Hassan Nasrallah: హిజ్బుల్లా చీఫ్ నస్రల్లా చనిపోయే ముందు, చివరి ప్రసంగంలో ఏం చెప్పాడు..?
- హిజ్బుల్లా చీఫ్ తన చివరి ప్రసంగంలో ఏం చెప్పారు..? పేజర్ పేలుళ్ల తర్వాత ప్రసంగించిన నస్రల్లా..
- ఇజ్రాయిల్పై ప్రతీకారం తీర్చుకుంటామని ప్రతిజ్ఞ..
- చివరకు ఇజ్రాయిల్ చేతిలో హతం..
Hassan Nasrallah: హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా మరణించాడు. శుక్రవారం జరిగిన బీరూట్పై ఇజ్రాయిల్ భీకరదాడులు చేసింది. హిజ్బుల్లా సెంట్రల్ హెడ్ క్వార్టర్స్ లక్ష్యంగా వైమానికి దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో నస్రల్లా మరణించాడు. ఈ విషయాన్ని ఇజ్రాయిల్ ఆర్మీతో పాటు హిజ్బుల్లా కూడా ప్రకటించింది. అంతకుముందు హిజ్బుల్లా కీలక కమాండర్లు అయిన ఫువాద్ షుక్ర్, ఇబ్రహీం అఖిల్లను కూడా ఇజ్రాయిల్ వైమానిక దాడుల్లోనే చంపేసింది.
నస్రల్లా చనిపోవడానికి ముందు సెప్టెంబర్ 19న తన చివరి ప్రసంగాన్ని చేశారు. లెబనాన్ వ్యాప్తంగా పేజర్లు పేలిన ఘటన తర్వాత ఆయన మాట్లాడారు. ఈ పేజర్ల పేలుడులో 37 మంది మరణించాగా, 3000 మంది అత్యంత తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడిపై మాట్లాడుతూ.. ఇజ్రాయిల్ ఘోరమైన దాడిని ఖండించారు. ఇది ‘‘యుద్ధ ప్రకటన’’గా అభివర్ణించారు. ఇజ్రాయిల్పై ప్రతీకారం తీర్చుకుంటామని ప్రతిజ్ఞ చేసారు, ఇజ్రాయెల్ దురాక్రమణలకు “న్యాయమైన శిక్ష”ని విధిస్తామని అన్నారు. ఈ పేజర్ల దాడిని తమ సంస్థకు ‘‘అపూర్వమైన దెబ్బ’’గా అభివర్ణించాడు. దేవుడిపై విశ్వాసతంతో హిజ్బుల్లా ఈ సంక్షోభం నుంచి మళ్లీ తలెత్తుకుంటుందని చెప్పారు.
Also Read
- Indonesia: ఇండోనేషియాలో రెండు రైళ్లు ఢీ.. నలుగురు మృతి
- Trump-King Charles: వైట్హౌస్లో ట్రంప్ను కలిసిన కింగ్ చార్లెస్ దంపతులు
- India Defense Budget: సాహో భారత్.. పాకిస్థాన్ను గజగజలాడిస్తున్న ఇండియా రక్షణ బడ్జెట్.. చైనా సాయం ఉన్నా దాయాదికి వణుకు పుట్టాల్సిందే!
- Bordeaux : ఈ ఒక్క ప్రాంతం వైన్ ప్రపంచాన్ని ఎలా మార్చింది..??
Read Also: Vijayawada: ఇద్దరు పిల్లలతో కలిసి కాల్వలోకి దూకి మహిళ ఆత్మహత్యాయత్నం..
సెప్టెంబర్ 20 ఇజ్రాయిల్ బీరూట్పై మరో దాడి నిర్వహించి హిజ్బుల్లా యొక్క ఎలైట్ రద్వాన్ యూనిట్ కమాండర్ ఇబ్రహీం అకిల్తో పాటు మరో 12 మందిని హతమార్చింది. అకిల్ సంస్థలో సీనియర్ వ్యక్తి మరియు 1983లో బీరుట్లోని అమెరికన్ రాయబార కార్యాలయంపై జరిగిన బాంబు దాడిలో అతని ప్రమేయం ఉంది. ఇదిలా ఉంటే గత రెండు వారాలుగా హిజ్బుల్లా లక్ష్యంగా ఇజ్రాయిల్ లెబనాన్పై విరుచుకుపడుతోంది. తమ పౌరులు ఉత్తర ప్రాంతానికి తిరిగి వచ్చేలా చేయడమే తమ లక్ష్యమని ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ చెప్పారు. లెబనాన్ దాడుల్లో ఇప్పటి వరకు 1000 మందికి పైగా మరణించారు. ఆరు మిలియన్ల మంది నిరాశ్రయులయ్యారు.
తాజావార్తలు
-
Nandamuri Balakrishna : బాలయ్య నీ స్పీడ్ ఏంటయ్యా.. ఒకేసారి రెండు సినిమాలు
-
Virat Kohli: ఆకాశమే హద్దుగా కోహ్లీ రికార్డుల వేట.. ఐపీఎల్లో ఈ ఘనత సాధించిన ఏకైక ప్లేయర్ విరాట్..
-
Indonesia: ఇండోనేషియాలో రెండు రైళ్లు ఢీ.. నలుగురు మృతి
-
Vizianagaram Road Accident: విజయనగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆగిఉన్న లారీని ఢీకొన్న కారు, నలుగురు మృతి
-
Ek Din: సాయి పల్లవి దేశంలోనే బెస్ట్ యాక్ట్రెస్.. బాలీవుడ్ ఎంట్రీలో అమీర్ ఖాన్ ఎమోషనల్ కామెంట్స్!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!