మన వంట గదిలో దొరికే మసాలా దినుసులతో ఎన్నో రకాల రోగాలను నయం చెయ్యొచ్చు.. వంటల్లో కారం వాడటం కూడా మంచిదే.. పూర్వ కాలంలో ఎక్కువగా కారం వాడేవాళ్ళు కాదు.. కేవలం మిరియాలతో కూరలకు ఘాటును తీసుకొచ్చేవాళ్ళు.. అందుకే వాళ్ళు ఇప్పటికి కూడా యంగ్ గా ఉండటమే కాదు.. చాలా ఆరోగ్యంగా ఉన్నట్లు ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. మిరియాలను రోజు రెండు, మూడు గింజలను తీసుకుంటే ఎన్నో రోగాలను నయం చెయ్యొచ్చు..ఈరోజు మనం షుగర్ పేషంట్స్ కు మిరియాలు ఏ విధంగా సహాయపడతాయో తెలుసుకుందాం..
మన పూర్వికులు వంటల్లో కారానికి బదులుగా మిరియాల పొడినే వాడేవారని నిపుణులు చెబుతున్నారు. అసిడిటీ, ప్రేగు పూతలు, అల్సర్లు వంటి సమస్యలతో బాధపడే వారు ఎండు కారాన్ని తీసుకోవడం వల్ల సమస్య మరింత తీవ్రమవుతుంది. అలాంటి సందర్భాల్లో ఎండు కారాన్ని పూర్తిగా మానేయాలి. సాధారణంగా ఎండు కారానికి బదులుగా వంటల్లో మిరియాల పొడి, పచ్చి కారాన్ని వాడడమే మంచిదని చెబుతున్నారు.. వంటల్లో మిరియాల పొడిని వాడడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. ఇంటి చిట్కాల్లో అలాగే దగ్గు, జలుబు వంటి సమస్యలతో బాధపడేటప్పుడు మనం మిరియాలతో కషాయాన్ని, మిరియాల పాలను ఎక్కువగా తీసుకుంటూ ఉంటాము. మిరియాల్లో పెప్పరిన్ అనే రసాయనం ఉంటుంది. ఇది అలర్జీలకు కారణమయ్యే హిస్టమిన్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. దీంతో శ్లేష్మం ఎక్కువగా ఉత్పత్తి అవ్వదు. ఇక మనకు దగ్గు తగ్గుతుంది. అలాగే మిరియాలను ఉపయోగించడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. మతిమరుపు, అల్జీమర్స్ వంటి సమస్యలు రాకుండా చేయడంలో కూడా మిరియాలు మనకు ఎంతగానో సహాయపడతాయి..
అదే విధంగా కొన్ని వారాలపాటు తగినమోతాదులో మిరియాల పొడిని ఉపయోగించడం వల్ల డయాబెటిస్ వచ్చే అవకాశాలు 50 శాతం వరకు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. మిరియాలను తీసుకోవడం వల్ల శరీరంలో విష పదార్థాలు తొలగిపోతాయి. కీళ్ల నొప్పులు తగ్గుతాయి. ఇన్ ప్లామేషన్ తగ్గుతుంది. ఈ విధంగా మిరియాలు మనకు ఎంతో మేలు చేస్తాయని వంటల్లో కారానికి బదులుగా మిరియాల పొడిని ఉపయోగించడం వల్ల మంచి ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.. రోజు మిరియాలను రెండు తినడం వల్ల గొంతు గరగర తగ్గడమే కాదు.. బరువు కూడా తగ్గుతారని చెబుతున్నారు..