US: వాషింగ్టన్లో కాల్పులు.. ఇద్దరు ఇజ్రాయెల్ ఎంబసీ సిబ్బంది మృతి
- వాషింగ్టన్లో కాల్పులు
- ఇద్దరు ఇజ్రాయెల్ ఎంబసీ సిబ్బంది మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అగ్ర రాజ్యం అమెరికాలో ఇజ్రాయెల్ లక్ష్యంగా కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం సిబ్బంది చనిపోయారు. దీంతో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది.
వాష్టింగ్టన్లోని యూదు మ్యూజియం సమీపంలో జరిగిన కాల్పుల్లో ఇద్దరు ఇజ్రాయెల్ రాయబార కార్యాలయ సిబ్బంది మరణించారు. బాధితులు ఎవరనేది ఇంకా బయటపెట్టలేదు. కానీ ఇద్దరు కూడా అమెరికాలోని ఇజ్రాయెల్ దౌత్య మిషన్తో అనుబంధంగా ఉన్నట్లు పేర్కొన్నాయి. దీన్ని యూదు వ్యతిరేక ఉగ్రవాద దుర్మార్గపు చర్యగా పోలీసులు అభివర్ణించారు. హత్యలపై దర్యాప్తు కొనసాగుతోందని యూఎస్ హోంల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ క్రిస్టి నోయెమ్ తెలిపారు. బాధిత కుటుంబాల కోసం ప్రార్థించాలని కోరారు.
Also Read
ఇది కూడా చదవండి: Trump: భారత్-పాక్ సమస్యను నేనే పరిష్కరించా.. ట్రంప్ మళ్లీ ప్రకటన
ఇక అనుమానితుడు చికాగోకు చెందిన 30 ఏళ్ల ఎలియాస్ రోడ్రిగ్జ్గా గుర్తించారు. కాల్పులకు ముందు మ్యూజియం వెలుపల తిరుగుతూ కనిపించాడు. నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నప్పుడు.. ‘‘పాలస్తీనాకు స్వేచ్ఛ ఇవ్వండి’’ అని నినాదాలు చేశాడు.
ఇది కూడా చదవండి: Today Gold Rate: పసిడి ప్రియులకు షాక్.. మరోసారి భారీగా పెరిగిన ధరలు..!
కాల్పుల గురించి తనకు సమాచారం అందించినట్లు ఎఫ్బీఐ డైరెక్టర్ కాష్ పటేల్ తెలిపారు. ‘‘ఈ రాత్రి డౌన్టౌన్ డీసీలో కాపిటల్ జ్యూయిష్ మ్యూజియం వెలుపల మరియు మా వాషింగ్టన్ ఫీల్డ్ ఆఫీస్ సమీపంలో జరిగిన కాల్పుల గురించి నాకు మరియు నా బృందానికి సమాచారం అందింది. మేము స్పందించడానికి మరియు తెలుసుకోవడానికి ఎంపీడీతో కలిసి పని చేస్తున్నప్పుడు.. దయచేసి బాధితులు మరియు వారి కుటుంబాల కోసం ప్రార్థించండి. మేము వీలైనంత వరకు ప్రజలకు తెలియజేస్తాము.’’ అని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.
ఇక కాల్పుల ఘటన గురించి సమాచారం అందిన వెంటనే వాషింగ్టన్ డీసీ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మ్యూజియం చుట్టూ భద్రతను పెంచారు. సాక్షులు మరియు నిఘా ఫుటేజ్ కోసం శోధిస్తున్నారని పోలీసు ప్రతినిధి తెలిపారు. ఇక ఈ దాడిని ఐక్యరాజ్యసమితిలో ఇజ్రాయెల్ రాయబారి డానీ డానన్ ఖండించారు.
తాజావార్తలు
-
RAPO 23 : దర్శకుడుగా హీరో రామ్.. రేపు అధికారిక ప్రకటన.!
-
Tata Altroz iCNG AMT: టాటా ఆల్ట్రోజ్ iCNG AMT విడుదల.. సేఫ్ & స్మార్ట్ CNG అటోమేటిక్
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
Karuppu : కరుప్పు రిలీజ్ కష్టాలు.. కన్నీళ్లు పెట్టుకున్న డైరెక్టర్
-
Virat Kohli Century: “నేనే చెప్పాను కదా.. అందుకే”.. కోహ్లీ సెంచరీపై తర్వాత కృనాల్ పాండ్యా వైరల్ పోస్ట్..!
ట్రెండింగ్
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!