UK: కింగ్ చార్లెస్ పట్టాభిషేకానికి ఎన్ని కోట్లు ఖర్చు చేశారో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..!
- యూకే కింగ్ చార్లెస్ పట్టాభిషేకానికి భారీగా ఖర్చు
- రూ.765 కోట్లు ఖర్చు చేసినట్లు ప్రభుత్వ నివేదిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజుల సొమ్ము రాళ్ల పాలు అంటారు పెద్దలు. ఈ సామెత ఎందుకు పుట్టిందో తెలియదు గానీ.. తాజాగా అంతర్జాతీయంగా వెలుగులోకి వచ్చిన ఓ సంఘటన ఆశ్చర్యం గొల్పోతుంది. యూకే కింగ్ చార్లెస్ పట్టాభిషేకానికి అక్షరాల 72 మిలియన్ పౌండ్లు ఖర్చు చేసినట్లు వెలుగులోకి వచ్చింది. అంటే అక్షరాల ఇండియన్ కరెన్సీ ప్రకారం రూ.765 కోట్లు ఖర్చు చేసినట్లు ప్రభుత్వ నివేదిక తెలిపింది.

Also Read
- Two US Soldiers Killed: ఇరాన్ దాడిలో ఇద్దరు అమెరికా సైనికులు మృతి.. "మరచిపోలేని గుణపాఠం చెబుతాం" అంటూ ఖమేనీ హెచ్చరిక
- Bangladesh: భారత్, పాకిస్థాన్ను దాటేసిన బంగ్లాదేశ్.. ఏ విషయంలోనో తెలుసా?
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
- Iran: రక్తానికి రక్తం.. ట్రంప్ ఫ్యామిలీని టార్గెట్ చేసిన ఇరాన్..
బ్రిటన్ రాజుగా చార్లెస్ గత సంవత్సరం 2023, మే నెల 6న పట్టాభిషేకం జరిగింది. 40వ బ్రిటన్ చక్రవర్తిగా ఆయన రికార్డ్ సృష్టించారు. 2022, సెప్టెంబర్లో తల్లి ఎలిజబెత్-2 మరణించడంతో చార్లెస్ రాజు అయ్యారు. వెస్ట్ మినిస్టర్ అబేలో సంప్రదాయబద్ధంగా ఈ వేడుక నిర్వహించారు. ఈ వేడుకలకు భారత ఉపరాష్ట్రపతి జగ్దీశ్ ధన్కర్తో సహా ప్రపంచం నలుమూలల నుంచి ప్రతినిధులు తరలివచ్చారు. యితే ఈ పట్టాభిషేకానికి రూ.765 కోట్లు ఖర్చు చేసినట్లుగా తాజా నివేదికలో వెల్లడైంది. వేదిక కోసమే 50.3 మిలియన్ పౌండ్లు ఖర్చయిందని, పోలీసింగ్ ఖర్చుల కోసం మరో 21.7 మిలియన్ పౌండ్లు ఖర్చయిందని సాంస్కృతిక శాఖ తెలిపింది.
ఇక కింగ్ చార్లెస్-3కి భారత్తో ప్రత్యేక అనుబంధం ఉంది. ఆయన యువరాజుగా ఉన్నప్పుడు 2007లో భారత్లో పర్యటించారు. 2019 నవంబర్లో కూడా ఆయన భారత్కు వచ్చారు. ముంబైలో పాఠశాల విద్యార్థులతో కలిసి తన 71వ జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. అంతర్జాతీయ వేదికలపై భారత్కు కచ్చితంగా తగిన ప్రాధాన్యం ఇవ్వాల్సిందేనని నొక్కిచెప్పేవారు. 2018 ఏప్రిల్లో లండన్లో భారత ప్రధాని నరేంద్రమోడీతో కలిసి సైన్స్ మ్యూజియం, న్యూ ఆయుర్వేదిక్ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ను ప్రారంభించారు. భారత సంప్రదాయాలైన ఆయుర్వేదం, యోగాకు చాలా సందర్భాల్లో ప్రచారం కల్పించారు. ఇటీవల కొద్దిరోజుల క్రితం కూడా భారత్లోనే బెంగళూరులో చార్లెస్ దంపతులు వారం రోజులు పర్యటించి వెళ్లారు.
తాజావార్తలు
-
Covid 19-AP: ఏపీలో అప్రమత్తం.. ప్రత్యేక కొవిడ్ వార్డు ఏర్పాటు!
-
Suriya : ఎక్స్పరిమెంట్స్ వద్దు.. రొటీన్ కమర్షియల్ సినిమాలే ముద్దంటున్న సూర్య
-
Fahadh Faasil: టామ్ క్రూజ్ సినిమాను వదులుకున్న ఫహద్ ఫాసిల్.. కారణం తెలిస్తే షాకవుతారు!
-
FIFA World Cup 2026 Final: మెస్సీ వర్సెస్ యమాల్.. అర్జెంటీనా-స్పెయిన్ ఫైనల్ పోరు, ఎవరిది పైచేయి?
-
2027 ODI World Cup: సెలెక్టర్లకు మైండ్ పని చేయడం లేదా?.. బీసీసీఐపై మాజీ టీమిండియా స్టార్ ఫైర్!
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!