Health Tips : గ్యాస్, కడుపులో మంట సమస్యతో భాధపడుతున్నారా? ఈ అద్భుతమైన చిట్కా మీ కోసమే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈరోజుల్లో ఆరోగ్యానికి మేలు చేసే ఆహారాన్ని ఎవరు తీసుకోరు.. ఎందుకంటే అవి రుచిగా ఉండవు.. కేవలం నోటికి రుచిగా ఉండే ఆహారాన్ని తింటూ అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.. మారిన ఆహారపు అలవాట్ల తో పాటు, టైం తినకపోవడం వల్ల అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. సరైన సమయానికి భోజనం చేయకపోవడం, మసాలాలు కలిగిన ఆహారాన్ని తీసుకోవడం, ప్రాసెస్ చేసిన ఫుడ్ ను ఎక్కువగా తీసుకోవడం వల్ల మలబద్దకం, గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యల బారిన పడుతున్నారు.. ఈ సమస్యను చిటికెలో నయం చేసే అద్భుతమైన చిట్కా గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ చిట్కాను వాడడం వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవు. గ్యాస్, ఎసిడిటీ సమస్యలను దూరం చేసే ఈచిట్కాను ఎలా తయారు చేసుకోవాలి…తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ చిట్కాను తయారు చేసుకోవడానికి గానూ ఒక గిన్నెలో ఒక గ్లాస్ నీటిని తీసుకోవాలి. ఆ తరువాత ఇందులో ఒక టీ స్పూన్ ధనియాలను, ఒక టీ స్పూన్ జీలకర్రను, 4 మిరియాలను, లవంగాలను, చిటికెడు పసుపును వేయాలి. ఈ నీటిని స్టవ్ మీద ఉంచి అర గ్లాస్ అయ్యే వరకు బాగా మరిగించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత ఈ కషాయాన్ని గోరు వెచ్చగా అయ్యే వరకు ఉంచాలి.
Also Read
- Rainy Season Tips : వర్షాకాలంలో ఆకుకూరలు తింటున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే.!
- Male Fertility: సిగరెట్ మాత్రమే కాదు.. ఈ అలవాట్లు కూడా స్పెర్మ్ కౌంట్ను దెబ్బతీస్తున్నాయి..
- Ragi Bondalu: రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. 'సూపర్ ఫుడ్' మునగాకుతో రాగి బొండాలు సింపుల్గా ఇలా చేసేయండి!
- Health Tips: కిడ్నీలో రాళ్లు కరగడానికి బెస్ట్ రెమిడీ.. ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు..
కాషాయం బాగా మరగ కాగిన తరువాత దీనిని వడకట్టి గ్లాస్ లోకి తీసుకోవాలి. ఈ కషాయాన్ని రోజుకు ఒకటి నుండి రెండు సార్లు తీసుకోవచ్చు. ఈ విధంగా కషాయాన్ని తయారు చేసుకుని తాగడం వల్ల గ్యాస్, ఎసిడిటీ సమస్యల నుండి తక్షణ ఉపశమనం కలుగుతుంది. గ్యాస్, కడుపులో మంట వంటి సమస్యలు తలెత్తిన వెంటనే ఈ కషాయన్ని తయారు చేసుకుని తాగడం వల్ల మంచి ఉపశమనం కలుగుతుంది. ఈ కషాయాన్ని తాగడం వల్ల మలబద్దకం వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. వారానికి కనీసం రెండు రోజుల పాటు ఈ కషాయాన్ని తాగడం వల్ల గ్యాస్, ఎసిడిటీ వంటి జీర్ణ సమస్యలు రాకుండా ఉంటాయి.. అంతేకాదు శరీరంలో రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఈ కషాయాన్ని తాగడం వల్ల కడుపులో ఉండే పురుగులు నశిస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. శరీరంలో వేడి తగ్గుతుంది. ఈ కషాయాన్ని తాగడం వల్ల హార్మోన్లు విడుదలై ఆరోగ్యంగా ఉంటారు.. వారానికి రెండు సార్లు తాగితే మంచి లాభాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు..
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.
తాజావార్తలు
-
Deewana OTT Deal: కంటెంట్పై నమ్మకం.. నిర్మాతలకు రూ.7 కోట్ల జాక్పాట్!
-
Nandamuri Mokshagna Debut: మోక్షజ్ఞ కోసం రంగంలోకి మాస్ డైరెక్టర్! బాలయ్య ప్లాన్ మామూలుగా లేదుగా..
-
Kiran Abbavaram: థియేటర్ల నుంచి బయటకొచ్చాక నెలల తరబడి గుర్తుంటుంది.. ‘చెన్నై లవ్ స్టోరీ’పై కిరణ్ అబ్బవరం ప్రామిస్!
-
CM Chandrababu: సముద్రంలో గల్లంతైన ఏడుగురు మత్స్యకారుల్లో ఒకరు సేఫ్.. రంగంలోకి సీఎం చంద్రబాబు..!
-
Vaibhav Sooryavanshi: ‘మీ ప్రేమ ఎప్పటికీ మర్చిపోను’.. తొలి మ్యాచ్ తర్వాత వైభవ్ ఎమోషనల్ సందేశం..
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఆకుకూరలు తింటున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో తేమతో సరుకులు పాడవ్వకుండా ఇలా కాపాడుకోండి.!
-
పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్పై ‘Telegram’కు కేంద్రం నోటీసు జారీ.. 3,142 పైరసీ ఛానళ్ల గుర్తింపు.!
-
IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. ‘వైభవ్’ అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!
-
England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘వయాగ్రా’ అనుమతి.. అసలు కారణం ఇదే!