Amun Fruit: గర్భిణీలు నేరేడు పండు తింటున్నారా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వేసవి చివర్లో, వర్షా కాలం ఆరంభంలో అధికంగా కనిపించే పండు నేరేడు పండు. చిన్ననాటి జ్ఞాపకాలు గా ఉండే ఈ నలుపు ఊదా రంగు పండు రుచి పరంగా అద్భుతమైనదే కాదు, ఆరోగ్యానికి అనేక లాభాలు కూడా కలిగిస్తుంది. నేరేడు పండ్లలో గ్లైసమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. ఇది శరీరంలో బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచుతుంది. అయితే ఎక్కువగా తినడం వల్ల బెనిఫిట్స్ కాస్త సైడ్ ఎఫెక్ట్స్గా మారుతాయట. కాబట్టి ఎక్కువగా తినడం కంట్రోల్ చేసుకుంటే మంచిదని చెప్తున్నారు. అంతే కాదు ఎక్కువగా తింటే హైపోటెన్షన్ పెరిగి.. బీపీ రాపిడ్గా తగ్గిపోతుంది. ఇది కళ్లు తిరగడం వంటి సమస్యలను పెంచుతుంది. ప్రత్యేకించి గర్భిణీ స్త్రీలు ఈ పండ్లు తినాలా? తింటే ఎంత మోతాదులో తినాలి? అన్న సందేహాలు చాలామందిలో ఉంటాయి. వాటికి సమాధానమే ఈ వ్యాసం.
ఆరోగ్య ప్రయోజనాలు:
నేరేడు జీర్ణం మెరుగుపరుస్తుంది – మలబద్ధకం, అజీర్ణ సమస్యలు ఉన్నవారికి మంచి సహాయం చేస్తుంది. తక్కువ కేలరీలతో తక్షణ శక్తిని ఇచ్చే పండు కావడం వల్ల అలసటను తగ్గిస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. రక్తపోటును నియంత్రించే, గుండెను కాపాడే గుణాలు ఇందులో ఉన్నాయి. కాలేయం, ప్రేగులు, ఆర్థరైటిస్ సమస్యలకి ఉపశమనం అందిస్తాయి.
Also Read
- Water Tank Cleaning Tips: వాటర్ ట్యాంక్లో మురికి పేరుకుపోయిందా? ఈ చిట్కాలతో నిమిషాల్లో శుభ్రం చేయండి
- Blood Donate: రక్తదానం చేస్తే శరీరం బలహీనపడుతుందా..? డాక్టర్లు చెబుతున్న అసలు నిజం ఇదే..
- Cooking Hacks: ఇల్లాళ్లకు స్మార్ట్ హెల్ప్.. ఈ వంటింటి చిట్కాలు తెలిస్తే మీ పనులు నిమిషాల్లో అయిపోతాయి!
- Ragi Semiya Puttu: రాగులతో ఇలాంటి స్నాక్ ఎప్పుడైనా తిన్నారా? టేస్ట్ అద్భుతం, ఆరోగ్యం గ్యారెంటీ!
హానికర ప్రభావాలు (అధికంగా తినితే):
ఈ నేరేడు అధికంగా తినడం వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడవచ్చు, ఇందులో ఉండే ‘ఆక్సలేట్’ అనే పదార్థం, శరీరంలో కాల్షియం తో కలిసి రాళ్లకు దారి తీస్తుంది. అలాగే రక్తపోటు అధికంగా తగ్గిపోవచ్చు, తల నొప్పి, తిమ్మిరి వంటి సమస్యలు రావచ్చు. ముఖ్యంగా జీర్ణ సమస్యలు గ్యాస్, ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలు అధిక మోతాదులో తింటే ఏర్పడతాయి. దంత ఆరోగ్యం, నోట్లో ఆమ్లం ఉత్పత్తి పెరిగి దంత ఎనామెల్ను ప్రభావితం చేస్తుంది.
గర్భిణీలకు ప్రత్యేక సూచనలు:
గర్భిణీ స్త్రీలు ప్రత్యేకంగా 6 నెలల తర్వాత ఈ పండును తినాలంటే డాక్టర్ సలహా తీసుకోవడం చాలా అవసరం. హార్మోన్ల మార్పులు, జీర్ణ సంబంధిత సున్నిత పరిస్థితులు ఈ దశలో ఎక్కువగా ఉండటంతో, ఏ పండును అయినా మితంగా తీసుకోవాలి. సాధారణంగా, రోజుకు 100 గ్రాముల వరకే తినడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. నెరేడు తిన్న వెంటనే నోటిని కడగడం, బ్రష్ చేయడం అవసరం. ముఖ్యంగా రాత్రిపూట తినే పండ్లు మరింత జాగ్రత్త అవసరం.
ముగింపు
నేరేడు పండు సహజంగా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. కానీ అది మితంగా తీసుకున్నప్పుడు మాత్రమే మంచిది. ముఖ్యంగా గర్భిణీల విషయంలో ఈ పండును తీసుకునే ముందు వైద్య సలహా తీసుకోవడం చాలా అవసరం. రోజువారీ పరిమితిని పాటిస్తూ, శుభ్రమైన పండును, అవసరమైన జాగ్రత్తలతో తింటే ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
తాజావార్తలు
-
CM Revanth Reddy Flight Diverted: హైదరాబాద్లో భారీ వర్షాలు.. సీఎం రేవంత్ రెడ్డి విమానం బెంగళూరుకు డైవర్ట్
-
Family Suicide: ఇంత ఘోరమా? ముక్కుపచ్చలారని పసిబిడ్డల పట్ల విలన్గా మారిన తండ్రి
-
TCS Engineer Suicide: TCSలో సీనియర్ల వేధింపులు.. ఉద్యోగి ఆత్మహత్య..
-
Fenya: ‘అమమ్మ’ అంటే డబ్బు, ‘చెత్త’ అంటే పోలీసులు..! దొంగలకు ఆయుధంగా మారిన రహస్య భాష..
-
Netanyahu: నేను ప్రధానిగా ఉన్నంత కాలం ఇరాన్ అణ్వస్త్రంగా మారదు.. నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!