Heart Attacks: గుండెపోటుపై ఎయిమ్స్ అధ్యయనం.. సీరియస్నెస్ గుర్తించని 55 శాతం మంది..
Heart Attacks: ఇటీవల కాలంలో గుండె పోటుతో మరణాల సంఖ్య పెరుగుతోంది. గతంలో వయసు పైబడినవారికి వచ్చే ఓ జబ్బుగా గుండెపోటు ఉండేది. కానీ ఇప్పుడు యువతలో ముఖ్యంగా టీనేజ్ లో కూడా గుండెపోటు రావడం తద్వారా మరణాలు సంభవించడం చోటు చేసుకుంటోంది. ఇదిలా ఉంటే గుండెపోటుపై ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) ఓ అధ్యయాన్ని నిర్వహించింది. ఇది టాప్ మెడకల్ జర్నల్ అయిన ది లాన్సెట్ లో ప్రచురించబడింది.
హార్ట్ ఎటాక్ ఎమర్జెన్సీ సమయాల్లో కొద్ది పాటి రోగులు, అంటే కేవలం 10 శాతం మాత్రమే గంటలోపు ఆస్పత్రులకు చేరుకుంటున్నారని వెల్లడించింది. వేగంగా ఆస్పత్రులకు చేరుకోవడం వల్ల మరణాలను నిరోధించే అవకాశం ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. 30 నుంచి 40 శాతం మంది ప్రజలు, పరిస్థితులు నియంత్రణలో ఉన్న కారణంగా ఆలస్యం కాకుండా ఆస్పత్రులకు వెళ్తున్నట్లు అధ్యయనంలో తేలింది. ఇదిలా ఉంటే 55 శాతం మంది పరిస్థితి తీవ్రతను గుర్తించకుండా.. ఆలస్యం చేయడం వల్ల మరణాలు సంభవిస్తున్నాయని కనుగొన్నారు.. అయితే ఇది గుండెపోటా..? సాధారణ నొప్పి..? అని తెలియకుండా ఆస్పత్రికి వెళ్లాలా..? వద్దా..? అనే అయోమయంలో ఉన్నారని స్టడీ తేల్చింది.
Also Read
- Sugarcane Juice Side Effects: వేసవిలో చెరకు రసం తాగుతున్నారా? అయితే జాగ్రత్త..!
- Kidney Stones Rising in Summer: వేసవిలో కిడ్నీల్లో పెరిగిపోతున్న రాళ్లు.. ఇలా చెక్ పెట్టండి..!
- Ragi Puri: ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచి.. రాగి పిండితో మెత్తటి పూరీలు.. ఇలా చేస్తే లొట్టలేయాల్సిందే!
- Weight Loss: బరువు తగ్గాలనుకునే వారికి శుభవార్త.. ఇంత వరకు ఎవరూ చెప్పని చిట్కా.. 99 శాతం సక్సెస్..
Read Also: Swiggy: మొన్న న్యూ ఇయర్.. ఇప్పుడు ఐపీఎల్… స్విగ్గీకి కాసుల పంట
20 నుంచి 30 శాతం మంది వాహనం, చికిత్స కోసం డబ్బు వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారని, ఆదే ఆలస్యానికి కారణం అవుతుందని, కొన్ని సందర్భాల్లో ఆర్థిక పరిస్థితులు, భౌగోళిక పరిస్థితులు, ఆస్పత్రులుకు దూరంగా ఉండటం వల్ల సమస్యలను ఎదుర్కొంటున్నట్లు అధ్యయనంలో తేలింది. దాదాపుగా 10 శాతం మంది ప్రజలు సకాలంలో ఆస్పత్రికి చేరినా.. చికిత్సలో జాప్యాన్ని ఎదుర్కొంటున్నారని, ఆస్పత్రుల్లో అత్యవసర పరిస్థితులకు రెస్సాన్స్ అవకుండా కొన్ని పరిస్థితులు అడ్డుకుంటున్నాయని తేల్చింది.
435 మరణాలపై ఏడాది పాటు అధ్యయనం చేశారు. గుండె పోటు అనేది ప్రాణంతకమైన వ్యాధి అని.. ముఖ్యంగా ఛాతి నొప్పితో పాటు ఎడమ వైపున నొప్పిగా, లాగుతుంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలని, అన్ని ఛాతి నొప్పులు గుండె నొప్పి కాదని, అయితే ప్రతీ గుండె పోటు కూడా ఛాతినొప్పితోనే ప్రారంభం అవుతుందని వైద్యులు చెబుతున్నారు. బీపీ, ఊబకాయం అధికంగా ఉంటే గుండెపోటు రిస్క్ ఉంటుందని, జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
తాజావార్తలు
-
Mohini: దర్శకుడి బలవంతం.. భర్తే చేతబడి చేయించాడు ‘ఆదిత్య 369’ నటి మోహిని కన్నీటి గాథ!
-
Moringa Chutney Recipe: క్షణాల్లో కారం కారంగా మునగ చట్నీ తయారు చేయండి.. రుచితో పాటు పుష్కలమైన విటమిన్లు మీ సొంతం!
-
Raghav Chadha vs AAP: ఎంపీని చేయకపోతే పెళ్లి అయ్యేదా? రాఘవ్ చద్దాపై ఆప్ ధ్వజం
-
Rava Paratha Recipe: రెగ్యులర్ బ్రేక్ఫాస్ట్ బోర్ కొట్టిందా..? 10 నిమిషాల్లో మెత్తటి రవ్వ పరాఠాలు ఇలా తయారు చేయండి
-
KING 100 : దాదాపు 20 ఏళ్ల తర్వాత నాగ్ సరసన టబు.. ఫ్యాన్స్ ఫుల్ ఖుషి
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!