Breakfast: బ్రేక్ఫాస్ట్ ఎగ్గొడుతున్నారా?.. మీ మెదడు పనితీరుపై దెబ్బ ..
- ప్రస్తుతం బ్రేక్ఫాస్ట్ ఎగ్గొడుతున్న జనం
- దీంతో తీవ్ర అనారోగ్య సమస్యలు
- ముఖ్యమంగా మెదడుపై ప్రభావం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆధునిక జీవన శైలిలో భాగంగా రాత్రిళ్లు ఆలస్యంగా పడుకోవడం, ఉదయం పొద్దెక్కేదాకా నిద్రలేవక పోవడం మామూలు వ్యవహారమైపోయింది. కొందరు వృత్తిరీత్య ఆలస్యంగా నిద్రిస్తే మరికొందరు రాత్రిళ్లు సరదాగా తిరుగుతూ ఆరోగ్యం పాడుచేసుకుంటున్నారు. వీరు ఉదయం లేచే సరికి మధ్యాహ్నం కావడంతో టిఫిన్ తినడం కుదరదు. కొందరు ఉదయం హడావిడిగా ఆఫీసులకు వెళ్లే క్రమంలో అల్పాహారాన్ని నిర్లక్ష్యం చేస్తుంటారు. అలా ఖాళీ కడుపుతో ఉండటం వల్ల పనిమీద ఆసక్తి తగ్గిపోవడం, చిరాకు పెరగడం వంటి మానసిక సమస్యలు కూడా వస్తుంటాయి. శరీరానికి అవసరమైన పోషకాలు కూడా లోపిస్తాయి. ఇంతే కాకుండా ఓ అధ్యయనం ప్రకారం.. ఉదయం అల్పహారం మానేయడం వల్ల మెదడుపై తీవ్ర ప్రభావం పడుతుందట.
READ MORE: China: మిలియన్ డ్రోన్లను ఆర్డర్ ఇచ్చిన చైనా.. భారత్కి కొత్త ముప్పు..
Also Read
- Yoga vs Gym: గుండె ఆరోగ్యానికి యోగా బెటారా? జిమ్కు వెళ్లాలా.?
- Red Chili Test: వంటగదిలో వాడే ఎండు మిర్చి కారం నకిలీదా..? అసలుదా..? సింపుల్గా తెలుసుకోండిలా..
- Monsoon Diseases: వర్షాకాలంలో విజృంభించే ప్రమాదకర వ్యాధులు ఇవే... వైద్యుల హెచ్చరిక
- Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ "పెసర గారెలు" చేసేయండి ఇలా.!
రాత్రంతా తినకుండా ఉన్న తర్వాత, ఉదయాన చేసే అల్పాహారం రోజంతా కావాల్సిన శక్తిని అందిస్తుంది. కానీ, మనలో చాలా మంది ఉదయాన బ్రేక్ఫాస్ట్ తినడాన్ని మానేస్తారు. బ్రేక్ఫాస్ట్ తినకపోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయులు పడిపోతాయి. ఇది మెదడుపై ప్రభావం చూపుతుంది. రోజూ బ్రేక్ఫాస్ట్ తినకపోవడం వల్ల మెదడుకు నష్టం కలుగుతుంది. మెదడులోని కణాల సామర్థ్యం తగ్గిపోతుంది. పోషకాల లేమి వల్ల మెదడు సాధారణ పనితీరు దెబ్బతింటుంది.
READ MORE: Safety Tips: పొగమంచు కమ్మేస్తోంది.. వాహనదారులు ఈ జాగ్రత్తలు తీసుకోండి..
అంతే కాకుండా .. మెదడుకు అత్యంత తీవ్ర నష్టం తగినంత నిద్ర లేకపోవడం వల్లే జరుగుతుందని న్యూరాలజీ అండ్ వెల్నెస్ సెంటర్ ఆఫ్ అమెరికా వెల్లడించింది. పెద్దలకు తగినంత నిద్ర అంటే రోజులో ఏడు నుంచి ఎనిమిది గంటలు పడుకోవాలని సూచించింది. రాత్రి పూట నిద్రపోతే మరింత మంచి ఫలితాలు ఉంటాయని నిపుణులు అంటున్నారు. నిద్రపోగానే మెదడు విశ్రాంతి తీసుకుంటుంది. నిద్రలోనే మెదడు కొత్త కణాలను సృష్టిస్తుంది. ఏడు గంటల నిద్రలేకపోతే కొత్త కణాలు ఏర్పడవు. ఫలితంగా, మీరు ఏ విషయాన్నీ గుర్తుంచుకోలేరు. ఏకాగ్రత కుదరదు. చిరాకుగా ఉంటుంది. సరైన నిర్ణయాలు తీసుకోలేరు. నిద్రలేమి వల్ల అల్జీమర్స్ వచ్చే ముప్పు పెరుగుతుంది.
తాజావార్తలు
-
Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
-
Pulse Polio: 28న పల్స్ పోలియోకు తెలంగాణ రెడీ.!
-
India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్పై ఆగ్రహం..
-
Jabardasth Mahesh: ‘ఎప్పుడు ఎవరికి ఏమవుతుందో తెలీదు’.. సడన్గా కమెడియన్ మహేష్ షాకింగ్ వీడియో.. అసలేమైంది?
-
Story Board: బీజేపీ ఎలాంటి ఎత్తుగడలు వేస్తోంది..? దేశంలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయా..?
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!