Health Tips : గ్యాస్, కడుపులో మంట సమస్యతో భాధపడుతున్నారా? ఈ అద్భుతమైన చిట్కా మీ కోసమే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈరోజుల్లో ఆరోగ్యానికి మేలు చేసే ఆహారాన్ని ఎవరు తీసుకోరు.. ఎందుకంటే అవి రుచిగా ఉండవు.. కేవలం నోటికి రుచిగా ఉండే ఆహారాన్ని తింటూ అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.. మారిన ఆహారపు అలవాట్ల తో పాటు, టైం తినకపోవడం వల్ల అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. సరైన సమయానికి భోజనం చేయకపోవడం, మసాలాలు కలిగిన ఆహారాన్ని తీసుకోవడం, ప్రాసెస్ చేసిన ఫుడ్ ను ఎక్కువగా తీసుకోవడం వల్ల మలబద్దకం, గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యల బారిన పడుతున్నారు.. ఈ సమస్యను చిటికెలో నయం చేసే అద్భుతమైన చిట్కా గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ చిట్కాను వాడడం వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవు. గ్యాస్, ఎసిడిటీ సమస్యలను దూరం చేసే ఈచిట్కాను ఎలా తయారు చేసుకోవాలి…తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ చిట్కాను తయారు చేసుకోవడానికి గానూ ఒక గిన్నెలో ఒక గ్లాస్ నీటిని తీసుకోవాలి. ఆ తరువాత ఇందులో ఒక టీ స్పూన్ ధనియాలను, ఒక టీ స్పూన్ జీలకర్రను, 4 మిరియాలను, లవంగాలను, చిటికెడు పసుపును వేయాలి. ఈ నీటిని స్టవ్ మీద ఉంచి అర గ్లాస్ అయ్యే వరకు బాగా మరిగించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత ఈ కషాయాన్ని గోరు వెచ్చగా అయ్యే వరకు ఉంచాలి.
Also Read
- Chips Packet Empty: చిప్స్ ప్యాకెట్ సగం ఖాళీగా ఎందుకు ఉంటుంది..? 99 శాతం మందికి తెలియని నిజం ఇదే..
- Rainy Season Kitchen Tips : వర్షాల్లో బియ్యానికి పురుగులా? ఇలా చేస్తే సమస్యే లేదు.!
- Rainy Season Fridge Tips: వర్షాకాలంలో ఫ్రిజ్ ఇలా వాడండి.. కరెంట్ బిల్లు కూడా తగ్గుతుంది.!
- Kakarakaya Ulli Karam: చేదు లేకుండా కమ్మటి 'కాకరకాయ ఉల్లి కారం'.. ఇలా చేస్తే పిల్లలు కూడా వదలకుండా తింటారు!
కాషాయం బాగా మరగ కాగిన తరువాత దీనిని వడకట్టి గ్లాస్ లోకి తీసుకోవాలి. ఈ కషాయాన్ని రోజుకు ఒకటి నుండి రెండు సార్లు తీసుకోవచ్చు. ఈ విధంగా కషాయాన్ని తయారు చేసుకుని తాగడం వల్ల గ్యాస్, ఎసిడిటీ సమస్యల నుండి తక్షణ ఉపశమనం కలుగుతుంది. గ్యాస్, కడుపులో మంట వంటి సమస్యలు తలెత్తిన వెంటనే ఈ కషాయన్ని తయారు చేసుకుని తాగడం వల్ల మంచి ఉపశమనం కలుగుతుంది. ఈ కషాయాన్ని తాగడం వల్ల మలబద్దకం వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. వారానికి కనీసం రెండు రోజుల పాటు ఈ కషాయాన్ని తాగడం వల్ల గ్యాస్, ఎసిడిటీ వంటి జీర్ణ సమస్యలు రాకుండా ఉంటాయి.. అంతేకాదు శరీరంలో రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఈ కషాయాన్ని తాగడం వల్ల కడుపులో ఉండే పురుగులు నశిస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. శరీరంలో వేడి తగ్గుతుంది. ఈ కషాయాన్ని తాగడం వల్ల హార్మోన్లు విడుదలై ఆరోగ్యంగా ఉంటారు.. వారానికి రెండు సార్లు తాగితే మంచి లాభాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు..
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.
తాజావార్తలు
-
Jantar Mantar: కాక్రోచ్ వేదికపై కానిస్టేబుల్ రాజీనామా.. అసలు నిజం తెలిసి అంతా షాక్..
-
Chips Packet Empty: చిప్స్ ప్యాకెట్ సగం ఖాళీగా ఎందుకు ఉంటుంది..? 99 శాతం మందికి తెలియని నిజం ఇదే..
-
England Team: ఇంగ్లాండ్ జట్టు తదుపరి కెప్టెన్ ఎవరు..? కెప్టెన్సీ రేసులో సీనియర్ బ్యాటర్..
-
PM Modi: ఇన్స్టాగ్రామ్ వాడండి, యూత్కు దగ్గరకండి.. మంత్రులకు మోడీ క్లాస్..
-
Bhatti Vikramarka : సింగరేణి బ్లాకులు ప్రైవేట్ పరమైతే తీవ్ర ప్రమాదం
ట్రెండింగ్
-
Rainy Season Kitchen Tips : వర్షాల్లో బియ్యానికి పురుగులా? ఇలా చేస్తే సమస్యే లేదు.!
-
కేవలం రూ. 8,999 లకే120Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో Lava Virat V1 5G, Virat V1 స్మార్ట్ఫోన్లు లాంచ్..!
-
రూ. 19,499లకే 50MP సోనీ కెమెరా, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో iQOO Z11 Lite 5G లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సక్సెస్ను తలకెక్కించుకోను.. బుద్దిగా ఉంటా.. వైభవ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kakarakaya Ulli Karam: చేదు లేకుండా కమ్మటి ‘కాకరకాయ ఉల్లి కారం’.. ఇలా చేస్తే పిల్లలు కూడా వదలకుండా తింటారు!