High-Sugar Fruits: ఆ ఐదు పండ్లు ఎక్కువగా తీసుకుంటున్నారా.. బీకేర్ ఫుల్..
- పండిన అరటిపండ్లు, పుచ్చకాయ, ద్రాక్ష, మామిడి,
- లీచీ వంటి పండ్లలో చక్కెర శాతం ఎక్కువ
- రక్తంలో షుగర్ లెవల్స్ ను , రక్తపోటును పెంచుతుందన్న నిపుణులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రకృతిలో లభించే పండ్లు మన ఆరోగ్యానికి అనేక విధాలుగా ఉపయోగపడతాయి. అయితే పండిన అరటిపండ్లు, పుచ్చకాయ, ద్రాక్ష, మామిడి, లీచీ వంటి పండ్లలో సహజ చక్కెర శాతం ఎక్కువగా ఉండే కారణంగా, అవి రక్తంలో షుగర్ స్థాయిలను మరియు రక్తపోటును పెంచవచ్చని నిపుణులు చెప్పుతున్నారు. ఈ పరిస్థితులు గుండె ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వారు హెచ్చరిస్తున్నారు.
పండ్లు విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ వంటి అనేక పోషకాలు కలిగి ఉన్నప్పటికీ, కొన్ని పండ్లను అధికంగా తీసుకోవడం గుండెకు హానికరంగా మారొచ్చు. అరటి, పుచ్చకాయ, ద్రాక్ష, మామిడి, లీచీ లాంటి పండ్లలో అధికంగా ఫ్రూట్ షుగర్ (ఫ్రక్టోజ్) ఉంటుంది. వీటిని ఎక్కువగా తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు త్వరగా పెరిగి, రక్తపోటు కూడా పెరుగుదలకు దోహదం చేస్తాయి. ఈ మార్పులు గుండెపై అదనపు ఒత్తిడిని కలిగిస్తాయి.
Also Read
- West Nile Fever: డెంగ్యూ, మలేరియానే కాదు.. కేరళలో దోమ కాటుతో మరో ప్రాణాంతక వ్యాధి!
- AIIMS Study: వాయు కాలుష్యంతో కడుపులోని బిడ్డ ఎదుగుదలకు బ్రేక్.. ఎయిమ్స్ పరిశోధనలో షాకింగ్ విషయాలు!
- Health Benefits of Silver : వెండి పాత్రలో నీరు తాగితే ఏమవుతుంది? కంగనా అలవాటు వైరల్.!
- Kitchen Hacks: ఇలా చేస్తే మీ వంటింట్లోకి చీమలు చచ్చినారావు.. కేవలం 2 నిమిషాల్లో ఇంట్లోనే ఈ నాచురల్ స్ప్రే చేసుకోండిలా!
పుచ్చకాయ వేసవిలో ఎక్కువగా లభించే పండు. దీనిలో నీటి శాతం అధికంగా ఉన్నప్పటికీ, సహజ చక్కెర కూడా తగినంతగా ఉంటుంది. దీన్ని ఎక్కువ మొత్తంలో తీసుకుంటే రక్తంలోని గ్లూకోజ్ మరియు ఇన్సులిన్ స్థాయిలు పెరుగే అవకాశం ఉంది.
పండిన అరటిపండ్లలో చక్కెర ఎక్కువగా ఉండే కారణంగా అవి త్వరగా జీర్ణమై రక్తంలో షుగర్ మరియు రక్తపోటును పెంచవచ్చు. కనుక పూర్తిగా పండిన వాటికన్నా కొంచెం ముదురు ఆకుపచ్చ రంగులో ఉండే అరటిపండ్లను తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
ద్రాక్ష పండ్లు ఫ్రక్టోజ్ అధికంగా కలిగి ఉంటాయి. ఎక్కువ ద్రాక్ష తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరిగి గుండె పనితీరును ప్రభావితం చేస్తాయి. ప్రతిరోజూ ఎక్కువ పరిమాణంలో ద్రాక్ష తీసుకోవడం గుండెకు మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మామిడి పండ్లలో ఇతర పండ్లతో పోలిస్తే సహజ చక్కెర శాతం ఎక్కువగా ఉంటుంది. డయాబెటిస్ లేదా గుండె సమస్యలు ఉన్నవారు మామిడి పండ్లను పరిమితంగా, అప్పుడప్పుడు మాత్రమే తినాలి అని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
లీచీ పండ్లలో కూడా చక్కెర శాతం అధికంగా ఉండటం వల్ల రక్తంలోని చక్కెర స్థాయి ఒక్కసారిగా పెరిగే అవకాశం ఉంటుంది. ఇది గుండె సంబంధిత సమస్యలు లేదా మధుమేహం ఉన్నవారికి ప్రమాదకరమవుతుంది. కాబట్టి లీచీని కూడా పరిమితంగా తీసుకోవడం మంచిది.
ఈ సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. కాబట్టి ఏ నిర్ణయం తీసుకునే ముందు తప్పనిసరిగా మీ వైద్యుడిని సంప్రదించి సూచనలు పొందడం మంచిందని నిపుణులు అంటున్నారు.
తాజావార్తలు
-
Anil Ravipudi: సంక్రాంతి టార్గెట్గా అనిల్ రావిపూడి కొత్త సినిమా.. ముహూర్తం డేట్ అఫీషియల్గా ప్రకటించిన డైరెక్టర్!
-
India Job Crisis: ఇంజనీరింగ్ చేసి స్వీపర్ పోస్టులకు అప్లై చేస్తున్నారు.. ఇక డిగ్రీలు దండగేనా?
-
POK killings: పీఓకేలో పాక్ హత్యాకాండ.. 30 మంది బ్రిటిష్ ఎంపీల ఆందోళన..
-
Ponguleti Srinivas Reddy : గత ప్రభుత్వం పదేళ్ల పాలనలో చేసిందేమీ లేదు
-
Tech News: మనల్ని మింగేసే రాక్షసి..! బాంబు పేల్చిన ‘క్లాడ్’
ట్రెండింగ్
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!