Hassan Nasrallah: హిజ్బుల్లా చీఫ్ నస్రల్లా చనిపోయే ముందు, చివరి ప్రసంగంలో ఏం చెప్పాడు..?
- హిజ్బుల్లా చీఫ్ తన చివరి ప్రసంగంలో ఏం చెప్పారు..? పేజర్ పేలుళ్ల తర్వాత ప్రసంగించిన నస్రల్లా..
- ఇజ్రాయిల్పై ప్రతీకారం తీర్చుకుంటామని ప్రతిజ్ఞ..
- చివరకు ఇజ్రాయిల్ చేతిలో హతం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hassan Nasrallah: హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా మరణించాడు. శుక్రవారం జరిగిన బీరూట్పై ఇజ్రాయిల్ భీకరదాడులు చేసింది. హిజ్బుల్లా సెంట్రల్ హెడ్ క్వార్టర్స్ లక్ష్యంగా వైమానికి దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో నస్రల్లా మరణించాడు. ఈ విషయాన్ని ఇజ్రాయిల్ ఆర్మీతో పాటు హిజ్బుల్లా కూడా ప్రకటించింది. అంతకుముందు హిజ్బుల్లా కీలక కమాండర్లు అయిన ఫువాద్ షుక్ర్, ఇబ్రహీం అఖిల్లను కూడా ఇజ్రాయిల్ వైమానిక దాడుల్లోనే చంపేసింది.
నస్రల్లా చనిపోవడానికి ముందు సెప్టెంబర్ 19న తన చివరి ప్రసంగాన్ని చేశారు. లెబనాన్ వ్యాప్తంగా పేజర్లు పేలిన ఘటన తర్వాత ఆయన మాట్లాడారు. ఈ పేజర్ల పేలుడులో 37 మంది మరణించాగా, 3000 మంది అత్యంత తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడిపై మాట్లాడుతూ.. ఇజ్రాయిల్ ఘోరమైన దాడిని ఖండించారు. ఇది ‘‘యుద్ధ ప్రకటన’’గా అభివర్ణించారు. ఇజ్రాయిల్పై ప్రతీకారం తీర్చుకుంటామని ప్రతిజ్ఞ చేసారు, ఇజ్రాయెల్ దురాక్రమణలకు “న్యాయమైన శిక్ష”ని విధిస్తామని అన్నారు. ఈ పేజర్ల దాడిని తమ సంస్థకు ‘‘అపూర్వమైన దెబ్బ’’గా అభివర్ణించాడు. దేవుడిపై విశ్వాసతంతో హిజ్బుల్లా ఈ సంక్షోభం నుంచి మళ్లీ తలెత్తుకుంటుందని చెప్పారు.
Also Read
- Sergei Ivanov: పుతిన్ రైట్ హ్యాండ్ మృతి.. అది సహజ మరణమా? లేక పక్కా స్కెచా? అసలు నిజమేంటి!
- Sudan Civil War: సుడాన్లో ఊచకోత.. 72 గంటల్లోనే ముంచెత్తిన ముప్పు.. రంగంలోకి దిగిన ప్రపంచ దేశాలు!
- Explainer: చరిత్రలోనే అత్యంత క్రూరమైన ఉగ్రవాద దాడి..41ఏళ్ల తర్వాత బయటపడ్డ కనిష్క విమాన పేలుడు నిజం!
- Earthquake Threat: భారత్కు భూకంప అలర్ట్.. సైంటిస్టుల పరిశోధనలో ఏం తేలింది?
Read Also: Vijayawada: ఇద్దరు పిల్లలతో కలిసి కాల్వలోకి దూకి మహిళ ఆత్మహత్యాయత్నం..
సెప్టెంబర్ 20 ఇజ్రాయిల్ బీరూట్పై మరో దాడి నిర్వహించి హిజ్బుల్లా యొక్క ఎలైట్ రద్వాన్ యూనిట్ కమాండర్ ఇబ్రహీం అకిల్తో పాటు మరో 12 మందిని హతమార్చింది. అకిల్ సంస్థలో సీనియర్ వ్యక్తి మరియు 1983లో బీరుట్లోని అమెరికన్ రాయబార కార్యాలయంపై జరిగిన బాంబు దాడిలో అతని ప్రమేయం ఉంది. ఇదిలా ఉంటే గత రెండు వారాలుగా హిజ్బుల్లా లక్ష్యంగా ఇజ్రాయిల్ లెబనాన్పై విరుచుకుపడుతోంది. తమ పౌరులు ఉత్తర ప్రాంతానికి తిరిగి వచ్చేలా చేయడమే తమ లక్ష్యమని ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ చెప్పారు. లెబనాన్ దాడుల్లో ఇప్పటి వరకు 1000 మందికి పైగా మరణించారు. ఆరు మిలియన్ల మంది నిరాశ్రయులయ్యారు.
తాజావార్తలు
-
Sergei Ivanov: పుతిన్ రైట్ హ్యాండ్ మృతి.. అది సహజ మరణమా? లేక పక్కా స్కెచా? అసలు నిజమేంటి!
-
Iran Oil: భారీ డిస్కౌంట్తో ఇరాన్ చమురు ఆఫర్.. అయినా భారత్ ఎందుకు కొనడం లేదు?
-
Ketan Agarwal Case: కేతన్ హత్య కేసులో క్రికెట్ ట్విస్ట్.. సియా సోదరుడు బయటపెట్టిన షాకింగ్ నిజాలు
-
CM Chandrababu: వెలిగొండ ప్రాజెక్ట్తో దశాబ్దాల కరవు పోతుంది.. అభివృద్ధికి ఓటేయాలన్న చంద్రబాబు
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
ట్రెండింగ్
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!
-
55 రోజుల స్టాండ్బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..
-
Pesara Laddu Recipe: ప్రోటీన్ పుష్కలంగా ఉండే ‘పెసర లడ్డూలు’.. ఇంట్లోనే సులభంగా తయారు చేయండి ఇలా.!