White House: లాక్డౌన్లో వైట్ హౌస్.. అమెరికా అధ్యక్షుడి నివాసం వద్ద గన్ ఫైర్.. రంగంలోకి సీక్రెట్ సర్వీస్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
White House: అమెరికా అధ్యక్ష భవనం ‘వైట్ హౌస్’ సమీపంలో సోమవారం సాయంత్రం కాల్పులు జరగడం తీవ్ర కలకలం సృష్టించింది. 15వ వీధి – ఇండిపెండెన్స్ అవెన్యూ కూడలిలో, వాషింగ్టన్ మాన్యుమెంట్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వెంటనే అప్రమత్తమైన యూఎస్ సీక్రెట్ సర్వీస్ దళాలు వైట్ హౌస్ సముదాయాన్ని దిగ్బంధించాయి. అసలు ఏం జరిగిందంటే.. సీక్రెట్ సర్వీస్ కథనం ప్రకారం.. సోమవారం సాయంత్రం 4:10 గంటల సమయంలో సాయుధ వ్యక్తి ఒకరు అనుమానాస్పదంగా సంచరిస్తుండటంతో భద్రతా దళాలు అతడిని అడ్డుకున్నాయి. ఈ క్రమంలో జరిగిన కాల్పుల్లో సదరు వ్యక్తి గాయపడ్డాడు. నిందితుడిని ఆసుపత్రికి తరలించగా, అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో వైట్ హౌస్ సిబ్బందికి గానీ, ఇతరులకు గానీ ఎటువంటి గాయాలు కాలేదు.
బ్రీఫింగ్ రూమ్లోకి జర్నలిస్టుల తరలింపు..
కాల్పుల శబ్దం వినబడగానే వైట్ హౌస్ అంతటా ‘హై అలర్ట్’ ప్రకటించారు. ఆ సమయంలో నార్త్ లాన్లో ఉన్న జర్నలిస్టులను సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు వేగంగా లోపలికి తరలించి, ప్రెస్ బ్రీఫింగ్ రూమ్లో ఉంచారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సుమారు 15 నిమిషాల పాటు వైట్ హౌస్ లాక్డౌన్లో ఉంది. భద్రతా బలగాలు పరిస్థితిని అదుపులోకి తెచ్చిన తర్వాత లాక్డౌన్ను ఎత్తివేశారు. అనంతరం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్ ఈస్ట్ రూమ్లో ఏర్పాటు చేసిన చిన్న వ్యాపార యజమానుల సమావేశంలో పాల్గొన్నారు. భద్రతా కారణాల దృష్ట్యా ఈ కార్యక్రమం 45 నిమిషాలు ఆలస్యంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ.. “నేషనల్ గార్డ్ను మోహరించడం వంటి కఠిన చర్యల వల్ల వాషింగ్టన్ ఇప్పుడు అమెరికాలోనే అత్యంత సురక్షితమైన నగరంగా మారింది” అని ధీమా వ్యక్తం చేశారు.
Also Read
- Pakistan Terror Attack: పాలు పోసి పెంచిన పామే కాటేసింది.. పాకిస్థాన్లో ఉగ్రదాడి!
- Hantavirus Outbreak: హంటావైరస్ కలకలం.. లక్షణాలు, చికిత్సపై WHO కీలక హెచ్చరిక.. కొత్త మహమ్మారిగా మారుతుందా..?
- Russia-Ukraine War: నాలుగేళ్లుగా సాగుతున్న ఉక్రెయిన్ యుద్ధంపై.. రష్యా అధ్యక్షుడు పుతిన్ కీలక ప్రకటన
- UFO Files: ఏలియన్ల గుట్టు రట్టు.. చరిత్రలో తొలిసారిగా 'UFO' రహస్య పత్రాలను బయటపెట్టిన అమెరికా!
కొనసాగుతున్న హై అలర్ట్
గత ఏప్రిల్ 24న వైట్ హౌస్ కరస్పాండెంట్స్ విందులో కోల్ అలెన్ అనే వ్యక్తి ట్రంప్ను హత్య చేసేందుకు ప్రయత్నించిన ఘటన తర్వాత వాషింగ్టన్లో భద్రతను పతాక స్థాయికి పెంచారు. తాజా కాల్పుల నేపథ్యంలో ఇండిపెండెన్స్ అవెన్యూ వైపు వెళ్లే రహదారులను మూసివేశారు. మెట్రోపాలిటన్ పోలీసులు, సీక్రెట్ సర్వీస్ సంయుక్తంగా ఈ ఘటనపై విచారణ జరుపుతున్నారు. వాషింగ్టన్ మౌన్యుమెంట్, వైట్ హౌస్ సందర్శనార్థం వచ్చే పర్యాటకులు ఆ ప్రాంతానికి దూరంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
తాజావార్తలు
-
PM Modi Hyd Tour Live Updates : హైదరాబాద్లో మోడీ సందడి.. పర్యటన మినిట్ టూ మినిట్ అప్డేట్స్..!
-
Narendra Modi : ఏడాది పాటు బంగారం కొనద్దు.. ప్రధాని మోడీ పిలుపు.!
-
PM Modi: కాంగ్రెస్కు కొత్త పేరు పెట్టిన మోడీ.. ‘MMC’ అంటే ముస్లిం లీగ్, మావోవాది కాంగ్రెస్!
-
Urvil Patel: పొట్టుపొట్టు కొట్టిన ఉర్విల్ పటేల్.. ఐపీఎల్ హిస్టరీలోనే నయా రికార్డ్ .. 13 బంతుల్లోనే ఫిఫ్టీ!
-
PM Modi: బెంగాల్ ఉత్సాహం తెలంగాణలో కూడా కనిపిస్తోంది..
-
Money Heist: ‘మనీ హెయిస్ట్’ ఫ్యాన్స్కు నెట్ఫ్లిక్స్ సర్ప్రైజ్.. ప్రొఫెసర్ ప్రయాణం ఇంకా ముగియలేదు!