UK PM Race: దూసుకుపోతున్న లిజ్ ట్రస్.. వెనుకంజలో రిషి సునక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
UK PM Race: బ్రిటన్ ప్రధాని పదవికి బోరిస్ జాన్సన్ రాజీనామా చేసిన తర్వాత ఆయన స్థానం కోసం భారత సంతతి వ్యక్తి రిషి సునక్, లిజ్ ట్రస్ పోటీ పడుతున్నారు. గతంలో పీఎం రేసులో అన్ని దశల్లో మొదటి స్థానంలో నిలిచిన రిషి సునక్… ఆ తరువాత జరిగిన డిబెట్లలో లిజ్ ట్రస్ తర్వాత నిలుస్తున్నారు. దీంతో యూకే ప్రధాని అవకాశాలు లిజ్ ట్రస్ కే ఎక్కువగా ఉన్నాయని సర్వేలు ఘోషిస్తున్నాయి. తాజాగా ఓపినియం రీసెర్చ్ నిర్వహించిన సర్వేలో కన్జర్వేటివ్ పార్టీ సభ్యుల అభిప్రాయాలను వెలువరించింది. 450 కన్జర్వేటివ్ పార్టీ సభ్యులను సర్వే చేయగా.. లిజ్ ట్రస్ కు 61 శాతం, మాజీ ఆర్థిక మంత్రిగా ఉన్న రిషి సునక్ కు 39 మంది మద్దతు ఉందని తెలిసింది. రిషి సునక్ 22 శాతం వెనకబడి ఉన్నారు.
Read Also: Har Ghar Tiranga: ఇంటిపై జెండా కడుతూ కుప్పకూలిన వ్యక్తి.. వైరల్ అవుతున్న వీడియో
Also Read
- Pakistan: పాక్ ఆర్మీకి అమెరికా డ్రోన్లు.. ట్రంప్ కుమారులతో లింక్.!
- Trump-Houthi: సౌదీకి ట్రంప్ షాక్! హౌతీలతో రహస్య భేటీ.. అమెరికా సైడ్ అయినట్టేనా?
- US: అమెరికాలో హైదరాబాద్ యువకుడు మృతి.. 17 రోజుల క్రితమే పెళ్లి.. ఇంతలోనే ఘోరం
- Russia Oil: ‘‘రష్యా చమురు కొనొద్దు’’.. భారత్, చైనాలకు ట్రంప్ టీమ్ వార్నింగ్..
మొత్తం 2,00,000 మంది కన్జర్వేటివ్ సభ్యులు యూకే ప్రధాని పదవికి కోసం ఓటేస్తున్నారు. వరస కుంభకోణాలు, అవినీతి ఆరోపణలతో బోరిస్ జాన్సన్ తన పదవకి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఇదిలా ఉంటే తనకు రిషి సునకే వెన్నుపోటు పొడిచాడని.. ప్రధాని బోరిస్ జాన్సన్ అభిప్రాయపడుతున్నారు. దీంతో అతని మద్దతుదారులు లిజ్ ట్రస్ కు మద్దతుగా నిలుస్తున్నట్లు తెలుస్తోంది.
ఓపినియం రీసెర్చ్ సర్వేలో కేవలం 570 శాంపిళ్లతోనే సర్వే చేసింది. వీరిలో 29 శాతం మంది ఇప్పటికే ఓటేయగా.. 47 శాతం మంది తాము ఎవరికి ఓటేయాలో నిర్ణయం తీసుకున్నారు. కేవలం 19 మాత్రమే ఇంకా ఎటూ తేల్చుకులేదు. అయితే సునక్ పట్ల పార్టీ సభ్యుల విముఖతకు కారణం ప్రధానంగా ప్రధాని బోరిస్ జాన్సన్ కు విధేయతగా ఉండక పోవడమే అని కన్జర్వేటివ్ పార్టీ సభ్యులు భావిస్తున్నారు. సునక్ రాజీనామాతోనే బోరిస్ జాన్సన్ కాబినెట్ లోని ఒక్కొక్క మంత్రి రాజీనామా చేయడం ప్రారంభించారు. అయితే సునక్ మద్దతుదారులు మాత్రం ఆయన ఆర్థిక వ్యవస్థ అంశాల్లో లిజ్ ట్రస్ కన్నా ముందున్నారని.. అత్యంత తెలివైనవారని అభిప్రాయపడుతున్నారు.
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!