Telugu News
WATCH LIVE TV
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • విశ్లేషణ
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • English
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమాలు
  • సినిమా న్యూస్
  • క్రీడలు
  • One Day వరల్డ్ కప్
  • T20 వరల్డ్ కప్
  • అంతర్జాతీయ క్రీడలు
  • ఆసియ కప్
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • గ్యాలరీలు
  • Actors
  • Actress
  • General
  • Political
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • దిన ఫలాలు
  • రాశి ఫలాలు
  • వార ఫలాలు
  • రివ్యూలు
  • విశ్లేషణ
  • భక్తి
Close
Topics
  • TS Inter Results
  • Draupadi Murmu
  • PM Modi AP Tour
  • Maharashtra Political Crisis
WATCH LIVE TV
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • విశ్లేషణ
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • English
Home Lifestyle Health Tips Want To Eat Fish On A Rainy Day But Do You Know Why

Health Tips: మృగశిర కార్తె రోజు చేపలు తినాలంటారు, కానీ ఎందుకో తెలుసా?

Published Date - 10:38 PM, Sat - 11 June 22
By Ranjith Alishala
Health Tips: మృగశిర కార్తె రోజు చేపలు తినాలంటారు, కానీ ఎందుకో తెలుసా?

మృగశిర కార్తెలో ముంగిళ్లు చల్లబడును అంటారు పెద్దలు. అప్పటి వరకు రోహిణి కార్తెల కారణంగా మండిన ఎండలకు ప్రజలు విలవిలలాడిపోతారు. మృగశిర కార్తె మొదలవ్వగానే వాతావరణం చల్లబడుతుంది. అంతవరకు ఉన్న వేసవి తాపం తీరిపోతుంది. వాతావరణం మారడంతో శరీరం ఆ మార్పులను గ్రహించి సర్దుకోవడానికి సమయం పడుతుంది. ఇలా చల్లబడిన వాతావరణం వల్ల గుండె జబ్బులు, ఆస్తమా రోగాలు ఉన్న వాళ్లు ఇబ్బంది పడతారు. మనలో రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. జ్వరం, జలుబు, శ్వాసకోశ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. అందుకే రోహిణి కార్తెలు ముగిసి, మృగశిర కార్తె మొదలైన మొదటి రోజే చేపలు తినడం ఆనవాయితీగా పూర్వం నుంచి కొనసాగుతోంది.ఇలా చేపలు తినడం వల్ల శరీరంలో ఉష్ణోగ్రత సమస్థాయిలో ఉండేలా ఇందులోని పోషకాలు చూసుకుంటాయి. జీర్ణశక్తి కూడా నెమ్మదించుకండా చురుగ్గా ఉండేలా చేస్తాయి. ఈ ఏడాది జూన్ 8వ తేదీన బుధవారం నుంచి మృగశిర కార్తె మొదలవుతుంది. ఈ రోజున చేపల ధరలు ఆకాశాన్నంటుతాయి. అయితే ఈ రోజు చేపలు తింటే రోగాలు రావా? అని వాదించే వాళ్లూ ఉన్నారు. అయితే చేపలు మన ఆరోగ్యానికి చేసే మేలు ఎంతో తెలిస్తే మీరు కూడా ఈ రోజు చేపలు కచ్చితంగా తింటారు.

చేపతో ఎన్నో లాభాలు..

మృగశిర కార్తె మొదటి రోజు చేపలు తినాలన్నది మన పూర్వీకుల నుంచి వస్తున్న ఆచారం. చేపలను ఇంగువ, చింతపండు లేదా చింత చిగురు కలిపి వండుకుని తినేవాళ్లు. ఇలా తినడం వల్ల శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయన్నది వారి నమ్మకం. మృగశిర కార్తెలో కలిగే వ్యాధుల నుంచి చేపల్లోని పోషకాలు రక్షణ కల్పిస్తాయని వారి భావన. గుండెజబ్బుతో ఉన్న వారు కచ్చితంగా చేపల్ని తినాలని చెబుతారు. వీటిల్లో 20రకాల ప్రొటీన్లు ఉంటాయి, అవన్నీ చాలా సులువుగా అరుగుతాయి. అలాగే మనకెంతో అవసరమైన అమైనో ఆమ్లాలు కూడా లభిస్తాయి. లైసీన్, సిస్టీన్, మిథియోనిన్ అందులో ముఖ్యమైనవి. చేపల్లో దొరికే కొవ్వు కూడా మనకు అవసరమైనది. గర్భిణీలకు, గుండె జబ్బులు ఉన్నవారికి, పిల్లలకు ఈ కొవ్వు చాలా అవసరం. దీంతోనే చేప నూనెలను తయారు చేసి బయట అధిక ధరలకు అమ్ముతారు. ఈ కొవ్వులోనే ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. దీని ద్వారా విటమిన్ ఎ, డి, ఇ లు శరీరానికి అందుతాయి. ఆకుకూరల్లో లభించే విటమిన్ ఎ కన్నా చేపల్లో దొరికే విటమిన్ ఏ అధికం. ఇది కంటిచూపును మెరుగుపరుస్తుంది. అలాగే కేవలం సూర్య రశ్మి ద్వారా మాత్రమే దొరికే విటమిన్ డి, చేప కొవ్వులో కూడా లభిస్తుంది.

ఏ రూపంలో తిన్నా..

చేపల వేపుడు తింటారో, పులుసు చేసుకుంటారో లేక బిర్యానీ చేసుకుని తింటారో మీ ఇష్టం, ఎలా తిన్నా చేపల వల్ల లాభమే కానీ నష్టం లేదు అని వివరిస్తున్నారు ఆరోగ్యనిపుణులు. చేపల్లో ఇనుము అధికంగా లభిస్తుంది. దీని వల్ల శరీరంలో రక్తం అధికంగా ఉత్పత్తి అవుతుంది. చేపల్లో అయోడిన్ కూడా దొరుకుతుంది. ఇది గాయిటర్ అనే జబ్బు రాకుండా అడ్డుకుంటుంది. మెదడు పనితీరుకు ఇది చాలా అవసరం. పిల్లల్లో మానసిక ఎదుగుదలకు అయోడిన్ సహకరిస్తుంది. కాబట్టి పిల్లలకు చేపలు తినిపించాలి. చర్మ సమస్యలు రాకుండా అడ్డుకోవడంలో కూడా చేపలు ముందుంటాయి. వీటిలో ఉండే జింక్ కొన్ని రకాల ఎంజైమ్‌లు ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. ఆ ఎంజైమ్‌లు చర్మాన్ని సంరక్షిస్తాయి. పెద్ద చేపల్లోని ముల్లును తినలేం కానీ చిన్న చేపల్లోని ముల్లును తినేయగలం. ఆ ముళ్లతో సహా తినడం వల్ల ఇనుము, కాల్షియం, భాస్వరం వంటివి దొరుకుతాయి.

  • Tags
  • Fish Food
  • Health Tips in Telugu
  • Latest Health Tips
  • Mrugasira Karte

RELATED ARTICLES

Health Tips: ‘అల్లం’తో అనేక ప్రయోజనాలు.. అవేంటంటే..

Health Tips: పొట్టలో ఏమీ లేనప్పుడు ఇవి తింటే చాలా ప్రమాదం..అవేంటంటే..

Health Tips: తల చాలా దురదగా ఉందా? అయితే ఈ చిట్కాలు మీకోసమే..

Oral Cancer: రెండు గాజులు అమ్ముకోకండి..నోటి క్యాన్సర్‌కు ప్రధాన కారణం ఇదే..

Health Tips: మీకు కాఫీ తాగే అలవాటు లేదా ? అయితే రిస్కే..

తాజావార్తలు

  • Jagathgiri Gutta: వెరైటీ దొంగ.. అంతా దోచాడు.. కానీ ఆకలి తీరక పాలతో సరిపెట్టాడు..!

  • Live: తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు విడుదల

  • MohanBabu: మోహన్‌బాబు యూటర్న్.. నేను బీజేపీ మనిషిని..!!

  • Telangana: హైకోర్టు సీజేగా జస్టిస్ భూయాన్‌ ప్రమాణం.. శుభాకాంక్ష‌లు తెలిపిన‌ సీఎం

  • Tirumala: శ్రీవారి హుండీకి కాసుల వర్షం.. ప్రతినెలా రూ.100 కోట్లకు పైమాటే

ట్రెండింగ్‌

  • Interesting Facts: చిన్నారులకు తలవెంట్రుకలు ఎందుకు తీస్తారో తెలుసా?

  • Viral: ఘనంగా శునకం బర్త్‌ డే పార్టీ.. 5 వేల మందికి భోజనాలు.. పొలిటికల్‌ టచ్‌ కూడా ఉందట..!

  • Pabhojan Gold Tea: దీని ఖరీదు అక్షరాల రూ. 1 లక్ష

  • Stock Market : లాభనష్టాల మధ్య తీవ్ర ఊగిసలాట.. చివరికి లాభాల బాట

  • Traffic Police : హృదయాలు గెలుచుకున్న ట్రాఫిక్‌ పోలీస్‌..

For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2022 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions