WMO Warning: ప్రమాదకర ఎల్నినో రాబోతుంది.. ప్రపంచ వాతావరణ సంస్థ హెచ్చరిక
- వాతావరణ పరిస్థితులపై ప్రపంచ వాతావరణ సంస్థ హెచ్చరిక
- ప్రమాదకర ఎల్నినో రాబోతుందంటూ వార్నింగ్
- ఈ ఏడాది వర్షాలు తక్కువ ఉంటాయని సూచన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ ఏడాది వాతావరణ పరిస్థితులు భిన్నంగా ఉంటాయని ప్రపంచ వాతావరణ సంస్థ హెచ్చరించింది. ప్రపంచంలోకి ప్రమాదకరమైన ఎల్నినో రాబోతుందని.. దీంతో రుతుపవనాలు బలహీనపడతాయని వార్నింగ్ ఇచ్చింది. దీని కారణంగా ప్రపంచ వ్యాప్తంగా వడగాలులు, కరవులు ఏర్పడతాయని.. ఇక భారతదేశంలో రుతుపవనాలు బలహీనంగా ఉంటాయని సూచించింది.

Also Read
- Israe-Lebanon: లెబనాన్పై మరోసారి ఇజ్రాయెల్ భీకర దాడులు.. పశ్చిమాసియాలో టెన్షన్
- Pakistan: ‘‘అసిమ్ మునీర్ కండోమ్లు పంచుతాడా.?’’ పాక్ ఆర్మీ చీఫ్ కొత్త బాధ్యతలపై సెటైర్లు..
- Iran War: ట్రంప్ వార్నింగ్తో ఉద్రిక్తతలు.. అమెరికాతో చర్చలకు నో చెప్పిన ఇరాన్
- Mojtaba Khamenei: ప్రతీకారం తప్పకుండా ఉంటుంది.. యూఎస్-ఇజ్రాయిల్కు మొజ్తబా వార్నింగ్..
వాస్తవానికి గతేడాది మే నెల మధ్యలోనే రుతుపవనాలు ఎంట్రీ ఇచ్చాయి. దీంతో విస్తారంగా వర్షాలు కురవడంతో నదులు, భూగర్భ జలాలు సంపూర్ణంగా నిండాయి. దీంతో పాడి పంటలు సమృద్ధిగా పండాయి. కానీ ఈ ఏడాది ఇంకా తొలకరి పలకరించలేదు. ఆకాశం వైపు చూస్తున్న అన్నదాతలకు ఎదురుచూపులే మిగిలాయి.
ఇలాంటి తరుణంలో ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంఓ) నుంచి వెలువడిన ఒక కీలక నివేదిక ప్రపంచవ్యాప్తంగా పర్యావరణవేత్తలను, విధాన రూపకర్తలను అప్రమత్తం చేసింది. పసిఫిక్ మహాసముద్రంలో ఎల్ నినో పరిస్థితులు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని డబ్ల్యూఎంఓ అధికారికంగా ధృవీకరించింది. ఈ కాలానుగుణ మార్పు రాబోయే నెలల్లో ప్రపంచ ఉష్ణోగ్రత, వర్షపాత సరళిని పూర్తిగా మార్చివేయనుంది. శాస్త్రవేత్తల అంచనా నమూనాల ప్రకారం.. 2026 ఎల్ నినో ఒక సాధారణ సంఘటనగా ఉండబోదని.. బదులుగా అది ‘మితమైన నుంచి చాలా బలమైనదిగా’’ ఉండే అవకాశం ఉందని సూచించింది.
భూమధ్యరేఖ పసిఫిక్ మహాసముద్రంలోని అసాధారణంగా వెచ్చని జలాలు ఈ సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేస్తున్నాయి. ఇప్పటికే వేడెక్కుతున్న ప్రపంచానికి ఎల్ నినో మరింత ఆజ్యం పోస్తుందని హెచ్చరిస్తూ ఐక్యరాజ్యసమితి (UN) సెక్రటరీ-జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ ఒక వీడియో ప్రకటన విడుదల చేశారు. ఇవి వేగంగా అంతర్జాతీయ సరిహద్దులను దాటి.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, ఆరోగ్యం, వ్యవసాయాన్ని నాశనం చేస్తాయని పేర్కొన్నారు.
ఎల్ నినో ప్రభావం కారణంగా ఈ ఏడాది దక్షిణాసియాలో రుతుపవన వర్షపాతం సాధారణం కంటే తక్కువగా ఉంటుందని ప్రపంచ వాతావరణ సంస్థ (WMO) స్పష్టం చేసింది. భారతదేశం వంటి వ్యవసాయ దేశానికి రుతుపవనాలు జీవనాధారం. బలహీనమైన రుతుపవనాల ప్రభావం పంట ఉత్పత్తి, నీటి లభ్యత, ఆహార భద్రతపై నేరుగా పడుతుంది. తగ్గిన వర్షపాతం కరవుకు దారితీసి గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది.
తాజావార్తలు
-
OTR : యాదాద్రి ఆలయ పాలకమండలి ప్రమాణ స్వీకారం.. మంత్రుల డుమ్మా!
-
Gujarat: విషాదం.. ప్రముఖ పుణ్యక్షేత్రంలో భక్తుల కళ్లెదుటే బాలుడ్ని చంపిన సింహం
-
Harish Rao : షాబాద్ ఆరుగురి హత్యలు ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే
-
S Janaki: సిరిసిల్లలో పెరిగిన జానకమ్మ.. వేములవాడలో మధుర క్షణాలు..
-
Kejriwal: పెట్రోల్ బంక్ దగ్గర కేజ్రీవాల్ హల్చల్.. E20 పెట్రోల్పై తీవ్ర విమర్శలు
ట్రెండింగ్
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!