Breakfast: బ్రేక్ఫాస్ట్ ఎగ్గొడుతున్నారా?.. మీ మెదడు పనితీరుపై దెబ్బ ..
- ప్రస్తుతం బ్రేక్ఫాస్ట్ ఎగ్గొడుతున్న జనం
- దీంతో తీవ్ర అనారోగ్య సమస్యలు
- ముఖ్యమంగా మెదడుపై ప్రభావం
ఆధునిక జీవన శైలిలో భాగంగా రాత్రిళ్లు ఆలస్యంగా పడుకోవడం, ఉదయం పొద్దెక్కేదాకా నిద్రలేవక పోవడం మామూలు వ్యవహారమైపోయింది. కొందరు వృత్తిరీత్య ఆలస్యంగా నిద్రిస్తే మరికొందరు రాత్రిళ్లు సరదాగా తిరుగుతూ ఆరోగ్యం పాడుచేసుకుంటున్నారు. వీరు ఉదయం లేచే సరికి మధ్యాహ్నం కావడంతో టిఫిన్ తినడం కుదరదు. కొందరు ఉదయం హడావిడిగా ఆఫీసులకు వెళ్లే క్రమంలో అల్పాహారాన్ని నిర్లక్ష్యం చేస్తుంటారు. అలా ఖాళీ కడుపుతో ఉండటం వల్ల పనిమీద ఆసక్తి తగ్గిపోవడం, చిరాకు పెరగడం వంటి మానసిక సమస్యలు కూడా వస్తుంటాయి. శరీరానికి అవసరమైన పోషకాలు కూడా లోపిస్తాయి. ఇంతే కాకుండా ఓ అధ్యయనం ప్రకారం.. ఉదయం అల్పహారం మానేయడం వల్ల మెదడుపై తీవ్ర ప్రభావం పడుతుందట.
READ MORE: China: మిలియన్ డ్రోన్లను ఆర్డర్ ఇచ్చిన చైనా.. భారత్కి కొత్త ముప్పు..
Also Read
- Sugarcane Juice Side Effects: వేసవిలో చెరకు రసం తాగుతున్నారా? అయితే జాగ్రత్త..!
- Kidney Stones Rising in Summer: వేసవిలో కిడ్నీల్లో పెరిగిపోతున్న రాళ్లు.. ఇలా చెక్ పెట్టండి..!
- Ragi Puri: ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచి.. రాగి పిండితో మెత్తటి పూరీలు.. ఇలా చేస్తే లొట్టలేయాల్సిందే!
- Weight Loss: బరువు తగ్గాలనుకునే వారికి శుభవార్త.. ఇంత వరకు ఎవరూ చెప్పని చిట్కా.. 99 శాతం సక్సెస్..
రాత్రంతా తినకుండా ఉన్న తర్వాత, ఉదయాన చేసే అల్పాహారం రోజంతా కావాల్సిన శక్తిని అందిస్తుంది. కానీ, మనలో చాలా మంది ఉదయాన బ్రేక్ఫాస్ట్ తినడాన్ని మానేస్తారు. బ్రేక్ఫాస్ట్ తినకపోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయులు పడిపోతాయి. ఇది మెదడుపై ప్రభావం చూపుతుంది. రోజూ బ్రేక్ఫాస్ట్ తినకపోవడం వల్ల మెదడుకు నష్టం కలుగుతుంది. మెదడులోని కణాల సామర్థ్యం తగ్గిపోతుంది. పోషకాల లేమి వల్ల మెదడు సాధారణ పనితీరు దెబ్బతింటుంది.
READ MORE: Safety Tips: పొగమంచు కమ్మేస్తోంది.. వాహనదారులు ఈ జాగ్రత్తలు తీసుకోండి..
అంతే కాకుండా .. మెదడుకు అత్యంత తీవ్ర నష్టం తగినంత నిద్ర లేకపోవడం వల్లే జరుగుతుందని న్యూరాలజీ అండ్ వెల్నెస్ సెంటర్ ఆఫ్ అమెరికా వెల్లడించింది. పెద్దలకు తగినంత నిద్ర అంటే రోజులో ఏడు నుంచి ఎనిమిది గంటలు పడుకోవాలని సూచించింది. రాత్రి పూట నిద్రపోతే మరింత మంచి ఫలితాలు ఉంటాయని నిపుణులు అంటున్నారు. నిద్రపోగానే మెదడు విశ్రాంతి తీసుకుంటుంది. నిద్రలోనే మెదడు కొత్త కణాలను సృష్టిస్తుంది. ఏడు గంటల నిద్రలేకపోతే కొత్త కణాలు ఏర్పడవు. ఫలితంగా, మీరు ఏ విషయాన్నీ గుర్తుంచుకోలేరు. ఏకాగ్రత కుదరదు. చిరాకుగా ఉంటుంది. సరైన నిర్ణయాలు తీసుకోలేరు. నిద్రలేమి వల్ల అల్జీమర్స్ వచ్చే ముప్పు పెరుగుతుంది.
తాజావార్తలు
-
Telangana DGP: తెలంగాణ కొత్త డీజీపీగా CV ఆనంద్ నియామకం.!
-
Petrol-Diesel Price: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై కేంద్రం కీలక ప్రకటన..
-
Jana Nayagan: ఎన్నికల ఆఫీసులో పైరసీ సినిమా.. ఇంతకీ ఆ సినిమా ఏంటో తెలుసా? చూస్తే షాక్ అవుతారు!
-
Faria Abdullah: అమ్మ హిందూ.. నాన్న ముస్లిం.. కానీ అసలైన ట్విస్ట్ ఇదే!
-
Honeymoon murder: హనీమూన్ మర్డర్ కేసులో సోనమ్ రఘువంశీకి బెయిల్..
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో