Heart Attacks: గుండెపోటుపై ఎయిమ్స్ అధ్యయనం.. సీరియస్నెస్ గుర్తించని 55 శాతం మంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Heart Attacks: ఇటీవల కాలంలో గుండె పోటుతో మరణాల సంఖ్య పెరుగుతోంది. గతంలో వయసు పైబడినవారికి వచ్చే ఓ జబ్బుగా గుండెపోటు ఉండేది. కానీ ఇప్పుడు యువతలో ముఖ్యంగా టీనేజ్ లో కూడా గుండెపోటు రావడం తద్వారా మరణాలు సంభవించడం చోటు చేసుకుంటోంది. ఇదిలా ఉంటే గుండెపోటుపై ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) ఓ అధ్యయాన్ని నిర్వహించింది. ఇది టాప్ మెడకల్ జర్నల్ అయిన ది లాన్సెట్ లో ప్రచురించబడింది.
హార్ట్ ఎటాక్ ఎమర్జెన్సీ సమయాల్లో కొద్ది పాటి రోగులు, అంటే కేవలం 10 శాతం మాత్రమే గంటలోపు ఆస్పత్రులకు చేరుకుంటున్నారని వెల్లడించింది. వేగంగా ఆస్పత్రులకు చేరుకోవడం వల్ల మరణాలను నిరోధించే అవకాశం ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. 30 నుంచి 40 శాతం మంది ప్రజలు, పరిస్థితులు నియంత్రణలో ఉన్న కారణంగా ఆలస్యం కాకుండా ఆస్పత్రులకు వెళ్తున్నట్లు అధ్యయనంలో తేలింది. ఇదిలా ఉంటే 55 శాతం మంది పరిస్థితి తీవ్రతను గుర్తించకుండా.. ఆలస్యం చేయడం వల్ల మరణాలు సంభవిస్తున్నాయని కనుగొన్నారు.. అయితే ఇది గుండెపోటా..? సాధారణ నొప్పి..? అని తెలియకుండా ఆస్పత్రికి వెళ్లాలా..? వద్దా..? అనే అయోమయంలో ఉన్నారని స్టడీ తేల్చింది.
Also Read
- Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. "రాజ్మా రైస్"తో హై ప్రోటీన్ లంచ్.!
- Kala Chana Pulao Recipe: 4 స్టెప్స్లో కాలా చనా పులావ్.. టేస్ట్తో పాటు ప్రోటీన్ డబుల్.!
- Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
- Bed Bugs: మీ పరుపుల్లో నల్లులు నిద్ర పోతున్నాయా? పైసా ఖర్చు లేకుండా నల్లులకు ఇలా శాశ్వతంగా చెక్ పెట్టండి!
Read Also: Swiggy: మొన్న న్యూ ఇయర్.. ఇప్పుడు ఐపీఎల్… స్విగ్గీకి కాసుల పంట
20 నుంచి 30 శాతం మంది వాహనం, చికిత్స కోసం డబ్బు వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారని, ఆదే ఆలస్యానికి కారణం అవుతుందని, కొన్ని సందర్భాల్లో ఆర్థిక పరిస్థితులు, భౌగోళిక పరిస్థితులు, ఆస్పత్రులుకు దూరంగా ఉండటం వల్ల సమస్యలను ఎదుర్కొంటున్నట్లు అధ్యయనంలో తేలింది. దాదాపుగా 10 శాతం మంది ప్రజలు సకాలంలో ఆస్పత్రికి చేరినా.. చికిత్సలో జాప్యాన్ని ఎదుర్కొంటున్నారని, ఆస్పత్రుల్లో అత్యవసర పరిస్థితులకు రెస్సాన్స్ అవకుండా కొన్ని పరిస్థితులు అడ్డుకుంటున్నాయని తేల్చింది.
435 మరణాలపై ఏడాది పాటు అధ్యయనం చేశారు. గుండె పోటు అనేది ప్రాణంతకమైన వ్యాధి అని.. ముఖ్యంగా ఛాతి నొప్పితో పాటు ఎడమ వైపున నొప్పిగా, లాగుతుంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలని, అన్ని ఛాతి నొప్పులు గుండె నొప్పి కాదని, అయితే ప్రతీ గుండె పోటు కూడా ఛాతినొప్పితోనే ప్రారంభం అవుతుందని వైద్యులు చెబుతున్నారు. బీపీ, ఊబకాయం అధికంగా ఉంటే గుండెపోటు రిస్క్ ఉంటుందని, జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
తాజావార్తలు
-
KL Rahul: కేఎల్ రాహుల్కు ఊహించని షాక్!
-
PEDDI : రాయలసీమలో దేవరను దాటలేకపోయిన ‘పెద్ది’
-
East Godavari Thief: తూర్పుగోదావరి జిల్లాలో ఘరానా దొంగ అరెస్ట్.. జూదం కోసం వరుస చోరీలు.. బెయిల్పై బయటకు వచ్చి!
-
Praggnanandhaa: వరల్డ్ ఛాంపియన్కు చెక్ మెట్.. హ్యాట్రిక్ విజయంతో నార్వే చెస్ టైటిల్ రేసులో దూసుకపోతున్న ప్రజ్ఞానంద.!
-
K Annamalai: “కొత్త రాజకీయ ఉద్యమం మొదలు పెడుతున్నా”.. అన్నామలై సంచలన ప్రకటన..
ట్రెండింగ్
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..