UAE Drone Attack: యూఏఈలో భారతీయులపై దాడి.. తమ పౌరుల రక్తం చిందితే ఊరుకోం.. భారత విదేశాంగ శాఖ హెచ్చరిక!
- గల్ఫ్ దేశాల్లో డ్రోన్ల కలకలం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
UAE Drone Attack: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లోని ఫుజైరా ఆయిల్ ఇండస్ట్రీ జోన్ (FOIZ)పై జరిగిన డ్రోన్ దాడిని భారత్ తీవ్రంగా పరిగణించింది. ఈ ఘటనలో ముగ్గురు భారత పౌరులు గాయపడటం పట్ల కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇలాంటి దాడులు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని, హింసను తక్షణమే ఆపాలని అంతర్జాతీయ సమాజానికి భారత్ విజ్ఞప్తి చేసింది.
ముగ్గురు భారతీయులకు గాయాలు..
సోమవారం ఫుజైరా చమురు పరిశ్రమ ప్రాంతంపై జరిగిన డ్రోన్ దాడిలో భారీగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు భారతీయ కార్మికులకు గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన స్థానిక అధికారులు వారిని ఆసుపత్రికి తరలించారు. యూఏఈలోని భారత రాయబార కార్యాలయం నిరంతరం స్థానిక అధికారులతో సంప్రదింపులు జరుపుతూ, బాధితులకు అందుతున్న చికిత్సను పర్యవేక్షిస్తోంది. యూఏఈ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. ఇరాన్ మొత్తం నాలుగు క్షిపణులను ప్రయోగించింది. వీటిలో మూడింటిని యూఏఈ గగనతల రక్షణ వ్యవస్థలు విజయవంతంగా అడ్డుకోగా, ఒకటి సముద్రంలో పడిపోయింది. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రజలు వదంతులను నమ్మవద్దని, కేవలం అధికారిక సమాచారాన్నే పాటించాలని అధికారులు సూచించారు.
Also Read
- Iran-Oman: హార్ముజ్ ఆదాయంపై ఇరాన్-ఒమన్ కీలక ఒప్పందం.. అమెరికాకు షాక్
- Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
- Trump: మోజ్తబా ఖమేనీ చనిపోయడని అనుకోవట్లేదు.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
- Nepal-Tibet Flood: వరదల్లో చిక్కుకున్న ఇషా ఫౌండేషన్కు చెందిన 77 మంది భక్తులు, రంగంలోకి సద్గురు
భారత విదేశాంగ శాఖ కీలక ప్రకటన..
పౌర మౌలిక సదుపాయాలను, సామాన్య ప్రజలను లక్ష్యంగా చేసుకోవడం అత్యంత విచారకరమని భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. పశ్చిమ ఆసియాలో శాంతి నెలకొనాలంటే సంక్షోభాలను కేవలం దౌత్యపరమైన చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని భారత్ పునరుద్ఘాటించింది. ప్రపంచ వాణిజ్యానికి అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధి గుండా నిరాటంకంగా నౌకాయానం సాగాలని, సముద్ర భద్రత విషయంలో అంతర్జాతీయ దేశాలు సమన్వయంతో వ్యవహరించాలని కోరింది. ప్రాంతీయ శాంతిని కాపాడటానికి సాధ్యమైన అన్ని సహాయ సహకారాలు అందించడానికి భారతదేశం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని స్పష్టం చేసింది. ఈ దాడి నేపథ్యంలో గల్ఫ్ దేశాల్లోని చమురు క్షేత్రాలు, పారిశ్రామిక ప్రాంతాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. దాడుల వెనుక ఉన్న వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాలు కోరుతున్నాయి.
Our statement on the attack on Fujairah ⬇️
🔗 https://t.co/01Nz7g06FR pic.twitter.com/KQAr8R9ciQ
— Randhir Jaiswal (@MEAIndia) May 5, 2026
తాజావార్తలు
-
Nepal Floods: నేపాల్ వరదలపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. సీఎం రేవంత్ ఆదేశాలతో ప్రత్యేక హెల్ప్లైన్ ఏర్పాటు
-
Off The Record: తగ్గేదిలేదు.. స్థానిక సమరంలో జనసేన సరికొత్త వ్యూహం..!
-
Story Board : ‘లవ్ జిహాద్’ కోణంపై పోలీసుల ఫోకస్
-
Iran-Oman: హార్ముజ్ ఆదాయంపై ఇరాన్-ఒమన్ కీలక ఒప్పందం.. అమెరికాకు షాక్
-
Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..