Noida Phase 2 Protest: కట్టలు తెంచుకున్న కార్మికుల కోపం.. నోయిడాలో కార్లకు నిప్పు.. రాళ్లదాడితో దద్దరిల్లిన వీధులు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Noida Phase 2 Protest: తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ గత మూడు రోజులుగా నిరసన తెలుపుతున్న ప్రైవేట్ కంపెనీల ఉద్యోగుల ఆగ్రహం సోమవారం ఒక్కసారిగా కట్టలు తెంచుకుంది. నోయిడాలోని ఫేజ్-2 ప్రాంతంలో గత మూడు రోజులుగా శాంతియుతంగా సాగుతున్న ప్రైవేట్ కంపెనీ ఉద్యోగుల ఆందోళన సోమవారం ఒక్కసారిగా హింసాత్మకంగా మారాయి. వేతనాల పెంపుతో పాటు పలు డిమాండ్ల కోసం ఉద్యోగులు చేపట్టిన నిరసన ఉగ్రరూపం దాల్చడంతో నోయిడా వీధులు ఒక్కసారిగా రణభూమిని తలపించాయి. నోయిడా ఫేజ్-2 పరిధిలోని సెక్షన్-84 ప్రాంతంలో నిరసనకారులు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చిన హింసకు దిగారు.
READ ALSO: Akkineni : అక్కినేని ఫ్యాన్స్కు డబుల్ ట్రీట్.. నాగచైతన్య లైనప్లో ప్రాజెక్టులు!
Also Read
- AIADMK MLAs Support Vijay: అన్నాడీఎంకేలో భారీ చీలిక.. విజయ్ గూటికి 30 మంది ఎమ్మెల్యేలు..
- High Court: భర్తను కత్తితో పొడిచి చంపిన భార్య.. జస్ట్ రూ.500 జరిమానా విధించి నిర్దోశిగా తేల్చిన హైకోర్టు
- Palak Paratha Recipe: హెల్దీగా, టేస్టీగా చేసే సూపర్ సాఫ్ట్ 'పాలక్ పరోటా'.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
- CM Vijay: సీఎం విజయ్ సంచలన నిర్ణయం.. మందుబాబులకు బిగ్ షాక్!
పోలీసులపై రాళ్లదాడి.. వాహనాలకు నిప్పు
వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ వందలాది మంది ఉద్యోగులు ఉదయాన్నే రహదారులను దిగ్బంధించారు. పోలీసులు వారిని చెదరగొట్టేందుకు ప్రయత్నించడంతో పరిస్థితి విషమించింది. ఆగ్రహించిన నిరసనకారులు ఒక్కసారిగా పోలీసు వాహనాలపై రాళ్లతో దాడి చేశారు. ఇదే సమయంలో సెక్టర్-84లో రెండు వాహనాలకు నిప్పు కూడా పెట్టారు. దీంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగతో, భీతావహ వాతావరణంతో నిండిపోయింది.
పెరుగుతున్న ధరలకు అనుగుణంగా తమ వేతనాలు పెంచడం లేదని, కనీస సౌకర్యాలు లేని పరిస్థితుల్లో పని చేయాల్సి వస్తోందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం వస్తున్న జీతం తమకు ఏమాత్రం సరిపోవడం లేదని, అందుకే రోడ్లపైకి రావాల్సి వచ్చిందని వారు కన్నీళ్లు పెట్టుకున్నారు. నిజానికి ఈ ఉద్రిక్తతలకు ఒక రోజు ముందే జిల్లా యంత్రాంగం, పోలీసు అధికారులు ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో చర్చలు జరిపారు. సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చినప్పటికీ, క్షేత్రస్థాయిలో ఎటువంటి స్పష్టత రాకపోవడంతో ఉద్యోగులు శాంతించలేదు. సోమవారం ఉదయం ఒక్కసారిగా ఆందోళన ఉగ్రరూపం దాల్చింది.
భారీగా మోహరించిన పోలీసు బలగాలు
పరిస్థితి అదుపు తప్పుతుండటంతో అధికారులు అదనపు పోలీసు బలగాలను రంగంలోకి దించారు. లాఠీఛార్జ్ చేసి నిరసనకారులను చెదరగొట్టారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో 144 సెక్షన్ తరహా ఆంక్షలు అమలవుతున్నాయి. హింసకు పాల్పడిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని, ఎవరూ శాంతిభద్రతలకు విఘాతం కలిగించవద్దని అధికారులు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం అక్కడ ఉద్రిక్తత కొనసాగుతున్నప్పటికీ, పరిస్థితి తమ నియంత్రణలోనే ఉందని పోలీసులు చెబుతున్నారు.
తాజావార్తలు
-
AIADMK MLAs Support Vijay: అన్నాడీఎంకేలో భారీ చీలిక.. విజయ్ గూటికి 30 మంది ఎమ్మెల్యేలు..
-
Madhav Tiwari: నేను 4 ఓవర్లు బౌలింగ్ చేశా, ఇప్పటికీ నమ్మలేకపోతున్నా.. డీసీ ప్లేయర్ ఆనందం!
-
High Court: భర్తను కత్తితో పొడిచి చంపిన భార్య.. జస్ట్ రూ.500 జరిమానా విధించి నిర్దోశిగా తేల్చిన హైకోర్టు
-
Cannes 2026: కేన్స్ ఫెస్టివల్లో దేశీ గ్లామర్ షో.. ఖర్చులు చూసి షాక్ అవుతున్న నెటిజన్లు!
-
Palak Paratha Recipe: హెల్దీగా, టేస్టీగా చేసే సూపర్ సాఫ్ట్ ‘పాలక్ పరోటా’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
ట్రెండింగ్
-
Samsung: సర్టిఫైడ్ రీ-న్యూడ్ ప్రోగ్రామ్ తో రిఫర్బిష్డ్ గెలాక్సీ S25, గెలాక్సీ A56 మోడళ్లను తీసుకొచ్చిన శాంసంగ్..!
-
204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..
-
Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..
-
8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, యాక్టివ్ కూలింగ్తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!
-
PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..