Donald Trump Dual Policy: ట్రంప్ ద్వంద్వ వైఖరి… ఓవైపు చర్చలు.. మరోవైపు సైనికుల మోహరింపు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Donald Trump Dual Policy: ఇరాన్తో యుద్ధ సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన విదేశాంగ విధానంలో ద్వంద్వ వైఖరిని ప్రదర్శిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒకవైపు ఇరాన్తో శాంతి చర్చలు కొనసాగిస్తున్నామని ప్రకటిస్తూనే, మరోవైపు మధ్యప్రాచ్యంలో సైనిక శక్తిని పెంచే చర్యలు చేపడుతున్నారు. మధ్యప్రాచ్య ప్రాంతంలో అమెరికా తన సైనిక ఉనికిని మరింత బలోపేతం చేయాలని యోచిస్తోంది. ఇందులో భాగంగా అదనంగా 10,000 మంది సైనికులను పంపేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నట్లు అంతర్జాతీయ మీడియా నివేదికలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఇరాన్తో ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది.
Read Also: Daily Horoscope: శుక్రవారం దిన ఫలాలు.. పండగ పూట ఆ రాశి వారికి అన్ని అనుకూలమే!
Also Read
- Iran-US: ఇస్లామాబాద్లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
- Pakistan Medicine Crisis: పిండి, గ్యాస్ తర్వాత పాకిస్తాన్లో మరో సంక్షోభం.. ప్రజల ప్రాణాలకు ముప్పు..
- Bangladesh: బెంగాల్లో బీజేపీ గెలుపుతో సంతోషంలో బంగ్లాదేశ్ ప్రధాని.. కారణం ఇదే..
- Project Freedom: అమెరికా, ఇరాన్ల మధ్య వివాదంలో కీలక మలుపు.. 'ప్రాజెక్ట్ ఫ్రీడమ్'కు ట్రంప్ బ్రేక్
అయితే ఇదే సమయంలో, రాబోయే 10 రోజుల పాటు ఇరాన్ ఇంధన మౌలిక సదుపాయాలపై దాడులు జరపబోమని ట్రంప్ ప్రకటించడం గమనార్హం. చర్చలు కొనసాగుతున్నాయని, శాంతికి ఇంకా అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. కానీ, ఈ ప్రకటనలతో పాటు సైనిక మోహరింపు వార్తలు రావడం అనేక అనుమానాలకు తావిస్తోంది. పెంటగాన్ కూడా ఈ పరిస్థితిలో కీలక పాత్ర పోషిస్తోంది. ట్రంప్కు మరిన్ని సైనిక ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉంచేందుకు మధ్యప్రాచ్యానికి భూతల దళాలను పంపే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. శాంతి చర్చలు జరుగుతున్నప్పటికీ, యుద్ధానికి సిద్ధమవుతున్నట్లు ఈ చర్యలు సూచిస్తున్నాయి.
ఇదిలా ఉండగా, అమెరికా తొలిసారిగా ఇరాన్కు వ్యతిరేక ఆపరేషన్లలో డ్రోన్ స్పీడ్బోట్ల వినియోగాన్ని అధికారికంగా అంగీకరించింది. ఈ మానవరహిత పడవలు ప్రధానంగా నిఘా కోసం ఉపయోగించబడుతున్నప్పటికీ, అవసరమైతే దాడుల కోసం కూడా వినియోగించవచ్చు. కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల్లో ఈ సాంకేతికతకు ప్రాధాన్యం పెరుగుతోంది. గతంలో Ukraine–Russia యుద్ధంలో ఇలాంటి డ్రోన్ పడవలు కీలక పాత్ర పోషించాయి. రష్యా నౌకాదళానికి గణనీయమైన నష్టం కలిగించిన తర్వాత, ప్రపంచ దేశాలు ఈ టెక్నాలజీపై మరింత దృష్టి సారించాయి.
ఇక ఇటీవల ఇరాన్ కూడా గల్ఫ్ ప్రాంతంలో చమురు ట్యాంకర్లపై సముద్ర డ్రోన్ దాడులు జరిపినట్లు సమాచారం. దీంతో ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. మేరీల్యాండ్కు చెందిన బ్లాక్సీ సంస్థ రూపొందించిన మానవరహిత వ్యవస్థలను అమెరికా గస్తీ కార్యకలాపాల కోసం ఉపయోగిస్తున్నట్లు పెంటగాన్ సెంట్రల్ కమాండ్ ప్రతినిధి తెలిపారు. ఈ మొత్తం కార్యాచరణను “ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ”గా పిలుస్తున్నారు. మొత్తం పరిస్థితిని పరిశీలిస్తే, ఒకవైపు శాంతి చర్చలు, మరోవైపు సైనిక సన్నాహాలు కొనసాగించడం ద్వారా ట్రంప్ ప్రభుత్వం రెండు మార్గాల్లో ముందుకు సాగుతున్నట్లు కనిపిస్తోంది. ఇది భవిష్యత్తులో మధ్యప్రాచ్య పరిస్థితులపై ఎలా ప్రభావం చూపుతుందో చూడాలి.
తాజావార్తలు
-
Srithej : శ్రీతేజ్ కుటుంబానికి అల్లు ఫ్యామిలీ భరోసా: చదువు బాధ్యత నాదేనన్న అల్లు అరవింద్!
-
Iran-US: ఇస్లామాబాద్లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
-
Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
-
DMK: కాంగ్రెస్ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
-
Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!