Bloating After Eating: తిన్న తర్వాత కడుపులో నొప్పి అనిపిస్తుందా.. వీటిని ట్రై చేయండి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bloating After Eating: సాధారణంగా చాలా మందికి ఒక సమస్య కామన్గా వేధిస్తుంటుంది. ఇంతకీ ఆ సమస్య ఏమిటని అనుకుంటున్నారు. కడుపు ఉబ్బరం. భోజనం చేసిన తర్వాత చాలా మందిని వయస్సుతో సంబంధం లేకుండా ఈ సమస్య వేధిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ప్రజలు ఉబ్బరంతో బాధపడుతున్నారు. ఈ సమస్యతో బాధపడుతున్న వారికి శుభవార్త.. కొన్ని ఆరోగ్యకరమైన ఆహారాలు ఈ సమస్యను తగ్గిస్తాయని నిపుణులు చెబుతున్నారు. హార్వర్డ్లో శిక్షణ పొందిన గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డాక్టర్ సౌరభ్ సేథి ఇటీవల తన ఇన్స్టాగ్రామ్లో ఉబ్బరం, బరువును తగ్గించడంలో సహాయపడే కొన్ని ఆహారాల నియమాల గురించి పంచుకున్నారు. ఇంతకీ అవి ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం..
READ ALSO: Pawan Kalyan: గురుకులంలో ఇద్దరు విద్యార్థినుల మృతి.. డిప్యూటీ సీఎం పవన్ రియాక్షన్ ఇదే..
Also Read
- Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి 'గ్లో' రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
- Ridge Gourd Peel Chutney: బీరకాయ తొక్కతో నోరూరించే పచ్చడి.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే!
- Dr. Himabindu Annamaraju : లక్షల్లో ఒక్కరికి వచ్చే రుగ్మత.. తల్లీబిడ్డకు సేఫ్ డెలివరీ..!
- Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
కివీ: ఫైబర్ అధికంగా ఉండే కివీస్లో ఆక్టినిడిన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది ప్రోటీన్ను జీర్ణం చేయడానికి విశేషంగా సహాయపడుతుంది. ఒక అధ్యయనం ప్రకారం.. రోజూ రెండు కివీలు తినడం వల్ల మలబద్దకం, కడుపు ఉబ్బరం నుంచి ఉపశమనం లభిస్తుందన చెప్పారు.
సోంపు: భోజనం తర్వాత గ్యాస్, కడుపు ఉబ్బరం తగ్గించడానికి సోంపును చాలా ఏళ్లుగా ఉపయోగిస్తున్నారు. UK ఆరోగ్య సంస్థ NIH అధ్యయనం ప్రకారం.. సోంపు నూనె ఉబ్బరం, IBS (ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్) తో సంబంధం ఉన్న గ్యాస్ను తగ్గించడంలో సహాయపడుతుందని అంటున్నారు.
బొప్పాయి: బొప్పాయిలో పపైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది ప్రోటీన్లను విచ్చిన్నం చేయడంలో సహాయపడటంతో పాటు, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. భోజనం తర్వాత కొద్ది మొత్తంలో బొప్పాయి తినడం వల్ల మీ కడుపు తేలికగా అనిపించవచ్చని పరిశోధనలు సూచిస్తున్నాయి.
అనాస పండు: పైనాపిల్లో బ్రోమెలైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది ప్రోటీన్ను జీర్ణం చేయడానికి సహాయపడటంతో పాటు వాపును తగ్గిస్తుంది. భోజనం తర్వాత కొద్ది మొత్తంలో తాజా పైనాపిల్ తినడం జీర్ణక్రియకు ప్రయోజనకరంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
దోసకాయ: దోసకాయలు నీరు, ఫైబర్తో సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరం నుంచి అదనపు సోడియంను తొలగించడంలో సహాయపడతాయి. అలాగే శరీరంలో నీరు నిలుపుదల, కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తాయి. వీటిని సలాడ్ లేదా స్నాక్గా తినవచ్చని చెబుతున్నారు.
READ ALSO: Honey In Hot Water: హాట్ వాటర్లో తేనె కలుపుతున్నారా? అలా చేస్తే విషం అవుతుందని తెలుసా!
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.
తాజావార్తలు
-
Ponguleti Srinivas : తెలంగాణకు 11.56 లక్షల ఇళ్లు.. కేంద్రానికి మంత్రి పొంగులేటి బిగ్ రిక్వెస్ట్..
-
Anupama: మౌనం వీడిన అనుపమ: టాక్సిక్ రిలేషన్షిప్పై సంచలన వ్యాఖ్యలు
-
Donald Trump: ‘‘ అల్లా దయ వల్ల.. హార్ముజ్ స్వాధీనం’’.. ట్రంప్ సంచలన ప్రకటన..
-
Mythri Ravi : Fauzi ఎట్టి పరిస్థితుల్లోనూ తేడా జరగదు..అది వేరే లెవెల్ లో ఉంటది!
-
Iran-Trump: ట్రంప్ టర్కీ టూర్లో ఇరాన్ ఇంత ప్లాన్ చేసిందా? వెలుగులోకి సంచలన కథనం
ట్రెండింగ్
-
Rahul Dravid Records: రాహుల్ ద్రవిడ్ ఈ 3 రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. సచిన్ వల్లనే సాధ్యం కాలేదు!
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
N Chandrasekaran: టాటా గ్రూప్లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..