Vegetables And Fruits: రంగులను బట్టి పండ్లు, కూరగాయల్లో పోషకాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vegetables And Fruits: కూరగాయలు, పండ్లు వివిధ ఆకర్షణీయమైన రంగుల్లో ఉంటాయి. ఇలా ఆకర్షణీయమైన రంగుల్లో ఉండే కూరగాయలు, పండ్లలో విలువైన పోషకాలు ఉంటాయని ఎవరికైనా తెలుసా.. ఒక్కో రంగుకు ఒక్కో బెనిఫిట్ ఉంటుందంట మరీ.. అదేంటీ కూరగాయలు, పండ్లకు రంగులను బట్టి పోషకాలు ఉంటాయా? అదేంటీ అనుకుంటున్నారా.. అవునంటా.. ఏ రంగు కూరగాయ, పండులో ఎలాంటి పోషకాలు, బెనిఫిట్స్ ఉంటాయో చూద్ధాం. ఆకర్షణీయమైన రంగులతో కూడిన పండ్లు, కూరగాయల్లో ఉండే ఫైటోకెమికల్స్ను బట్టి పండ్లు, కూరగాయలకు ఆయా రంగులు సమకూరతాయని నిపుణులు చెబుతున్నారు. వాటిలో ఒక్కో రంగుకు కొన్ని నిర్దిష్టమైన ఆరోగ్య ప్రయోజనాలుంటాయని చెబుతున్నారు.. అవేంటంటే…
Read also: Priya Prakash: నీ కళ్లల్లో ఉందో మైకం…
Also Read
- Ragi Egg Dosa: బరువు తగ్గాలా? షుగర్ కంట్రోల్ అవ్వాలా? ఉదయం బ్రేక్ఫాస్ట్లో ఈ దోశ తింటే చాలు!
- Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే 'రాగి కుడుములు' చేసేయండి ఇలా..!
- Gulab Lassi Recipe: హీట్కు చెక్ పెట్టే షాహీ గులాబ్ లస్సీ.. ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోండి..!
- Broiler Chicken Facts: బ్రాయిలర్ కోళ్లకు నిజంగా హార్మోన్లు ఇస్తారా..? చికెన్పై ఉన్న అపోహల వెనుక అసలు నిజం ఇదే..
ఆకుపచ్చ రంగుతో కూడిన పండ్లు, కూరగాయలను తినడం వల్ల జీర్ణశక్తి, కాలేయ పనితీరు మెరుగవుతుంది. దంతాలు, ఎముకలు బలపడతాయి. రోగనిరోధకశక్తి కూడా పెరుగుతుంది. ఇటువంటి బెనిఫిట్స్ కూరగాయల్లో సొర, బీర, బెండకాయలతో పాటు.. జామ, అవకాడొ, ద్రాక్ష మొదలైన పండ్లు తినాలి. పర్పుల్, నీలం రంగుతో కూడిన పండ్లు, కూరగాయలను తినడం ద్వరా జ్ఞాపకశక్తి పెరుగుతుంది. గుండె, రక్తనాళాలు, మూత్రాశయాల ఆరోగ్యం మెరుగవుతుంది. ఇందుకోసం ద్రాక్ష, చిలగడదుంప, క్యాబేజీ, బీట్రూట్ తినాలి. ఎరుపు రంగు పండ్లు, కూరగాయలను తింటే గుండె బలపడుతుంది. వ్యాధినిరోధకశక్తి పెరుగుతుంది. కణ ఉత్పత్తి పెరుగుతుంది. అధిక రక్తపోటు తగ్గడంతో పాటు చర్మపు ఆరోగ్యం మెరుగవుతుంది. ఇవి కావాలంటే రెడ్ క్యాప్సికం, టమాటా, పండు మిరప, చెర్రీ తినాలి.
Read also: VIDEO : ఇండస్ట్రీలో వీళ్ళు ఉన్నారంటే దానికి కారణం రాకేష్ మాస్టర్
పసుపు, నారింజ రంగు కూరగాయలు, పండ్లను తింటే కీళ్లు, కణజాలాలు, మృదులాస్థి మెరుగుపడతాయి. చర్మపు కొల్లాజెన్ వృద్ధి చెందుతుంది. ఇందుకోసం ఎల్లో క్యాప్సికం, ఆరెంజ్, ఎల్లో జుకినీ, అరటి, దోసపండు తినాలని సూచిస్తున్నారు. ఇక తెలుపు, గోధుమ రంగులోని కూరగాయలు, పండ్లు తింటే పెద్దపేగులు, పొట్ట ఆరోగ్యం మెరుగవుతుంది. అల్సర్లు తగ్గుతాయి. అసిడిటీ అదుపులోకొస్తుంది. ఈ బెనిఫిట్స్ పొందాలంటే… వెల్లుల్లి, ఉల్లి, బంగాళాదుంపలు, చామ దుంపలు తినాలి. అంటే ఇకపై మనకు మన శరీరంలో ఎటువంటి అవసరాలు ఉన్నాయో తెలుసుకొని అటువంటి కూరగాయలు, పండ్లను తింటే మన ఆరోగ్యాన్ని మనమే జాగ్రత్తగా కాపాడుకో గలము. కాబట్టి ఇకపై మీరు తినే కూరగాయలు, పండ్లలో ఏమేమీ బెనిఫిట్స్ ఉంటున్నాయో చూసుకొని తింటే బాగుంటుంది కదా..
తాజావార్తలు
-
Tech Layoffs: ‘‘60 రోజులు లేదా అమెరికా వదలాలి’’.. లేఆఫ్స్తో H-1B ఇండియన్లలో భయం..
-
Kejriwal: కేజ్రీవాల్ ఎన్నికల్లో పోటీ చేయొద్దనడానికి మీరెవరు? పిటిషనర్కు ఢిల్లీ హైకోర్టు చీవాట్లు
-
WFH: ఆ బ్యాంక్ ఉద్యోగులకు శుభవార్త.. వారంలో రెండు రోజులు వర్క్ ఫ్రం హోం..
-
Chiranjeevi : ఏపీసెట్ టాపర్ రుషి.. కలను నిజం చేసి, ల్యాప్టాప్ బహుకరించిన మెగాస్టార్
-
Weather Updates : తెలంగాణలో ఠారెత్తిస్తున్న ఎండలు.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!