బ్యాక్ పెయిన్ దీన్నే మనం వెన్ను నొప్పి అని కూడా అంటాం. 25 ఏళ్ల నుంచి 45 ఏళ్ల వారికి ఇది ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఎందుకంటే వాళ్లే వెన్నుపూసపై ఎక్కువ భారం పెడతారు కాబట్టి . కాల్షియం లోపం వల్ల వెన్నుపూస ఆ భారాన్ని భరించలేక.. వెన్ను నొప్పి వస్తూ ఉంటుంది. కొన్ని ల్ఆహారపు అలవాట్లు పాటించడం ద్వారా కాల్షియం సమస్య తీరుతుంది. అలాగే సింపుల్ చిట్కాలతో వెన్ను నొప్పి కూడా మాయం అవుతుంది. మరి లేట్ ఎందుకు అవేంటో చూద్దామా..
చిట్కాలు:
1. ఆవనూనెలో 3 వెల్లుల్లి రెబ్బలు వేసి వేడి చెయ్యాలి. ఆ నూనె చల్లారిన తర్వాత నడుము, వీపు, మెడ వెనక భాగంలో నూనెతో మసాజ్ చేసుకోవాలి. ఇలా చేస్తే బ్యాక్ పెయిన్ సమస్య తొలగుతుంది.
2. ఉప్పు కలిపిన నీటితో కూడా ఈ సమస్యను తీర్చుకోవచ్చు. ఇందుకోసం ముందుగా నీటిని వేడి చెయ్యాలి. తర్వాత ఉప్పు వెయ్యాలి. ఇలా చేశాక..ఓ టవల్ను నీటిలో ముంచాలి. ఈ గోరు వెచ్చటి టవల్తో వెన్నుపై అదుముకోవాలి. తద్వారా రిలీఫ్ లభిస్తుంది.
3. ఓ ప్యాన్లో నీరు పోసి 2 టీ స్పూన్ల ఉప్పు వెయ్యాలి. వేడి చెయ్యాలి. అది కాస్త చల్లారాక… ఓ టవల్పై చల్లి… దాన్ని నొప్పి వస్తున్న దగ్గర చుట్టూ కట్టుకోవాలి. కొంత సేపటి తర్వాత కంఫర్ట్గా ఉంటుంది.
4. ఒకే విధంగా ఎక్కువ సేపు కూర్చోవద్దు. పని మధ్యలో అప్పుడప్పుడూ బ్రేక్ తీసుకోవాలి. మీ బాడీకి చిన్నపాటి రెస్ట్ ఇవ్వాలి. తినే ఆహారంలో అన్ని రకాల పోషకాలూ ఉండేలా చూసుకోవాలి. మంచి ద్రవాలు తాగాలి.
5. రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసేవారికి ఇలాంటి నొప్పులు రావు. ఆల్రెడీ నొప్పి ఉన్నవారు కూడా మెల్లగా ఎక్సర్సైజ్ స్టార్ట్ చేస్తే నొప్పి మెల్లగా తగ్గిపోతుంది.
6. గంటల తరబడి కంప్యూటర్ ముందు పనిచేస్తూ ఉంటే బ్యాక్ పెయిన్ వస్తుంది. అలాంటి వారు తప్పనిసరిగా ఎక్సర్సైజ్ చెయ్యాలి