ఇజ్రాయెల్పై డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. లెబనాన్లో హిజ్బుల్లాపై ఇజ్రాయెల్కు బదులు సిరియానే బెటర్ అని వ్యాఖ్యానించారు. జీ 7 సదస్సులో భాగంగా ట్రంప్ ఫ్రాన్స్లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఖతార్ ఎమిర్తో ట్రంప్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ట్రంప్.. ఇజ్రాయెల్పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
హిజ్బుల్లాపై పోరాటంలో ఇజ్రాయెల్ వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. హిజ్బుల్లా పేరుతో మనుషులందరినీ చంపడం సరైంది కాదన్నారు. టార్గెట్ వ్యక్తులు కాకుండా.. మనుషులందరినీ చంపేస్తున్నారు. ఇదేమీ బాగోలేదన్నారు. అవసరమైతే సిరియానే ఈ పని మెరుగ్గా చేయగలదని వ్యాఖ్యానించారు. ఇజ్రాయెల్ సైనిక చర్యలు ఇరాన్తో జరుగుతున్న శాంతి చర్చలను దాదాపు దెబ్బతీశాయని కూడా పేర్కొన్నారు. ఇజ్రాయెల్ సైనిక చర్యలు చాలా కాలంగా కొనసాగుతున్నాయని.. అమాయకుల ప్రాణనష్టం అధికంగా జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.
నెతన్యాహూపై అసహనం
ఇదిలా ఉండగా అమెరికా-ఇరాన్ మధ్య ఇటీవల ప్రాథమిక శాంతి ఒప్పందానికి అంగీకారం కుదిరింది. ఈ ఒప్పందంలో లెబనాన్లో సైనిక చర్యలకు ముగింపు పలకడం కూడా భాగమని ఇరాన్, పాకిస్థాన్ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ పరిణామం ఇజ్రాయెల్కు అసంతృప్తి కలిగించినట్లు తెలుస్తోంది. అలాగే ప్రపంచ ఇంధన రవాణాకు కీలకమైన హోర్ముజ్ జలసంధి తిరిగి తెరవడం, ఇరాన్పై అమెరికా విధించిన ఆంక్షల సడలింపు వంటి అంశాలు కూడా ఈ ఒప్పందంలో ఉన్నట్లు సమాచారం. అయితే నెతన్యాహుతో తనకు ఎలాంటి వ్యక్తిగత విభేదాలు లేవని స్పష్టం చేశారు. కానీ లెబనాన్ విషయంలో ఇజ్రాయెల్ మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పేర్కొన్నారు.

