మధ్యప్రాచ్యంలో పరిస్థితులు మరింత చేజారిపోతున్నట్లుగా సంకేతాలు వెలువడుతున్నాయి. గత ఏడు రోజులుగా పశ్చిమాసియా అట్టుడుకుతోంది. గత డిసెంబర్ 28న ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా దాడి చేశాయి. దీంతో ప్రతీకారంగా ఇజ్రాయెల్, అమెరికా మద్దతు గల గల్ఫ్ దేశాలపై ఇరాన్ భీకర దాడులు చేస్తోంది. ఇలా ఇరు వర్గాలు భీకర దాడులు చేసుకుంటున్నాయి.
తాజాగా అమెరికా దాడులను మరింత తీవ్రం చేసింది. ఇరాన్పై అత్యంత శక్తివంతమైన బీ-2 బాంబర్లను ప్రయోగిస్తోంది. బాలిస్టిక్ మిస్సైల్ లాంఛర్లే లక్ష్యంగా అమెరికా దాడులు చేస్తోంది. ఇరాన్ నేవీని టార్గెట్ చేసుకుని విరుచుకుపడుతోంది. ఇరాన్ డ్రోన్ క్యారియర్ నౌకపై దాడి చేసింది. ఇరాన్ భారీ నౌక మంటల్లో కాలిపోతుంది.
