Bloating After Eating: తిన్న తర్వాత కడుపులో నొప్పి అనిపిస్తుందా.. వీటిని ట్రై చేయండి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bloating After Eating: సాధారణంగా చాలా మందికి ఒక సమస్య కామన్గా వేధిస్తుంటుంది. ఇంతకీ ఆ సమస్య ఏమిటని అనుకుంటున్నారు. కడుపు ఉబ్బరం. భోజనం చేసిన తర్వాత చాలా మందిని వయస్సుతో సంబంధం లేకుండా ఈ సమస్య వేధిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ప్రజలు ఉబ్బరంతో బాధపడుతున్నారు. ఈ సమస్యతో బాధపడుతున్న వారికి శుభవార్త.. కొన్ని ఆరోగ్యకరమైన ఆహారాలు ఈ సమస్యను తగ్గిస్తాయని నిపుణులు చెబుతున్నారు. హార్వర్డ్లో శిక్షణ పొందిన గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డాక్టర్ సౌరభ్ సేథి ఇటీవల తన ఇన్స్టాగ్రామ్లో ఉబ్బరం, బరువును తగ్గించడంలో సహాయపడే కొన్ని ఆహారాల నియమాల గురించి పంచుకున్నారు. ఇంతకీ అవి ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం..
READ ALSO: Pawan Kalyan: గురుకులంలో ఇద్దరు విద్యార్థినుల మృతి.. డిప్యూటీ సీఎం పవన్ రియాక్షన్ ఇదే..
Also Read
- International Tea Day: మీరు ప్రతిరోజూ తాగే చాయ్ నిజంగా ఆరోగ్యకరమేనా..?
- Helmet and Hair Loss: హెల్మెట్ వల్ల నిజంగా జుట్టు రాలుతుందా..? వైద్యులు చెప్పిన అసలు నిజం ఇదే..
- Summer Foods for Kids: డీహైడ్రేషన్కు చెక్..! వేసవిలో పిల్లలను వడదెబ్బ నుంచి కాపాడే సూపర్ ఫుడ్స్ ఇవే..
- Green Moong Chaat Recipe: రొటీన్ బ్రేక్ ఫాస్ట్ బోర్ కొట్టిందా..? సింపుల్గా హై ప్రోటీన్ పెసరపప్పు చాట్ ట్రై చేయండి..
కివీ: ఫైబర్ అధికంగా ఉండే కివీస్లో ఆక్టినిడిన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది ప్రోటీన్ను జీర్ణం చేయడానికి విశేషంగా సహాయపడుతుంది. ఒక అధ్యయనం ప్రకారం.. రోజూ రెండు కివీలు తినడం వల్ల మలబద్దకం, కడుపు ఉబ్బరం నుంచి ఉపశమనం లభిస్తుందన చెప్పారు.
సోంపు: భోజనం తర్వాత గ్యాస్, కడుపు ఉబ్బరం తగ్గించడానికి సోంపును చాలా ఏళ్లుగా ఉపయోగిస్తున్నారు. UK ఆరోగ్య సంస్థ NIH అధ్యయనం ప్రకారం.. సోంపు నూనె ఉబ్బరం, IBS (ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్) తో సంబంధం ఉన్న గ్యాస్ను తగ్గించడంలో సహాయపడుతుందని అంటున్నారు.
బొప్పాయి: బొప్పాయిలో పపైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది ప్రోటీన్లను విచ్చిన్నం చేయడంలో సహాయపడటంతో పాటు, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. భోజనం తర్వాత కొద్ది మొత్తంలో బొప్పాయి తినడం వల్ల మీ కడుపు తేలికగా అనిపించవచ్చని పరిశోధనలు సూచిస్తున్నాయి.
అనాస పండు: పైనాపిల్లో బ్రోమెలైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది ప్రోటీన్ను జీర్ణం చేయడానికి సహాయపడటంతో పాటు వాపును తగ్గిస్తుంది. భోజనం తర్వాత కొద్ది మొత్తంలో తాజా పైనాపిల్ తినడం జీర్ణక్రియకు ప్రయోజనకరంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
దోసకాయ: దోసకాయలు నీరు, ఫైబర్తో సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరం నుంచి అదనపు సోడియంను తొలగించడంలో సహాయపడతాయి. అలాగే శరీరంలో నీరు నిలుపుదల, కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తాయి. వీటిని సలాడ్ లేదా స్నాక్గా తినవచ్చని చెబుతున్నారు.
READ ALSO: Honey In Hot Water: హాట్ వాటర్లో తేనె కలుపుతున్నారా? అలా చేస్తే విషం అవుతుందని తెలుసా!
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.
తాజావార్తలు
-
Pulwama Attack: అజ్ఞాత వ్యక్తుల సంచలనం.. పాక్లో పుల్వామా సూత్రధారి హతం..
-
Peddi Twist: ఢిల్లీ ఎపిసోడ్ ట్విస్ట్.. ‘ఉప్పెన’ క్లైమాక్స్ కంటే 100 రెట్లు ఎక్కువ!
-
Cockroach Janata Party: కాక్రోచ్ జనతా పార్టీకి బిగ్ షాక్.. “ఎక్స్” అకౌంట్ నిలిపివేత..
-
Hardik Pandya-MI: ఒక కిచెన్లో చాలా మంది చెఫ్స్.. హార్దిక్ పాండ్యాకు బయటికి వెళ్లే సమయం వచ్చేసింది!
-
YS Jagan: ఇంధన పొదుపు అంటూ ప్రజల చెవిలో పువ్వులు.. మీరు మాత్రం ప్రైవేట్ చాపర్స్లో షికారు..!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!