Marco Rubio: అమెరికాతో అత్యుత్తమ సంబంధాల్లో భారత్ ఒకటి.. మార్కో రూబియో వెల్లడి
- అమెరికాతో అత్యుత్తమ సంబంధాల్లో భారత్ ఒకటి
- అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచంలో అమెరికా కలిగి ఉన్న అత్యుత్తమ సంబంధాల్లో భారతదేశం ఒకటి అని అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో అన్నారు. ఢిల్లీలో అమెరికా రాయబారిగా సెర్గియో గోర్ నియమితులయ్యారు. సెనేట్ ఫారిన్ రిలేషన్స్ కమిటీలో నిర్ధారణ విచారణ సందర్భంగా రూబియో ఈ వ్యాఖ్యలు చేశారు. విచారణలో సెర్గియో గోర్ను రూబియో పరిచయం చేస్తూ ప్రపంచ భౌగోళిక రాజకీయాల్లో భారతదేశం ముఖమైందని తెలిపారు. ఇక సెర్గియో గోర్.. అధ్యక్షుడి విశ్వాసానికి తగిన విధంగా భారత్లో పని చేస్తారని చెప్పారు. ట్రంప్తో గోర్కు మంచి సన్నిహిత సంబంధం ఉందని పేర్కొన్నారు. అధ్యక్షుడికి చాలా దగ్గరగా.. ఓవల్ కార్యాలయంలో నమ్మకంగా పని చేశారని ప్రశంసించారు. గోర్ కంటే మంచిగా పని చేసేవారు ఎవరూ ఉండరని తెలిపారు.
ఇది కూడా చదవండి: Jagdeep Dhankhar: 2 నెలల తర్వాత రాష్ట్రపతి భవన్లో జగదీప్ ధన్ఖర్ ప్రత్యక్షం
Also Read
- China: కొత్త గేమ్కి రెడీ అవుతున్న చైనా.. ప్రపంచానికి షాక్ తప్పదా?
- Israel-Iran: పర్వతం కింద అణు పదార్థం.. ఇరాన్పై ఇజ్రాయిల్ సంచలన రిపోర్ట్..
- Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై భారత్ కీలక నిర్ణయం.. పాక్కు స్పష్టమైన సందేశం..
- Crude Oil Prices: మరో షాక్.. హార్మూజ్ తర్వాత కొత్త సంక్షోభం.. ముడి చమురు ధరలు భారీగా పెరుగుతాయా..?
ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఉక్రెయిన్-రష్యా యుద్ధం ఆపేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ చర్చలు ఫలించడం లేదు. ఇంతలోనే ఆయా దేశాలపై ట్రంప్ సుంకాలు ప్రకటించారు. ఇందులో భాగంగా భారత్పై తొలుత 25 శాతం సుంకం విధించారు. అంతలోనే మరో బాంబ్ పేల్చారు. రష్యాతో సంబంధాలు పెట్టుకున్నందుకు జరిమానాగా మరో 25 శాతం సుంకం విధిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో భారత్పై 50 శాతం సుంకం విధించినట్లైంది. ఈ పరిణామంతో రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. రష్యా దగ్గర భారత్ చమురు కొనుగోలు చేయడం కారణంగానే ఉక్రెయిన్తో మాస్కో శాంతి ఒప్పందానికి రావడం లేదని అమెరికా వాదిస్తోంది. అయితే ఎక్కడ తక్కువగా దొరికితే అక్కడే చమురు కొనుగోలు చేస్తామని భారత్ అంటోంది. ఇక అన్నదాతల కోసం ఎంత సుంకమైనా భరిస్తామని మోడీ ప్రకటించారు.
ఇది కూడా చదవండి: Netanyahu: ఇజ్రాయెల్ ప్రధాని సంచలన ప్రకటన.. పాలస్తీనా దేశంగా ఉండబోదని ప్రతిజ్ఞ
తాజావార్తలు
-
Shamshabad : ఇండిగో ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నం..!
-
Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
-
Minister Seethakka : ములుగు టూర్కు వెళ్తున్నారా? మంత్రి సీతక్క కీలక హెచ్చరిక.!
-
Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
-
Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!