US: న్యూయార్లో విషాదం.. గుర్రపు బండి పైనుంచి పడి భారతీయ యువకుడు మృతి
- న్యూయార్లో విషాదం
- గుర్రపు బండి పైనుంచి పడి భారతీయ యువకుడు మృతి
- విహారయాత్రకు వెళ్లి ప్రాణాలు పోగొట్టుకున్న యువకుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికాలోని న్యూయార్క్ నగరంలో విషాదం చోటుచేసుకుంది. గుర్రపు బండిలో ప్రయాణిస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు కిందపడిన తన తల్లిని కాపాడేందుకు ప్రయత్నించిన భారతీయ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనలో 18 ఏళ్ల రోమాంచ్ మహాజన్ మరణించాడు.
న్యూయార్క్లోని ప్రముఖ పర్యాటక కేంద్రం అయిన సెంట్రల్ పార్క్లో ఈ ప్రమాదం జరిగింది. కుటుంబ సభ్యులతో కలిసి తొలిసారి న్యూయార్క్కు వచ్చిన రోమాంచ్ మహాజన్ గుర్రపు బండిలో విహారయాత్రకు వెళ్లాడు. ఈ సందర్భంగా ఫొటో తీయడానికి డ్రైవర్ బండిని ఆపాడు. అయితే అకస్మాత్తుగా గుర్రం భయపడి అదుపుతప్పి పరుగులు పెట్టింది. గుర్రం వేగంగా పరుగులు తీయడంతో బండిలో ఉన్న కుటుంబ సభ్యులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఈ క్రమంలో రోమాంచ్ తల్లి ప్రియా మహాజన్ బండి నుంచి కిందపడిపోయింది. తల్లిని రక్షించేందుకు రోమాంచ్ వెంటనే బండి నుంచి దూకాడు. అయితే ఈ ప్రయత్నంలో అతడు నేలపై బలంగా పడటంతో తలకు తీవ్ర గాయమైంది.
Also Read
- China Mega Dam: బ్రహ్మపుత్రపై చైనా భారీ డ్యామ్.. భారత్కు కొత్త తలనొప్పి..
- US War Cost in Iran: 108 రోజుల భీకర యుద్ధం.. అమెరికా ఎన్ని లక్షల కోట్లు నష్టపోయిందో తెలుసా?
- US-Iran Peace Agreement: అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందం.. ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఆ ‘15 కీలక షరుతులు’ ఇవే!
- US Iran deal 2026: అమెరికా-ఇరాన్ వివాదానికి ముగింపు.. అవగాహన ఒప్పందంపై సంతకాలు
రోమాంచ్ను వెంటనే ఆస్పత్రికి తరలించినప్పటికీ చికిత్స పొందుతూ అదే రోజు రాత్రి మరణించాడు. న్యూయార్క్-ప్రెస్బిటేరియన్ వైల్ కార్నెల్ మెడికల్ సెంటర్లో వైద్యులు అతడిని కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఈ ప్రమాదంలో రోమాంచ్ తల్లిదండ్రులు, తమ్ముడు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. అయితే అదుపుతప్పిన గుర్రపు బండి మరో బండిని ఢీకొని పల్టీలు కొట్టడంతో పూర్తిగా ధ్వంసమైంది. ఈ ఘటనపై స్పందించిన ప్రత్యక్ష సాక్షులు గుర్రం ఒక్కసారిగా భయపడి వేగంగా పరుగులు పెట్టిందని తెలిపారు. కొంతమంది స్థానికులు గుర్రాన్ని అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నించారని చెప్పారు.
ఘటనపై విచారణ ప్రారంభించిన అధికారులు గుర్రపు బండి డ్రైవర్ను విధుల నుంచి నిరవధికంగా సస్పెండ్ చేశారు. డ్రైవర్ ఫొటోలు తీసేందుకు బండిని వదిలి వెళ్లడం నిబంధనలకు విరుద్ధమని సంబంధిత కార్మిక సంఘం పేర్కొంది. పూర్తి స్థాయి దర్యాప్తు జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఈ ప్రమాదం నేపథ్యంలో సెంట్రల్ పార్క్లో గుర్రపు బండుల సేవలను పూర్తిగా నిషేధించాలని మరోసారి డిమాండ్లు వినిపిస్తున్నాయి. గత ఏడాదిన్నర కాలంలో పార్క్ పరిసరాల్లో గుర్రాలకు సంబంధించిన పలు ప్రమాదాలు చోటుచేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
- Tags
- Indian
- New York
- Romanch Mahajan
- us
తాజావార్తలు
-
US: న్యూయార్లో విషాదం.. గుర్రపు బండి పైనుంచి పడి భారతీయ యువకుడు మృతి
-
Ramyakrishna : 12 మంది లవ్ ఫెయిల్యూర్స్’తో రమ్యకృష్ణ డేటింగ్ షో?
-
China Mega Dam: బ్రహ్మపుత్రపై చైనా భారీ డ్యామ్.. భారత్కు కొత్త తలనొప్పి..
-
YS Jagan: చీకటి కొంతకాలమే.. వెలుగు రాక తప్పదు.. పాదయాత్ర ప్రారంభిస్తా..
-
Amit Shah-Sergio Gor: అమిత్ షాతో సెర్గియా గోర్ భేటీ.. ఉగ్రవాదంపై సహా కీలక అంశాలపై చర్చ
ట్రెండింగ్
-
Ira Aery: ఇరా ఏరీ.. పోలా అదిరిపోలా.. సరికొత్త క్రికెట్ క్రష్!
-
Fact Check: E20 పెట్రోల్ కొట్టిస్తే చీమలు పడుతున్నాయా? వైరల్ వీడియోపై క్లారిటీ..
-
Shubman Gill: డబుల్ సెంచరీపై కన్నేశా కానీ.. టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kitchen Tips : చపాతీ ఎక్కువ సేపు మెత్తగా ఉండాలంటే.. పిండి కలిపేటప్పుడు ఈ చిట్కాలను పాటించండి.!
-
Chicken Bones : చికెన్ తిన్నాక ఎముకలను పారేస్తున్నారా.? వాటితో ఎన్నో ప్రయోజనాలు.!