Bloating After Eating: తిన్న తర్వాత కడుపులో నొప్పి అనిపిస్తుందా.. వీటిని ట్రై చేయండి..
Bloating After Eating: సాధారణంగా చాలా మందికి ఒక సమస్య కామన్గా వేధిస్తుంటుంది. ఇంతకీ ఆ సమస్య ఏమిటని అనుకుంటున్నారు. కడుపు ఉబ్బరం. భోజనం చేసిన తర్వాత చాలా మందిని వయస్సుతో సంబంధం లేకుండా ఈ సమస్య వేధిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ప్రజలు ఉబ్బరంతో బాధపడుతున్నారు. ఈ సమస్యతో బాధపడుతున్న వారికి శుభవార్త.. కొన్ని ఆరోగ్యకరమైన ఆహారాలు ఈ సమస్యను తగ్గిస్తాయని నిపుణులు చెబుతున్నారు. హార్వర్డ్లో శిక్షణ పొందిన గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డాక్టర్ సౌరభ్ సేథి ఇటీవల తన ఇన్స్టాగ్రామ్లో ఉబ్బరం, బరువును తగ్గించడంలో సహాయపడే కొన్ని ఆహారాల నియమాల గురించి పంచుకున్నారు. ఇంతకీ అవి ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం..
READ ALSO: Pawan Kalyan: గురుకులంలో ఇద్దరు విద్యార్థినుల మృతి.. డిప్యూటీ సీఎం పవన్ రియాక్షన్ ఇదే..
Also Read
- Sugarcane Juice Side Effects: వేసవిలో చెరకు రసం తాగుతున్నారా? అయితే జాగ్రత్త..!
- Sorakaya Garelu Recipe: కరకరలాడే కమ్మని సొరకాయ గారెలు.. 10 నిమిషాల్లో ఇలా రెడీ చేసేయండి.!
- Kidney Stones Rising in Summer: వేసవిలో కిడ్నీల్లో పెరిగిపోతున్న రాళ్లు.. ఇలా చెక్ పెట్టండి..!
- Natural Home Cooling Tips: మీ ఇల్లు ఫ్రిజ్లా కూల్గా మారిపోతుంది.. 3000 ఏళ్ల నాటి చిట్కాలు.. కరెంట్ అవసరమే లేదు..!
కివీ: ఫైబర్ అధికంగా ఉండే కివీస్లో ఆక్టినిడిన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది ప్రోటీన్ను జీర్ణం చేయడానికి విశేషంగా సహాయపడుతుంది. ఒక అధ్యయనం ప్రకారం.. రోజూ రెండు కివీలు తినడం వల్ల మలబద్దకం, కడుపు ఉబ్బరం నుంచి ఉపశమనం లభిస్తుందన చెప్పారు.
సోంపు: భోజనం తర్వాత గ్యాస్, కడుపు ఉబ్బరం తగ్గించడానికి సోంపును చాలా ఏళ్లుగా ఉపయోగిస్తున్నారు. UK ఆరోగ్య సంస్థ NIH అధ్యయనం ప్రకారం.. సోంపు నూనె ఉబ్బరం, IBS (ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్) తో సంబంధం ఉన్న గ్యాస్ను తగ్గించడంలో సహాయపడుతుందని అంటున్నారు.
బొప్పాయి: బొప్పాయిలో పపైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది ప్రోటీన్లను విచ్చిన్నం చేయడంలో సహాయపడటంతో పాటు, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. భోజనం తర్వాత కొద్ది మొత్తంలో బొప్పాయి తినడం వల్ల మీ కడుపు తేలికగా అనిపించవచ్చని పరిశోధనలు సూచిస్తున్నాయి.
అనాస పండు: పైనాపిల్లో బ్రోమెలైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది ప్రోటీన్ను జీర్ణం చేయడానికి సహాయపడటంతో పాటు వాపును తగ్గిస్తుంది. భోజనం తర్వాత కొద్ది మొత్తంలో తాజా పైనాపిల్ తినడం జీర్ణక్రియకు ప్రయోజనకరంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
దోసకాయ: దోసకాయలు నీరు, ఫైబర్తో సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరం నుంచి అదనపు సోడియంను తొలగించడంలో సహాయపడతాయి. అలాగే శరీరంలో నీరు నిలుపుదల, కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తాయి. వీటిని సలాడ్ లేదా స్నాక్గా తినవచ్చని చెబుతున్నారు.
READ ALSO: Honey In Hot Water: హాట్ వాటర్లో తేనె కలుపుతున్నారా? అలా చేస్తే విషం అవుతుందని తెలుసా!
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!