Fairness Cream: ఫెయిర్నెస్ క్రీమ్లతో భారత్లో పెరుగుతున్న కిడ్నీ సమస్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fairness Cream: భారతదేశంలో చాలా మంది ఫెయిర్నెస్ క్రీములు వాడటం అలవాటుగా మారింది. చర్మం నిగారింపుగా కనిపించాలని చాలా మంది వీటిని వాడుతున్నారు. అయితే, వీటి వల్ల భారత్లో కిడ్నీ సమస్యలు పెరుగున్నట్లు తాజాగా ఓ అధ్యయనంలో తేలింది. భారతదేశం ఫెయిర్నెస్ క్రీమ్లకు లాభదాయకమైన మార్కెట్గా ఉంది. అయితే, వీటిల్లో ఉండే పాదరసం వల్ల మూత్రపిండాలకు హాని కలిగిస్తోంది.
కిడ్నీ ఇంటర్నేషనల్ అనే మెడికల్ జర్నల్లో ప్రచురించబడిన అధ్యయనం ప్రకారం.. ఈ క్రీముల్లో ఎక్కువగా పాదరసం ఉండటంతో మెంబ్రానస్ నెఫ్రోపతి(ఎంఎన్) కేసులు పెరుగుతున్నాయని, ఈ పరిస్థితి కిడ్నీ ఫిల్టర్లను దెబ్బతీస్తుంది. ప్రోటీన్ లీకేజీలకు కారణమవుతోంది. ఎంఎన్ అనేది ‘ఆటోఇమ్యూన్ డిజీజ్’’, దీని ఫలితంగా నెఫ్రోటిక్ సిండ్రోమ్ ఏర్పడుతోందని, దీని వల్ల శరీరం నుంచి అధిక ప్రొటీన్ విసర్జింపబడుతోందని స్టడీ తేల్చింది.
Also Read
- Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
- Masala Gutti Vankaya Recipe: బగారా రైస్, పులావ్లోకి అదిరిపోయే "మసాలా గుత్తివంకాయ" చేసేయండి ఇలా..! లొట్టలేసుకుంటూ తినేస్తారంతే.!
- Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. 'మునగాకు పొడి'.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
- Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
పాదరసం చర్మం ద్వారా శరీరంలోకి చేరి, మూత్రపిండాల ఫిల్టర్లను నాశనం చేస్తున్నాయని, ఇది నెఫ్రోటిక్ సిండ్రోమ్ కేసుల పెరుగుదలకు దారి తీస్తుందని పరిశోధకుల్లో ఒకరైన డాక్టర్ సజీష్ శివదాస్ వెల్లడించారు. భారతదేశంలోని పలు క్రీములు, చర్మం రంగుపై త్వరగా ప్రభావం ఉంటుందని ప్రకటనలు ఇస్తాయని, వినియోగాన్ని ఆపడం వల్ల చర్మం మరింత డార్క్ కలర్లోకి మారుతుందని ఆయన చెప్పారు. జూలై 2021, సెప్టెంబర్ 2023 మధ్య నివేదించబడిని 22 ఎంఎన్ కేసులపై అధ్యయనం జరిగింది. అలసట, తేలిక పాటి ఎడేమా, మూత్రంలో నురుగ లక్షణాలతో ఉన్న రోగులని పరిశీలిస్తే.. వీరిలో ముగ్గురు రోగులకు ఎడెమా ఉంది, కానీ మిగిలిన వారిందరిలో మూత్రంలో ప్రోటీన్ స్థాయిలు ఎక్కువగా ఉన్నట్లు తేలింది. ఒక రోగి మెదడులో రక్తం గడ్డకట్టే సెరిబ్రల్ వెయిన్ థ్రాంబోసిస్ కలిగి ఉన్నాడు.
22 మందిలో 68 శాతం అంటే 15 న్యూరల్ ఎపిడెర్మల్ గ్రోత్ ఫ్యాక్టర్-1 ప్రోటీన్ (NELL-1)కి ఫలితాలు సానుకూలంగా వచ్చాయి. ఇది ఎంఎన్ వ్యాధి యొక్క అరుదైన రూపం. ఇది ప్రాణాపాయం కలిగించే అవకాశం ఉంటుంది. 15 మంది రోగులలో 13 మంది లక్షణాలు కనిపించకముందు స్కిన్ ఫెయిర్నెస్ క్రీమ్లు వాడినట్లు అంగీకరించారు. మిగిలిన వారిలో ఒకరు సాంప్రదాయ స్వదేశీ ఔషధాలను ఉపయోంచిన చరిత్ర ఉంది.
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
-
Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
-
IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
-
IAF Report: ఆపరేషన్ సిందూర్పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
-
Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!