Trump: ‘‘ట్రంప్ ప్రతీ దానికి క్రెడిట్ తీసుకుంటారు’’.. అది ఆయన లక్షణం..
- ట్రంప్ ప్రతీదానికి క్రెడిట్ తీసుకుంటారు..
- ఇది ఆయన విలక్షణం..
- ఇండియా-పాక్ మధ్యవర్తిత్వంపై యూఎస్ మాజీ ఎన్ఏస్ఏ..
- ట్రంప్ తీరుపై సెటైర్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Trump: ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్-పాకిస్తాన్ మధ్య తాను మధ్యవర్తిత్వం చేసి, అణు యుద్ధాన్ని నివారించానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించుకున్నారు. అయితే, పాకిస్తాన్ కాల్పుల విరమణను కోరడంతోనే తాము అంగీకరించామని భారత్ స్పష్టం చేసింది. తాజాగా, విదేశాంగ మంత్రి జైశంకర్ మాట్లాడుతూ, ఈ వ్యవహారంలో అమెరికా ప్రమేయం లేదని చెప్పారు.
ఇదిలా ఉంటే, అమెరికా మాజీ జాతీయ భద్రతా సలహాదారు(ఎన్ఎస్ఏ) జాన్ బోల్టన్, డొనాల్డ్ ట్రంప్ వాదనల్ని తోసిపుచ్చారు. మధ్యవర్తిత్వం ఆయన క్రెడిట్ తీసుకోవడంపై సెటైర్లు వేశారు. ‘‘ట్రంప్ బీయింగ్ ట్రంప్’’ అని ఆయన ‘‘ప్రతీదానికి క్రెడిట్ తీసుకుంటారు’’ అని అన్నారు. ఆపరేషన్ సిందూర్ ద్వారా భారత్ తీసుకున్న చర్యలు పూర్తిగా సమర్థనీయమని బోల్టన్ అన్నారు. పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయిన తర్వాత, పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపై ఆత్మరక్షణ దాడులు చేసే హక్కు భారత్కి ఉందని అన్నారు. సరిహద్దుల్లో పాకిస్తాన్ ఉగ్రవాద కార్యకలాపాలను నియంత్రించాల్సి ఉందని, లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.
Also Read
Read Also: KTR: “కాళేశ్వరాన్ని కూల్చింది వాళ్లే అని నా డౌట్..” మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
భారత్-పాక్ మధ్య మధ్యవర్తిత్వం వహించినందుకు ట్రంప్ క్రెడిట్ తీసుకోవడంపై జాన్ బోల్టన్ మాట్లాడుతూ.. ‘‘ ఇది భారత్కి మాత్రమే సంబంధించింది కాదు, ఆయన ప్రతీ దానికి క్రెడిట్ తీసుకుంటారు. ఇది ట్రంప్ విలక్షణమైన లక్షణం. ఎవరైనా క్రెడిట్ తీసుకునే ముందు ఆయన జోక్యం చేసుకుంటారు. ఇది చిరాకు కలిగించవచ్చు. ఇది భారత్కి వ్యతిరేకంగా కాదు, ట్రంప్ ట్రంప్ మాదిరిగానే ఉండటం మాత్రమే’’ అని అన్నారు.
పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్కి ఫీల్డ్ మార్షల్ హోదా ఇవ్వడంపై ఆయన మాట్లాడుతూ, ఇది కలతపెట్టే సంకేతం అని అన్నారు. పాకిస్తాన్ అంతర్గత అసమ్మతిని అణచివేస్తోంది, ఇమ్రాన్ ఖాన్ని జైలులో ఉంచారు, ఇది చివరకు పాకిస్తాన్ సొంత ప్రయోజనాల కోసం కాదనేది నా భావన, దీనిపై అమెరికా ప్రభుత్వం ఒత్తిడి చేయాల్సిన విషయం అని అన్నారు. భారత్ తన దౌత్య బృందాలను ప్రపంచ దేశాలకు పంపించడాన్ని ఆయన సమర్థించారు, ఉగ్రవాదం గురించి ప్రపంచదేశాలకు తెలియాల్సిన అవసరం ఉందని చెప్పారు.
#WATCH | Washington, DC: On President Donald Trump claiming credit for the ceasefire between India and Pakistan, former National Security Advisor of the United States, John Bolton says, "… It's nothing personal to India. This is Donald Trump, who takes credit for everything. I… pic.twitter.com/qVmZmzIK1N
— ANI (@ANI) May 21, 2025
తాజావార్తలు
-
Kishan Reddy: ‘తెలుగును తొక్కిపెట్టి ఉర్దూను రుద్దారు’..! విమోచన వేడుకల్లో కీలక వ్యాఖ్యలు..
-
US Russia Sanctions Bill Passed: అమెరికాలో రష్యా ఆంక్షల బిల్లు ఆమోదంపై భారత్ తొలి స్పందన.. ఇంధన భద్రతపై కీలక ప్రకటన
-
CM Revanth Reddy: చరిత్రను మరిచిపోం.. అక్కడే ఆగిపోం.!
-
BCCI Chief Selector: అజిత్ అగార్కర్ అవుట్.. చీఫ్ సెలెక్టర్ రేసులో ఆ ఇద్దరు మాజీ క్రికెటర్లు!
-
Gold and Silver Prices Today: గుడ్ న్యూస్.. బంగారం, వెండి ధరలు భారీగా పతనం..
ట్రెండింగ్
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!