Crab Biryani Recipe : సీఫుడ్ ప్రియుల కోసం స్పెషల్ ‘పీతల బిర్యానీ’.. హోటల్ స్టైల్లో ఇంట్లోనే ఈజీగా చేసేయండి ఇలా.!
- హోటల్ స్టైల్ పీతల బిర్యానీ ఇంట్లోనే
- పీతల మసాలా తయారీలో అసలు సీక్రెట్ ఇదే
- దమ్ బిర్యానీకి ఫాలో అవ్వాల్సిన ఈజీ ట్రిక్స్
- వీకెండ్ స్పెషల్గా ట్రై చేయాల్సిన సీఫుడ్ రెసిపీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
crab biryani recipe telugu : సీఫుడ్ అనగానే చాలామందికి చేపలు లేదా రొయ్యలు మాత్రమే గుర్తొస్తాయి. కానీ, పీతలతో చేసే వంటకాల రుచి అమోఘం. ముఖ్యంగా మసాలాలు దట్టించిన పీతల బిర్యానీ (Crab Biryani) ఉంటే ఆ మజాయే వేరు. సాధారణంగా హోటల్స్లో మాత్రమే దొరికే ఈ నోరూరించే బిర్యానీని ఇంట్లోనే ఎంతో రుచిగా, సులభంగా ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం.
కావలసిన పదార్థాలు
ఈ బిర్యానీ తయారీకి అర కిలో శుభ్రం చేసిన పీతలు, రెండు కప్పుల బాస్మతీ బియ్యం, మూడు పెద్ద ఉల్లిపాయలు (సన్నగా తరిగినవి), రెండు టమోటాలు, రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోవాలి. మసాలా కోసం పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా , బిర్యానీ ఆకు, లవంగాలు, యాలకులు వంటి హోల్ గరం మసాలా సిద్ధం చేసుకోవాలి. రుచికి తగినంత ఉప్పు, నూనె , నెయ్యి కూడా అవసరమవుతాయి.
Also Read
- Ragi Biscuits : హెల్తీ రాగి బిస్కెట్లు ఎయిర్ ఫ్రైయర్లో 10 నిమిషాల్లో ఇలా చేసుకోండి.!
- Diabetes Diet: రోటీ vs అన్నం.. డయాబెటిస్ రోగులకు ఏది బెస్ట్?
- Fast Food Side Effects: పళ్ల సమస్యల నుంచి క్యాన్సర్ వరకు.. ఫాస్ట్ ఫుడ్ ప్రభావం.. నిపుణుల హెచ్చరిక
- Walking After Meals: భోజనం తర్వాత నడవాలా? ఎంతసేపు నడిస్తే ఆరోగ్యానికి మేలు?
పీతల మసాలా తయారీ (గ్రేవీ)
ముందుగా పీతలను ఉప్పు, పసుపు వేసి బాగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఒక వెడల్పాటి పాన్ తీసుకుని అందులో నూనె, నెయ్యి వేసి వేడెక్కనివ్వాలి. అందులో హోల్ గరం మసాలా దినుసులు వేసి వేయించిన తర్వాత, ఉల్లిపాయ ముక్కలు వేసి అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయించాలి. ఆపై అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించి, టమోటా ముక్కలు, పచ్చిమిర్చి వేసి మెత్తగా ఉడికించాలి. ఇప్పుడు ఇందులో కారం, ధనియాల పొడి, పసుపు, గరం మసాలా , తగినంత ఉప్పు వేసి కలపాలి. మసాలా వేగాక శుభ్రం చేసిన పీతలను అందులో వేసి, మసాలా అంతా పీతలకు పట్టేలా ఐదు నిమిషాలు మగ్గించాలి. అర కప్పు నీళ్లు పోసి మూత పెట్టి పీతలను ముప్పావు వంతు ఉడికించి పక్కన పెట్టుకోవాలి.
బిర్యానీ రైస్ తయారీ , దమ్ చేయడం
మరోవైపు బాస్మతీ బియ్యాన్ని అరగంట పాటు నానబెట్టుకోవాలి. ఎసరు కోసం ఎసరు నీళ్లలో బిర్యానీ ఆకు, షాజీరా, ఉప్పు వేసి నీటిని మరిగించాలి. నీళ్లు మరిగేటప్పుడు నానబెట్టిన బియ్యాన్ని వేసి 70 శాతం వరకు ఉడికించి, నీటిని వడకట్టాలి. ఇప్పుడు అసలైన ప్రక్రియ ప్రారంభమవుతుంది. అడుగు మందంగా ఉన్న ఒక గిన్నె తీసుకుని, ముందుగా తయారు చేసిన పీతల గ్రేవీని ఒక పొరలా వేయాలి. దానిపై ఉడికించిన అన్నాన్ని సమానంగా పరచాలి. పైన కొద్దిగా నెయ్యి, వేయించిన ఉల్లిపాయలు (ఫ్రైడ్ ఆనియన్స్), పుదీనా, కొత్తిమీర చల్లాలి. గిన్నెపై మూత పెట్టి ఆవిరి బయటకు పోకుండా గోధుమపిండితో లేదా బరువైన వస్తువుతో సీల్ చేయాలి. చిన్న మంటపై 10 నుండి 15 నిమిషాల పాటు దమ్ చేయాలి.
ధమ్ పూర్తయ్యాక స్టవ్ ఆపేసి మరో 10 నిమిషాల పాటు అలాగే వదిలేయాలి. ఆ తర్వాత నెమ్మదిగా మూత తీసి కింద నుంచి కలుపుతూ సర్వ్ చేసుకోవాలి. వేడివేడి పీతల బిర్యానీని ఉల్లిపాయ ముక్కలు, నిమ్మకాయ , రైతాతో తింటే హోటల్ రుచిని మించిపోతుంది. పీతల లోపలి వరకు మసాలా వెళ్లి, అన్నం పొడిపొడిగా ఉండి అద్భుతమైన సువాసనతో ఈ బిర్యానీ మిమ్మల్ని మంత్రముగ్ధులను చేస్తుంది. ఈ వీకెండ్లో మీరు కూడా ఈ స్పెషల్ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి!
తాజావార్తలు
ట్రెండింగ్
-
Toilet Cleaning : టాయిలెట్ క్లీనింగ్ చేస్తున్నారా..? అయితే ఈ 5 ఘోరమైన పొరపాట్లు అస్సలు చేయకండి.!
-
Cockroach Control : ఫ్రిజ్లో బొద్దింకల బెడదా.? ఈ సింపుల్ ట్రిక్తో చెక్ పెట్టండి..!
-
Ragi Biscuits : హెల్తీ రాగి బిస్కెట్లు ఎయిర్ ఫ్రైయర్లో 10 నిమిషాల్లో ఇలా చేసుకోండి.!
-
Kitchen Tips : నల్లబడిన వెండి ఆభరణాలు, వస్తువులు కొత్త వాటిలా మెరవాలా..? ఈ కిచెన్ ట్రిక్ సూపర్!
-
మళ్లీ అందుబాటులోకి Telegram.. కానీ వారికీ మాత్రం.!