LPG dealerships: గ్యాస్ ఏజెన్సీ ఆఫర్.. ఈ తరహా మెసేజీలు వస్తున్నాయా? ప్రభుత్వం ఏం చెబుతుందంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
LPG dealerships: గ్యాస్ ఏజెన్సీ వస్తోందని మెసేజ్ వచ్చిందా? ముందుగా ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే ఇప్పుడు సైబర్ మోసగాళ్లు ప్రభుత్వ చమురు సంస్థల పేర్లను అడ్డంగా వాడుకుని కొత్త తరహా మోసాలకు తెరలేపుతున్నారు. ఎల్పీజీ డీలర్షిప్ ఇస్తామంటూ ఫోన్లకు మెసేజ్లు, ఈమెయిల్లు పంపిస్తూ అమాయకులను లక్ష్యంగా చేసుకుంటున్నారు. తాజాగా ఈ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెక్ యూనిట్ కీలక హెచ్చరిక జారీ చేసింది.
ఇటీవలి కాలంలో దేశవ్యాప్తంగా అనేక మంది ప్రజలకు ప్రభుత్వ రంగ చమురు కంపెనీల పేర్లతో నకిలీ ఈమెయిల్లు, ఎస్ఎంఎస్లు, వెబ్సైట్ లింకులు చేరుతున్నాయి. ఇవి చూడటానికి పూర్తిగా అధికారిక సమాచారంలానే కనిపిస్తున్నాయి. దీంతో చాలామంది అవి నిజమని నమ్మే ప్రమాదం ఉంది. ముఖ్యంగా ఎల్పీజీ డీలర్షిప్ లేదా గ్యాస్ ఏజెన్సీ కేటాయిస్తామని చెప్పి ప్రజలను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. ఉద్యోగం లేదా వ్యాపార అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారిని టార్గెట్ చేస్తూ ఈ మోసాలు జరుగుతున్నట్లు అధికారులు చెబుతున్నారు.
Also Read
- White Shoes Cleaning Tip: వైట్ షూపై మొండి మరకలు పోవడం లేదా?.. రూ.10తో తెల్లటి బూట్లకు కొత్త లుక్..
- Diabetes: తల్లిదండ్రులకు మధుమేహం ఉంటే మీకు వస్తుందా?
- Soft Roti Tips: పెనం నుంచి తీయగానే రోటీ గట్టిపడిపోతోందా? ఈ సింపుల్ టిప్తో రోజంతా సాఫ్ట్గా!
- T-Shirt Hacks: మీ పాత టీ-షర్ట్లను పడేస్తున్నారా? ఒక్కసారి ఈ ట్రిక్ చూడండి.. 4 వస్తువులు ఫ్రీగా తయారు చేసుకోవచ్చు!
ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెక్ యూనిట్ వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ నకిలీ సందేశాల వెనుక ఉన్నవారు ప్రజల ఆధార్ నంబర్, పాన్ కార్డు వివరాలు, బ్యాంకు ఖాతా సమాచారం వంటి వ్యక్తిగత సమాచారాన్ని సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాదు రిజిస్ట్రేషన్ ఫీజు, ప్రాసెసింగ్ ఛార్జీలు లేదా తిరిగి చెల్లించే డిపాజిట్ పేరుతో డబ్బులు కూడా అడుగుతున్నారు. వాస్తవానికి ఇవన్నీ ఫిషింగ్ మోసాల్లో భాగమని పీఐబీ స్పష్టం చేసింది.
ప్రభుత్వ రంగ చమురు సంస్థలు ఎప్పుడూ వ్యక్తిగత ఈమెయిల్ ఐడీల ద్వారా, ఎస్ఎంఎస్ల ద్వారా లేదా వాట్సాప్ సందేశాల ద్వారా డీలర్షిప్ ఆఫర్లు పంపవని పీఐబీ వెల్లడించింది. అలాగే డీలర్ల ఎంపిక బాధ్యతను ఎలాంటి వ్యక్తులకు లేదా ప్రైవేట్ సంస్థలకు అప్పగించవని కూడా స్పష్టం చేసింది. అధికారిక విధానాల వెలుపల ఎలాంటి రుసుములు చెల్లించమని కోరవని పేర్కొంది. కాబట్టి ఇలాంటి సందేశాలు అందితే వెంటనే వాటిని అనుమానాస్పదంగా భావించి జాగ్రత్త పడాలని సూచించింది.
ఎల్పీజీ డీలర్షిప్ కోసం దరఖాస్తు చేయాలనుకునే వారు అధికారిక ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్ సెలెక్షన్ పోర్టల్ను మాత్రమే ఉపయోగించాలని అధికారులు సూచిస్తున్నారు. ఇతర వెబ్సైట్లు, లింకులు లేదా మెసేజ్లలో ఇచ్చిన దరఖాస్తు అవకాశాలను నమ్మడం ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు. ఒక చిన్న నిర్లక్ష్యం వల్ల వ్యక్తిగత సమాచారం మాత్రమే కాదు, బ్యాంకు ఖాతాల్లోని డబ్బు కూడా కోల్పోయే ప్రమాదం ఉంది.
సైబర్ మోసాల నుంచి రక్షణ పొందాలంటే తెలియని వ్యక్తుల ఖాతాలకు డబ్బులు బదిలీ చేయకూడదు. అపరిచిత నంబర్ల నుంచి వచ్చిన మెసేజ్లు లేదా ఈమెయిల్లకు ఆధార్, పాన్, బ్యాంకు వివరాలు పంపకూడదు. ప్రభుత్వ పథకాలు, డీలర్షిప్లు లేదా ఏజెన్సీలకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పుడూ అధికారిక ప్రభుత్వ వెబ్సైట్లలోనే ధృవీకరించుకోవాలి. డిజిటల్ యుగంలో అప్రమత్తతే అతిపెద్ద రక్షణ అని నిపుణులు చెబుతున్నారు.
తాజావార్తలు
-
Rain Alert: ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం.. రెండు రోజుల పాటు వర్షాలు!
-
Shruti Haasan: AI డీప్ఫేక్లపై శృతి హాసన్కు హైకోర్టు రక్షణ.. కీలక ఆదేశాలు!
-
Redmi 17 5G: రెడ్ మీ 17 5G భారత్లో లాంచ్.. 7900mAh బ్యాటరీ.. 50MP కెమెరా!.. ధర, ఫీచర్లు ఇవే
-
Gargi story Explained: నరమేధపు నేలపై పూసిన గులాబీ! 200 ఏళ్ల తర్వాత ఆ గ్రామంలో పుట్టిన తొలి ఆడపిల్ల!
-
Warangal Politics: కొండా సురేఖ బర్తరఫ్తో సైలెంట్ మోడ్లోకి వరంగల్ రాజకీయాలు.. గుండు సుధారాణి పదవితో కొత్త అలక!
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!