ఓ మహిళ తన బాడీలో దాదాపు 22 ఏళ్లుగా ఓ ధర్మామీటర్ ముక్కను పెట్టుకుని అలానే జీవించింది. కూర్చుంటే తీవ్రమైన నొప్పి వస్తున్న అదేమిటే తనకీ అర్థం కాకపోయినా.. అలాగే ఆ నొప్పిని భరించిది. ఇక ఇటీవల ఓ డాక్టర్ దగ్గరకు వెళ్లి చూపించుకోగా.. అతడు చేసిన CT స్కాన్లో గుట్టు బయటపడింది.
పూర్తి వివరాల్లోకి వెళితో…ఓ స్త్రీ తన బాడీ పార్ట్లో విరిగిపోయిన థర్మామీటర్ ముక్కను పెట్టుకుని 22 సంవత్సరాలు జీవించింది. మిస్ హు అని పిలువబడే ఈ మహిళ.. ప్రాధమిక పాఠశాలలో చదువుతుండగా.. అనుకోకుండా థర్మామీటర్ పై కూర్చుంది. 2 సెంటీమీటర్ల పొడవున్న ఆ థర్మామీటర్ ముక్క.. రెండు దశాబ్దాలకు పైగా ఆమె శరీరంలోనే ఉండిపోయింది. ఆస్పత్రికి చికిత్స నిమిత్తం వచ్చిన ఆమెకు డాక్టర్లు CT స్కాన్ చేసి.. ఆ పరికరాన్ని గుర్తించారు. అదృష్టవశాత్తు అందులో పాదరసం లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందన్నారు. చైనాలోని వుహాన్కు చెందిన సదరు రోగి.. తన స్కూల్ డేస్లో ఫ్రెండ్స్ ఆటపట్టించడం ద్వారా ఈ ఘటన జరిగిందని వివరించింది.
అప్పటి నుంచి కూర్చుంటుండగా ప్రతీసారి నొప్పి పుడుతోందని.. ఆస్పత్రిలో చేరింది. దీంతో డాక్టర్లు ఆపరేషన్ చేసి విజయవంతంగా ఆ ధర్మామీటర్ ముక్కను ఆమె బాడీ నుంచి తొలగించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని డాక్టర్లు వెల్లడించారు. కాగా, మెడికల్ హిస్టరీలో ఇలాంటి కేసులు చాలా రేర్ అని.. వీటిని తొలగించేటప్పుడు తగిన విషయాలు దృష్టిలో పెట్టుకోవాలని డాక్టర్లు అన్నారు.
