Hassan Nasrallah: హిజ్బుల్లా చీఫ్ నస్రల్లా చనిపోయే ముందు, చివరి ప్రసంగంలో ఏం చెప్పాడు..?
- హిజ్బుల్లా చీఫ్ తన చివరి ప్రసంగంలో ఏం చెప్పారు..? పేజర్ పేలుళ్ల తర్వాత ప్రసంగించిన నస్రల్లా..
- ఇజ్రాయిల్పై ప్రతీకారం తీర్చుకుంటామని ప్రతిజ్ఞ..
- చివరకు ఇజ్రాయిల్ చేతిలో హతం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hassan Nasrallah: హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా మరణించాడు. శుక్రవారం జరిగిన బీరూట్పై ఇజ్రాయిల్ భీకరదాడులు చేసింది. హిజ్బుల్లా సెంట్రల్ హెడ్ క్వార్టర్స్ లక్ష్యంగా వైమానికి దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో నస్రల్లా మరణించాడు. ఈ విషయాన్ని ఇజ్రాయిల్ ఆర్మీతో పాటు హిజ్బుల్లా కూడా ప్రకటించింది. అంతకుముందు హిజ్బుల్లా కీలక కమాండర్లు అయిన ఫువాద్ షుక్ర్, ఇబ్రహీం అఖిల్లను కూడా ఇజ్రాయిల్ వైమానిక దాడుల్లోనే చంపేసింది.
నస్రల్లా చనిపోవడానికి ముందు సెప్టెంబర్ 19న తన చివరి ప్రసంగాన్ని చేశారు. లెబనాన్ వ్యాప్తంగా పేజర్లు పేలిన ఘటన తర్వాత ఆయన మాట్లాడారు. ఈ పేజర్ల పేలుడులో 37 మంది మరణించాగా, 3000 మంది అత్యంత తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడిపై మాట్లాడుతూ.. ఇజ్రాయిల్ ఘోరమైన దాడిని ఖండించారు. ఇది ‘‘యుద్ధ ప్రకటన’’గా అభివర్ణించారు. ఇజ్రాయిల్పై ప్రతీకారం తీర్చుకుంటామని ప్రతిజ్ఞ చేసారు, ఇజ్రాయెల్ దురాక్రమణలకు “న్యాయమైన శిక్ష”ని విధిస్తామని అన్నారు. ఈ పేజర్ల దాడిని తమ సంస్థకు ‘‘అపూర్వమైన దెబ్బ’’గా అభివర్ణించాడు. దేవుడిపై విశ్వాసతంతో హిజ్బుల్లా ఈ సంక్షోభం నుంచి మళ్లీ తలెత్తుకుంటుందని చెప్పారు.
Also Read
- Noida Woman: ‘అమ్మా ఇక్కడ నరకంగా ఉంది’.. నోయిడా యువతి మర్డర్ కేసులో వాట్సాప్ చాట్ వైరల్..
- Pakistan: అసిమ్ మునీర్ గుట్టు బట్టబయలు.. న్యూక్లియర్ డీల్ కోసం చైనాకు పాక్ తాకట్టు.!
- Iran: భారీ ఆదాయం సమకూర్చుకునే పనిలో ఇరాన్.. వాటిపై ‘డిజిటల్ టాక్స్’ వసూలుకు ప్లాన్..
- Pakistan: పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ను గద్దె దించేందుకు అమెరికా కుట్ర.. బయటపడ్డ సంచలన రహస్యాలు!
Read Also: Vijayawada: ఇద్దరు పిల్లలతో కలిసి కాల్వలోకి దూకి మహిళ ఆత్మహత్యాయత్నం..
సెప్టెంబర్ 20 ఇజ్రాయిల్ బీరూట్పై మరో దాడి నిర్వహించి హిజ్బుల్లా యొక్క ఎలైట్ రద్వాన్ యూనిట్ కమాండర్ ఇబ్రహీం అకిల్తో పాటు మరో 12 మందిని హతమార్చింది. అకిల్ సంస్థలో సీనియర్ వ్యక్తి మరియు 1983లో బీరుట్లోని అమెరికన్ రాయబార కార్యాలయంపై జరిగిన బాంబు దాడిలో అతని ప్రమేయం ఉంది. ఇదిలా ఉంటే గత రెండు వారాలుగా హిజ్బుల్లా లక్ష్యంగా ఇజ్రాయిల్ లెబనాన్పై విరుచుకుపడుతోంది. తమ పౌరులు ఉత్తర ప్రాంతానికి తిరిగి వచ్చేలా చేయడమే తమ లక్ష్యమని ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ చెప్పారు. లెబనాన్ దాడుల్లో ఇప్పటి వరకు 1000 మందికి పైగా మరణించారు. ఆరు మిలియన్ల మంది నిరాశ్రయులయ్యారు.
తాజావార్తలు
-
Twisha Sharma: పెళ్లైన 5 నెలలకే తెలుగు హీరోయిన్ మృతి!
-
Noida Woman: ‘అమ్మా ఇక్కడ నరకంగా ఉంది’.. నోయిడా యువతి మర్డర్ కేసులో వాట్సాప్ చాట్ వైరల్..
-
Peddi Trailer Review: పెద్ది గుళ్ళో దేవుడు కాదు, గ్రౌండ్’లో దేవుడు.. ఆసక్తి రేకెత్తిస్తున్న ట్రైలర్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
Chiru – Bobby Movie: ‘చిరు 158’లోకి అదిరిపోయే ఎంట్రీ ఇచ్చిన ‘జైలర్’ డీవోపీ!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..