Fish Curry : గుమగుమాలాడే చేపల పులుసును ఇలా చేసుకోండి.. మొత్తం ఖాళీ చేస్తారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చేపలు ఆరోగ్యానికి చాలా మంచివి.. అందుకే చాలా మంది చేపలను చేసుకొని తింటారు..చేపలతో మనం రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. అందులో చేపల పులుసు కూడా ఒకటి.. ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా చేపల పులుసు చేస్తారు.. మనం ఈరోజు ఆంధ్రా స్టైల్లో ఇప్పుడు చేపల పులుసు ఎలా చేసుకోవాలో ఇప్పుడు చేసుకుందాం..
కావలసిన పదార్థాలు :
Also Read
- Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
- High Protein Roti Recipe: గోధుమ పిండిలో ఈ 3 పదార్థాలు కలపండి.. హై ప్రోటీన్ రోటీ రెడీ..
- Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
- Kala Chana Pulao Recipe: 4 స్టెప్స్లో కాలా చనా పులావ్.. టేస్ట్తో పాటు ప్రోటీన్ డబుల్.!
చేప ముక్కలు – కిలో,
ఉప్పు – ఒక టీ స్పూన్,
కారం – ఒక టీ స్పూన్,
పసుపు – అర టీ స్పూన్,
ఎండుమిర్చి -1,
ధనియాలు – 2 టీ స్పూన్స్,
జీలకర్ర – ఒక టీ స్పూన్,
మిరియాలు – 7,
లవంగాలు – 4,
మెంతులు – పావు టీ స్పూన్,
దాల్చిన చెక్క – ఒక చిన్న ముక్క,
ఉల్లిపాయ – పెద్దది ఒకటి,
వెల్లుల్లి రెబ్బలు – 10,
అల్లం – ఒక ఇంచు ముక్క,
పచ్చి కొబ్బరి ముక్కలు – 2 టేబుల్ స్పూన్స్,
నూనె – ముప్పావు కప్పు,
ఆవాలు – అర టీ స్పూన్,
చిన్నగా తరిగిన ఉల్లిపాయలు – 4,
తరిగిన పచ్చిమిర్చి – 10,
కరివేపాకు – రెండు రెమ్మలు,
నానబెట్టిన చింతపండు – పెద్ద నిమ్మకాయంత,
తరిగిన కొత్తిమీర – కొద్దిగా..
తయారీ విధానం :
చేప ముక్కలను పసుపు, నిమ్మరసం, ఉప్పు వేసి బాగా శుభ్రంగా కడిగి పక్కన పెట్టాలి..తరువాత ఇందులో ఉప్పు, కారం, పసుపు వేసి కలిపి అర గంట పాటు పక్కకు ఉంచాలి. తరువాత తరువాత కళాయిలో ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, మిరియాలు, లవంగాలు, మెంతులు, దాల్చిన చెక్క వేసి దోరగా వేయించాలి. తరువాత వీటిని జార్ లో వేసి మెత్తగా మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి.ఆ తరువాత అదే జార్ లో పెద్ద ఉల్లిపాయ ముక్కలు, అల్లం, వెల్లుల్లి, కొబ్బరి ముక్కలు వేసి తగినన్ని నీళ్లు పోసి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత ఆవాలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తరువాత మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ వేసి వేయించాలి. దీనిని పచ్చి వాసన పోయే వరకు వేయించిన తరువాత తగినంత ఉప్పు, పసుపు, కారం వేసి బాగా కలపాలి.. ఆ తర్వాత బాగా కలపాలి.. చేప ముక్కలు వేసి అలా ఒక నిమిషం పాటు అలాగే ఉంచిన తరువాత మరో వైపుకు నెమ్మదిగా తిప్పుకోవాలి. వీటిని మరో నిమిషం పాటు ఉడికించిన తరువాత చింతపండు రసం, ఒక కప్పు నీళ్లు పోసుకోవాలి. 2 నిమిషాల పాటు ఉడికించాలి. పులుసు ఉడుకు పట్టిన తరువాత మంటను చిన్నగా చేసి మూత పెట్టి 10 నిమిషాల పాటు ఉడికించాలి. తరువాత మిక్సీ పట్టుకున్న మసాలా పొడి, మరో 5 పచ్చిమిర్చి, ఒక రెమ్మ కరివేపాకు వేసి నెమ్మదిగా కలపాలి. తరువాత దీనిని మరో 5 నిమిషాల పాటు ఉడికించి స్టప్ ఆఫ్ చేసే ముందు కొత్తిమీర చల్లుకోవాలి.. అంతే రుచికరమైన చేపల పులుసు రెడీ.. మీరు ట్రై చెయ్యండి..
తాజావార్తలు
-
Women Living Alone in India: వితంతువులు, విడాకులు, ఒంటరి మహిళల సంఖ్యపై షాకింగ్ రిపోర్ట్.. దక్షిణాదిలో ఎందుకు ఎక్కువ?
-
Hyderabad Metro : మెట్రో వ్యవస్థకు ఎలాంటి నష్టం లేదు.. స్పష్టం చేసిన HMRL
-
RCB Player: అభిమానులకు బిగ్షాక్.. రిటైర్మెంట్ ప్రకటించిన కీలక ప్లేయర్..
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
CM Chandrababu Vizag Tour: రేపు విశాఖకు సీఎం చంద్రబాబు..
ట్రెండింగ్
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!