Diabetes: రోజూ అన్నం తింటే షుగర్ వస్తుందా..? నిపుణులు ఏం చెబుతున్నారు..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నిశ్శబ్దంగా మనలో చేరి మనతోపాటే జీవితాంతం ఉండేదే డయాబెటిస్. ఈ వ్యాధి ఒక్కసారి మనలో కనిపించిందంటే.. దాన్ని ఒక పూర్తిగా నిరోధించడం కుదరదు. దాన్ని అదుపులో పెట్టుకోవడంపైనే దృష్టి సారించాల్సి ఉంటుంది. 30 ఏళ్ల లోపు వారు కూడా ఈ వ్యాధి బారిన పడటం మరింత ఆందోళన కలిగించే విషయం. రక్తంలో చక్కెరల స్థాయిలను తగ్గించుకునేందుకు మందులు మింగాల్సిన పరిస్థితులు ఉంటాయి. అయితే.. అందరి మదిలో అన్నం తింటే షుగర్ వస్తుందా? షుగర్ ఉన్న వాళ్లు అన్నం తింటే షుగర్ పెరుగుతుందా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతూ ఉంటాయి. ఈ ప్రశ్నలకు సమాధానాలు ఇప్పుడు తెలుసుకుందాం…
READ MORE: Jagdeep Dhankhar Resign: ఉపరాష్ట్రపతి పదవికి ధన్ఖడ్ అకస్మాత్తుగా ఎందుకు రాజీనామా చేశారంటే..?
Also Read
- Soya Manchurian: పిల్లలు లొట్టలేసుకుంటూ తినే 'మిల్ మేకర్ మంచూరియా'.. టేస్టీగా, హెల్తీగా ఇంట్లోనే ఇలా ఈజీగా చేసేయండి!
- Sleep Disorder : రాత్రి 8 గంటలు నిద్రపోయినా అలసట ఎందుకు పోదు? చాలా మంది తెలుసుకోవాల్సిన నిజాలు!
- Kerala Parotta : కేరళ స్టైల్ పరోటా ఇష్టమా.? తినే ముందు ఇవి తెలుసుకోండి..!
- Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్... సబ్బులు, బాడీ వాష్లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
వరి అన్నం విషయంలో మరీ అంత భయం అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. తినడంలో కొన్ని పద్ధతులు, జాగ్రత్తలు పాటించాలని వెల్లడించారు. బియ్యం రకం, మిల్లు ఆడించే పద్ధతిని బట్టి అన్నంలో గ్లైసెమిక్ ఇండెక్స్ (రక్తంలో చక్కెరస్థాయిని కొలిచే సూచిక) విలువలు మారిపోతాయి. ఉదాహరణకు ముడి బియ్యంలో కంటే ఎక్కువగా చక్కెర స్థాయిలు తెల్ల బియ్యంలో ఉంటాయి. బియ్యం పాలిష్ పట్టే సమయంలో బయటి ఊక పొర తొలగించడం వల్ల చక్కెర శాతం పెరుగుతుంది. దేశవాళి బియ్యం, ఎర్ర బియ్యంలో అధిక పీచు, పోషకాలు ఉంటాయి. ఈ కారణంగా తక్కువ చక్కెర స్థాయిలు ఉంటాయి. ఏపీలో ఎక్కువగా వినియోగించే సాంబ మసూరిలో కూడా ఇవి తక్కువగానే ఉన్నట్లు పరిశోధనల్లో తేలింది. అయితే.. రక్తంలో చక్కెర స్థాయి పెరగడానికి వరి అన్నం తినడం మాత్రమే కారణం కాదని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం చాలా మందిలో శారీరక శ్రమ తగ్గిపోవటం, బేకరీ ఫుడ్స్, జంక్ ఫుడ్ వల్ల పరిస్థితి గాడి తప్పిందని పేర్కొన్నారు. అంతేకాకుండా జీవనశైలిలో వస్తున్న మార్పులు, ఆధునిక పోకడలు దుష్ప్రభావం చూపుతున్నాయని వివరించారు. సకాలంలో తినకపోవడం, రాత్రి మరీ ఆలస్యంగా తినటం, వేగంగా తినటం వల్ల కూడా అనేక రకాల ఇబ్బందులు వస్తాయని తెలిపారు.
READ MORE: Revenge Murder: తల్లిని అవమానించాడని, 10 ఏళ్ల తర్వాత ప్రతీకారం.. సినిమాకు మించిన స్టోరీ..
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!