రోజుల్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. నాలుగు వారాల వరకూ బాగానే అలరించిన ‘సత్యం-శివం’ తరువాత ఆ ఊపును కొనసాగించలేక పోయింది. విజయవాడలో డైరెక్ట్ హండ్రెడ్ డేస్ చూసింది. ఏది ఏమైనా యన్టీఆర్, ఏయన్నార్ కలసి నటించిన చివరి చిత్రంగా ‘సత్యం-శివం’ నిలచిపోయింది.
(మే 28తో ‘సత్యం-శివం’కు నలభై ఏళ్ళు)
తాజావార్తలు
-
T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్కు భారీ షాక్.. ప్రపంచ కప్కు మ్యాచ్ విన్నర్ దూరం!
-
FIFA World Cup 2026: చరిత్ర సృష్టించిన కెనడా.. ‘జొనాథన్ డేవిడ్’ హ్యాట్రిక్ గోల్స్.! ఖతార్పై 6-0 భారీ విజయం.!
-
Secunderabad: కంటోన్మెంట్లో బ్రిటిష్ పేర్లు తొలగింపు.. 21 రోడ్లు, 3 బజార్లకు వీర జవాన్లు, మహనీయుల నామకరణం!
-
Telegram: నీట్ పేపర్ లీక్ కేసు.. టెలిగ్రామ్కు ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ..
-
Sreesanth: టీమిండియాకు గౌతమ్ గంభీర్ అవసరమా?.. శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
144Hz రిఫ్రెష్ రేట్తో Hisense E8S ULED Mini-LED టీవీలు భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Tilak Varma-Siraj: తెలుగు ప్లేయర్స్ సిరాజ్, తిలక్కు లీగల్ నోటీసులు.. ఇద్దరు టాలీవుడ్ హీరోస్కు కూడా!
-
Smriti Mandhana: క్రికెట్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా స్మృతి మంధాన.. పురుష క్రికెటర్లకు కూడా సాధ్యం కాని రేర్ రికార్డు!
-
పార్లమెంట్కూ చేరిన FIFA World Cup జోష్.. వైకింగ్ పడవ ప్రయాణాన్ని అనుకరించిన ఎంపీలు.! వీడియో వైరల్..
-
Sreesanth: ఆమె లేకపోతే ఆత్మహత్య చేసుకునేవాడిని.. తీహార్ జైల్లో నరకం అనుభవించా!