UK: కింగ్ చార్లెస్ పట్టాభిషేకానికి ఎన్ని కోట్లు ఖర్చు చేశారో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..!
- యూకే కింగ్ చార్లెస్ పట్టాభిషేకానికి భారీగా ఖర్చు
- రూ.765 కోట్లు ఖర్చు చేసినట్లు ప్రభుత్వ నివేదిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజుల సొమ్ము రాళ్ల పాలు అంటారు పెద్దలు. ఈ సామెత ఎందుకు పుట్టిందో తెలియదు గానీ.. తాజాగా అంతర్జాతీయంగా వెలుగులోకి వచ్చిన ఓ సంఘటన ఆశ్చర్యం గొల్పోతుంది. యూకే కింగ్ చార్లెస్ పట్టాభిషేకానికి అక్షరాల 72 మిలియన్ పౌండ్లు ఖర్చు చేసినట్లు వెలుగులోకి వచ్చింది. అంటే అక్షరాల ఇండియన్ కరెన్సీ ప్రకారం రూ.765 కోట్లు ఖర్చు చేసినట్లు ప్రభుత్వ నివేదిక తెలిపింది.

Also Read
- China: "మనం శత్రువులం కాము".. భారత్కు చైనా సందేశం..
- Iran-Israel Ceasefire: ఇజ్రాయెల్తో కాల్పుల విరమణ ప్రకటించిన ఇరాన్.. మళ్లీ దాడులు చేస్తే మాత్రం..!
- Iran-Israel War: శాంతించండి.. దాడులు ఆపాలంటూ ఇరాన్, ఇజ్రాయెల్కు భారత్ విజ్ఞప్తి
- Iran Vs Israel: యుద్ధం మళ్లీ మొదలు..! ఇరాన్పై ఇజ్రాయెల్ దాడుల వెనుక ఉన్న కారణాలేంటి?
బ్రిటన్ రాజుగా చార్లెస్ గత సంవత్సరం 2023, మే నెల 6న పట్టాభిషేకం జరిగింది. 40వ బ్రిటన్ చక్రవర్తిగా ఆయన రికార్డ్ సృష్టించారు. 2022, సెప్టెంబర్లో తల్లి ఎలిజబెత్-2 మరణించడంతో చార్లెస్ రాజు అయ్యారు. వెస్ట్ మినిస్టర్ అబేలో సంప్రదాయబద్ధంగా ఈ వేడుక నిర్వహించారు. ఈ వేడుకలకు భారత ఉపరాష్ట్రపతి జగ్దీశ్ ధన్కర్తో సహా ప్రపంచం నలుమూలల నుంచి ప్రతినిధులు తరలివచ్చారు. యితే ఈ పట్టాభిషేకానికి రూ.765 కోట్లు ఖర్చు చేసినట్లుగా తాజా నివేదికలో వెల్లడైంది. వేదిక కోసమే 50.3 మిలియన్ పౌండ్లు ఖర్చయిందని, పోలీసింగ్ ఖర్చుల కోసం మరో 21.7 మిలియన్ పౌండ్లు ఖర్చయిందని సాంస్కృతిక శాఖ తెలిపింది.
ఇక కింగ్ చార్లెస్-3కి భారత్తో ప్రత్యేక అనుబంధం ఉంది. ఆయన యువరాజుగా ఉన్నప్పుడు 2007లో భారత్లో పర్యటించారు. 2019 నవంబర్లో కూడా ఆయన భారత్కు వచ్చారు. ముంబైలో పాఠశాల విద్యార్థులతో కలిసి తన 71వ జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. అంతర్జాతీయ వేదికలపై భారత్కు కచ్చితంగా తగిన ప్రాధాన్యం ఇవ్వాల్సిందేనని నొక్కిచెప్పేవారు. 2018 ఏప్రిల్లో లండన్లో భారత ప్రధాని నరేంద్రమోడీతో కలిసి సైన్స్ మ్యూజియం, న్యూ ఆయుర్వేదిక్ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ను ప్రారంభించారు. భారత సంప్రదాయాలైన ఆయుర్వేదం, యోగాకు చాలా సందర్భాల్లో ప్రచారం కల్పించారు. ఇటీవల కొద్దిరోజుల క్రితం కూడా భారత్లోనే బెంగళూరులో చార్లెస్ దంపతులు వారం రోజులు పర్యటించి వెళ్లారు.
తాజావార్తలు
-
Peddi :బుచ్చిబాబుపై SC/ST అట్రాసిటీ కేసు పెట్టాలని డిమాండ్!
-
India-US Trade Deal: అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదిరేది అప్పుడే.. భారత్ ఎదురుచూపులు!
-
HDFC Bank MCLR Hike: కస్టమర్లకు షాకిచ్చిన హెచ్డీఎఫ్సీ బ్యాంక్.. మరింత భారంగా EMIలు
-
Vaibhav Sooryavanshi: ‘వైభవ్ సూర్యవంశీ డకౌట్ అవుతాడు’.. కపిల్ దేవ్ సంచలన వ్యాఖ్యలు..
-
Vaibhav Sooryavanshi: ఐపీఎల్ సంచలనంపై అశ్విన్ ప్రశంసల వర్షం.. భవిష్యత్తు సూపర్ స్టార్
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!