Japan: జపాన్ ప్రధాని నివాసంలో ‘‘దెయ్యాలు’’.. ఈ ఇళ్లు అంటే ఎందుకు అంత భయం..?
- ‘‘దెయ్యాల’’ భవనంగా జపాన్ ప్రధాని నివాసం..
- ఈ భవనం అంటే భయం.. భయం..
- గతంలో జరిగిన ఘటనలే ఇందుకు కారణం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Japan: అక్టోబర్లో ఎన్నికైన జపాన్ ప్రధాన మంత్రి షిగెరు ఇషిబాని ఓ భయం వెంటాడుతోంది. జపాన్ ప్రధాని అధికార నివాసంలో ‘‘దెయ్యాలు’’ ఉన్నాయనే ప్రచారం నేపథ్యంలో ఆయన ఆ ఇంటికి వెళ్లేందుకు జంకుతున్నారు. నిజానికి ఈ భవనం 1929లో నిర్మించబడింది. 5183 చదరపు మీటర్ల రాతి, ఇటుకతో నిర్మించిన రెండు అంతస్తులు భవనం ఆర్ట్ డెకో డిజైన్తో నిర్మించారు. ఇది 20 శతాబ్ధపు ప్రారంభంలో జపాన్ ఆధునికవాదానికి మారడాన్ని సూచిస్తుంది. ఈ నిర్మాణం అమెరికన్ ఆర్కిటెక్ట్ ఫ్రాంక్ లాయిడ్ రైట్ రూపొందించిన ఇంపీరియర్ హోటల్ నిర్మాణం నుంచి ప్రేరణ పొందింది. 1923లో పూర్తయిన ఇంపీరియల్ హోటల్, టోక్యోలో చాలా వరకు ధ్వంసమైన గ్రేట్ కాంటో భూకంపాన్ని తట్టుకుని నిలబడింది.
Read Also: Srinivasa Rao: ప్రభుత్వం మారి 6 నెలలు గడిచినా.. విధానాలు మాత్రం మారలేదు..!
Also Read
- PM Modi: ఉజ్బెకిస్థాన్కు చేరుకున్న మోడీ.. అధ్యక్షుడు మిర్జియోయెవ్ ఘన స్వాగతం
- Lax Gopisetty: ఐటీ రంగంలో 30 ఏళ్ల అనుభవం.. నేపాల్ వరదల్లో ఇన్ఫోసిస్ ఎగ్జిక్యూటివ్ అదృశ్యం.
- Indus Waters Treaty: సింధు జలాలపై భారత్ కఠిన నిర్ణయం.. పాకిస్తాన్ వేడుకోలు..
- Ukraine War: ఉక్రెయిన్ రాజధానిపై రష్యా భారీ దాడి.. 27 మంది మృతి..
భయానికి కారణాలు ఏంటి..?
ఈ భవనం జపనీస్ రాజకీయ చరిత్రలో అనేక గందరగోళాలకు వేదికగా నిలిచింది. 1932లో తిరుగుబాటులో అప్పటి ప్రధాని సుయోషి ఇనుకై, యంగ్ నేవీ అధికారులతో ఈ భవనంలోనే హత్య చేయబడ్డాడు. ఈ ఘటన తర్వాత జరిగిన నాలుగేళ్ల తర్వాత మరోసారి సైనిక తిరుగుబాటు జరుగింది. ఈ సమయంలో ఇదే భవనంలో ఐదుగురిని కాల్చి చంపారు. అయితే, అప్పటి ప్రధాని కీసుకే ఒకాడా ఒక గదిలో దాక్కుని తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు.
ఇలా దశాబ్ధాల దాడుల తర్వాత, 2005లో ఈ భవనాన్ని పునర్నిర్మించారు. జపనీస్ ప్రభుత్వం 8.6 బిలియన్ యెన్లను ఖర్చు చేసి అత్యాధునికంగా తీర్చిదిద్దింది. 2005 నుంచి ఈ భవనం ప్రధాని నివాసంగా ఉంది. అయితే, ఈ భవనం ‘‘హాంటెడ్’ హౌజ్గా పేరు తెచ్చుకుంది. దెయ్యాల కథలతో ముడిపడి ఉంది. దీనికి కారణం ఆ భవనానికి ఉన్న నెత్తుటి చరిత్రనే.
మాజీ ప్రధాని సుటోము హటా భార్య యుసుకో హటా 1996లో తనకు ఈ నివాసంలో ఎదురైన వింత అనుభవాలను చెప్పింది. ఇది ఈ భవనంపై మరిన్ని పుకార్లకు కారణమైంది. ఈ భవనంలో తాను విచిత్రమైన, అదృశ్య ఉనికిని అనుభవించినట్లు చెప్పింది. రాత్రి సమయంలో తోటలో సైనిక అధికారుల దృశ్యాలు కన్పించాయని చెప్పింది.
మరో మాజీ ప్రధాని యోషిరో మోరీ కూడా తాను ఈ నివాసంలో దెయ్యాలను చూశానని షింజో అబేతో చెప్పినట్లు సమాచారం. 2013లో షింజో అబే రెండోసారి ప్రధానిగా గెలిచిన తర్వాత ఈ నివాసంలో ఉండకూడదని నిర్ణయం తీసుకున్నారు. ఈ భవనం పునర్నిర్మాణం కాకముందే, షింటో పూజారి చేత భూతవైద్యం నిర్వహించారని, ఎదైనా ఆత్మలు ఉంటే వాటిని తొలగించడం జరిగింది.
2012 నుండి 2020 వరకు తన రెండవ టర్మ్ సమయంలో జపాన్లో సుదీర్ఘకాలం పనిచేసిన ప్రధాన మంత్రి షింజో అబే తిరిగి భవనంలోకి రాకూడదని నిర్ణయించుకున్నారు. దీనికి బదులుగా ఆయన టోక్యోలని షిబుయా జిల్లాలోని తన ప్రైవేట్ ఇంటిలో నివసించారు. అబే వారసుడు యోషిహిడే సుగా కూడా నివాసంలో నివసించడానికి ఇష్టపడలేదు. డిసెంబర్ 2021లో ప్రధానమంత్రి అయిన ఫుమియో కిషిడా మాత్రం ఈ భవనంలో నివాసం ఉన్నారు. తాను రాత్రివేళల్లో చాలా బాగా నిద్రపోయానని దెయ్యాల ఊహాగానాలను కొట్టిపారేశారు.
తాజావార్తలు
-
Emraan Hashmi: సినిమా సక్సెస్ జోష్లో ఇమ్రాన్ హష్మీకి బిగ్ షాక్.. స్వైన్ ఫ్లూ పాజిటివ్!
-
T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
-
Kittu Pawan: ఫోక్ స్టార్ కిట్టు పవన్ హీరోగా సినిమా ప్రారంభం!
-
Union Budget: అక్టోబర్ 12 నుంచి కేంద్ర బడ్జెట్ కసరత్తు.. కీలక అంశాలపై ఫోకస్
-
Central Employees: కేంద్ర ఉద్యోగుల జీతాల్లో ఊహించని మార్పు.. 3 శాతం ఉన్న ఇంక్రిమెంట్ 6 శాతానికి..?
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!