LPG dealerships: గ్యాస్ ఏజెన్సీ ఆఫర్.. ఈ తరహా మెసేజీలు వస్తున్నాయా? ప్రభుత్వం ఏం చెబుతుందంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
LPG dealerships: గ్యాస్ ఏజెన్సీ వస్తోందని మెసేజ్ వచ్చిందా? ముందుగా ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే ఇప్పుడు సైబర్ మోసగాళ్లు ప్రభుత్వ చమురు సంస్థల పేర్లను అడ్డంగా వాడుకుని కొత్త తరహా మోసాలకు తెరలేపుతున్నారు. ఎల్పీజీ డీలర్షిప్ ఇస్తామంటూ ఫోన్లకు మెసేజ్లు, ఈమెయిల్లు పంపిస్తూ అమాయకులను లక్ష్యంగా చేసుకుంటున్నారు. తాజాగా ఈ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెక్ యూనిట్ కీలక హెచ్చరిక జారీ చేసింది.
ఇటీవలి కాలంలో దేశవ్యాప్తంగా అనేక మంది ప్రజలకు ప్రభుత్వ రంగ చమురు కంపెనీల పేర్లతో నకిలీ ఈమెయిల్లు, ఎస్ఎంఎస్లు, వెబ్సైట్ లింకులు చేరుతున్నాయి. ఇవి చూడటానికి పూర్తిగా అధికారిక సమాచారంలానే కనిపిస్తున్నాయి. దీంతో చాలామంది అవి నిజమని నమ్మే ప్రమాదం ఉంది. ముఖ్యంగా ఎల్పీజీ డీలర్షిప్ లేదా గ్యాస్ ఏజెన్సీ కేటాయిస్తామని చెప్పి ప్రజలను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. ఉద్యోగం లేదా వ్యాపార అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారిని టార్గెట్ చేస్తూ ఈ మోసాలు జరుగుతున్నట్లు అధికారులు చెబుతున్నారు.
Also Read
- Vastu Tips: ఇంట్లో చనిపోయిన వారి ఫోటోలు ఎక్కడ పెట్టాలి.? వాస్తు శాస్త్రం చెబుతుంది ఇదే..
- Rainy Season Tips: వర్షా కాలంలో ఉతికిన బట్టలు త్వరగా ఆరాలంటే ఇలా చేయండి.. బ్యాడ్ స్మెల్ కూడా రాదు!
- Diabetes Diet: రోటీ vs అన్నం.. డయాబెటిస్ రోగులకు ఏది బెస్ట్?
- Fast Food Side Effects: పళ్ల సమస్యల నుంచి క్యాన్సర్ వరకు.. ఫాస్ట్ ఫుడ్ ప్రభావం.. నిపుణుల హెచ్చరిక
ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెక్ యూనిట్ వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ నకిలీ సందేశాల వెనుక ఉన్నవారు ప్రజల ఆధార్ నంబర్, పాన్ కార్డు వివరాలు, బ్యాంకు ఖాతా సమాచారం వంటి వ్యక్తిగత సమాచారాన్ని సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాదు రిజిస్ట్రేషన్ ఫీజు, ప్రాసెసింగ్ ఛార్జీలు లేదా తిరిగి చెల్లించే డిపాజిట్ పేరుతో డబ్బులు కూడా అడుగుతున్నారు. వాస్తవానికి ఇవన్నీ ఫిషింగ్ మోసాల్లో భాగమని పీఐబీ స్పష్టం చేసింది.
ప్రభుత్వ రంగ చమురు సంస్థలు ఎప్పుడూ వ్యక్తిగత ఈమెయిల్ ఐడీల ద్వారా, ఎస్ఎంఎస్ల ద్వారా లేదా వాట్సాప్ సందేశాల ద్వారా డీలర్షిప్ ఆఫర్లు పంపవని పీఐబీ వెల్లడించింది. అలాగే డీలర్ల ఎంపిక బాధ్యతను ఎలాంటి వ్యక్తులకు లేదా ప్రైవేట్ సంస్థలకు అప్పగించవని కూడా స్పష్టం చేసింది. అధికారిక విధానాల వెలుపల ఎలాంటి రుసుములు చెల్లించమని కోరవని పేర్కొంది. కాబట్టి ఇలాంటి సందేశాలు అందితే వెంటనే వాటిని అనుమానాస్పదంగా భావించి జాగ్రత్త పడాలని సూచించింది.
ఎల్పీజీ డీలర్షిప్ కోసం దరఖాస్తు చేయాలనుకునే వారు అధికారిక ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్ సెలెక్షన్ పోర్టల్ను మాత్రమే ఉపయోగించాలని అధికారులు సూచిస్తున్నారు. ఇతర వెబ్సైట్లు, లింకులు లేదా మెసేజ్లలో ఇచ్చిన దరఖాస్తు అవకాశాలను నమ్మడం ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు. ఒక చిన్న నిర్లక్ష్యం వల్ల వ్యక్తిగత సమాచారం మాత్రమే కాదు, బ్యాంకు ఖాతాల్లోని డబ్బు కూడా కోల్పోయే ప్రమాదం ఉంది.
సైబర్ మోసాల నుంచి రక్షణ పొందాలంటే తెలియని వ్యక్తుల ఖాతాలకు డబ్బులు బదిలీ చేయకూడదు. అపరిచిత నంబర్ల నుంచి వచ్చిన మెసేజ్లు లేదా ఈమెయిల్లకు ఆధార్, పాన్, బ్యాంకు వివరాలు పంపకూడదు. ప్రభుత్వ పథకాలు, డీలర్షిప్లు లేదా ఏజెన్సీలకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పుడూ అధికారిక ప్రభుత్వ వెబ్సైట్లలోనే ధృవీకరించుకోవాలి. డిజిటల్ యుగంలో అప్రమత్తతే అతిపెద్ద రక్షణ అని నిపుణులు చెబుతున్నారు.
తాజావార్తలు
-
Tilak Varma: నిన్న విధ్వంసకర బ్యాటింగ్.. నేడు అసెంబ్లీలో తిలక్ వర్మ..
-
CM Vijay: పెరియార్ ఆదర్శమే, కానీ దేవుడిపైనే మా నమ్మకం..
-
France: ఫ్రాన్స్లో ఠారెత్తిస్తున్న ఎండలు.. 18 మంది మృతి
-
Harish Rao : ‘రైతు ఆశీర్వాద సభ’ కాదు.. ‘రైతు క్షమాపణ సభ’ పెట్టుకోండి.!
-
Vastu Tips: ఇంట్లో చనిపోయిన వారి ఫోటోలు ఎక్కడ పెట్టాలి.? వాస్తు శాస్త్రం చెబుతుంది ఇదే..
ట్రెండింగ్
-
మళ్లీ అందుబాటులోకి Telegram.. కానీ వారికీ మాత్రం.!
-
MS Dhoni: భారత క్రికెట్ చరిత్రలో నేడు ప్రత్యేకమైన రోజు.. ప్రపంచంలోనే ఏకైక కెప్టెన్గా ఎంఎస్ ధోనీ చరిత్ర!
-
11,000mAh భారీ బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్, IP69K రేటింగ్ ప్రత్యేకతలతో HONOR X80 Pro Max లాంచ్.! ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi Jersey: వైభవ్ సూర్యవంశీ చేతికి టీమిండియా జెర్సీ.. బుడ్డోడికి దిగ్గజాల జెర్సీ నంబర్!
-
Vaibhav Suryavanshi: అది మంచి పద్ధతి కాదు.. వైభవ్ అలా చేయాల్సింది కాదు!