UAE Drone Attack: యూఏఈలో భారతీయులపై దాడి.. తమ పౌరుల రక్తం చిందితే ఊరుకోం.. భారత విదేశాంగ శాఖ హెచ్చరిక!
- గల్ఫ్ దేశాల్లో డ్రోన్ల కలకలం
UAE Drone Attack: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లోని ఫుజైరా ఆయిల్ ఇండస్ట్రీ జోన్ (FOIZ)పై జరిగిన డ్రోన్ దాడిని భారత్ తీవ్రంగా పరిగణించింది. ఈ ఘటనలో ముగ్గురు భారత పౌరులు గాయపడటం పట్ల కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇలాంటి దాడులు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని, హింసను తక్షణమే ఆపాలని అంతర్జాతీయ సమాజానికి భారత్ విజ్ఞప్తి చేసింది.
ముగ్గురు భారతీయులకు గాయాలు..
సోమవారం ఫుజైరా చమురు పరిశ్రమ ప్రాంతంపై జరిగిన డ్రోన్ దాడిలో భారీగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు భారతీయ కార్మికులకు గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన స్థానిక అధికారులు వారిని ఆసుపత్రికి తరలించారు. యూఏఈలోని భారత రాయబార కార్యాలయం నిరంతరం స్థానిక అధికారులతో సంప్రదింపులు జరుపుతూ, బాధితులకు అందుతున్న చికిత్సను పర్యవేక్షిస్తోంది. యూఏఈ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. ఇరాన్ మొత్తం నాలుగు క్షిపణులను ప్రయోగించింది. వీటిలో మూడింటిని యూఏఈ గగనతల రక్షణ వ్యవస్థలు విజయవంతంగా అడ్డుకోగా, ఒకటి సముద్రంలో పడిపోయింది. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రజలు వదంతులను నమ్మవద్దని, కేవలం అధికారిక సమాచారాన్నే పాటించాలని అధికారులు సూచించారు.
Also Read
- Hantavirus Alert: భయపెడుతున్న హంటావైరస్.. లక్షణాలు, వ్యాప్తి, ప్రమాదాలపై వైద్యుల హెచ్చరికలు..
- Hyderabad Honeytrap: తల్లి సహకారంతోనే కొడుకుల 'రొమాంటిక్' ట్రాప్.. రంగంలోకి సీపీ సజ్జనార్
- White House: లాక్డౌన్లో వైట్ హౌస్.. అమెరికా అధ్యక్షుడి నివాసం వద్ద గన్ ఫైర్.. రంగంలోకి సీక్రెట్ సర్వీస్!
- West Asia Crisis: పశ్చిమ ఆసియాలో మళ్లీ యుద్ధ జ్వాలలు.. 'ఇరాన్ను భూమ్మీద లేకుండా తుడిచిపెట్టేస్తాం'.. ట్రంప్
భారత విదేశాంగ శాఖ కీలక ప్రకటన..
పౌర మౌలిక సదుపాయాలను, సామాన్య ప్రజలను లక్ష్యంగా చేసుకోవడం అత్యంత విచారకరమని భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. పశ్చిమ ఆసియాలో శాంతి నెలకొనాలంటే సంక్షోభాలను కేవలం దౌత్యపరమైన చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని భారత్ పునరుద్ఘాటించింది. ప్రపంచ వాణిజ్యానికి అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధి గుండా నిరాటంకంగా నౌకాయానం సాగాలని, సముద్ర భద్రత విషయంలో అంతర్జాతీయ దేశాలు సమన్వయంతో వ్యవహరించాలని కోరింది. ప్రాంతీయ శాంతిని కాపాడటానికి సాధ్యమైన అన్ని సహాయ సహకారాలు అందించడానికి భారతదేశం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని స్పష్టం చేసింది. ఈ దాడి నేపథ్యంలో గల్ఫ్ దేశాల్లోని చమురు క్షేత్రాలు, పారిశ్రామిక ప్రాంతాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. దాడుల వెనుక ఉన్న వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాలు కోరుతున్నాయి.
Our statement on the attack on Fujairah ⬇️
🔗 https://t.co/01Nz7g06FR pic.twitter.com/KQAr8R9ciQ
— Randhir Jaiswal (@MEAIndia) May 5, 2026
తాజావార్తలు
-
UAE Drone Attack: యూఏఈలో భారతీయులపై దాడి.. తమ పౌరుల రక్తం చిందితే ఊరుకోం.. భారత విదేశాంగ శాఖ హెచ్చరిక!
-
Vishwambhara : విశ్వంభర నుండి కీరవాణి ఔట్.. గౌరహరి ఇన్
-
Hantavirus Alert: భయపెడుతున్న హంటావైరస్.. లక్షణాలు, వ్యాప్తి, ప్రమాదాలపై వైద్యుల హెచ్చరికలు..
-
Hyderabad Honeytrap: తల్లి సహకారంతోనే కొడుకుల ‘రొమాంటిక్’ ట్రాప్.. రంగంలోకి సీపీ సజ్జనార్
-
Christopher Nolan : క్రిస్టోఫర్ నోలన్ ‘ది ఒడిస్సీ’ ట్రైలర్ రిలీజ్.. ఆస్కార్ రేంజ్
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!