Pakistan: ట్రంప్ కోసం భూమిని తవ్వేందుకు సిద్ధమైన పాకిస్తాన్.. టార్గెట్ రేర్-ఎర్త్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుగ్రహం కోసం తాపత్రయపడుతున్నారు. ఆరేళ్ల తర్వాత, తొలిసారిగా పాకిస్తాన్తో అమెరికా ద్వైపాక్షిక చర్చలు నిర్వహించింది. రెండు దేశాల సంబంధాలు బలపడుతున్నాయి. అయితే వీటన్నింటికి ఒకే కారణం కనిపిస్తోంది. పాకిస్తాన్లోని అరుదైన ఖనిజాలపై అమెరికా కన్నేసింది. అమెరికా ఆశలకు అనుగుణంగా పాకిస్తాన్ కూడా పనిచేస్తోంది.
ముఖ్యంగా, రేర్-ఎర్త్ ఖనిజాలపై అమెరికా దృష్టి సారించిన నేపథ్యంలో, ఇటీవల వైట్ హౌజ్లో జరిగిన సమావేశంలో ఆసిమ్ మునీర్, డొనాల్డ్ ట్రంప్కు ఒక సూట్ కేస్లో ఉన్న రేర్ ఎర్త్ ఖనిజాలను చూపిస్తున్న ఫోటో వైరల్గా మారింది. ఈ సమయంలో పాకిస్తాన్ ప్రధాని షరీఫ్ అక్కడే ఉన్నాడు. ఓవర్ కార్యాలయంలో క్లోజ్డ్ డోర్ సమావేశం తర్వాత, యూఎస్ మెటల్స్ కంపెనీలు పాకిస్తాన్తో $500 మిలియన్ల పెట్టుబడి ఒప్పందంపై సంతకం చేసిన వారాల తర్వాత ఈ ఫోటో బయటకు వచ్చింది. నిజానికి, వాణిజ్య పరంగా నిరూపించబడిన అరుదైన ఖనిజాలు లేనప్పటికీ, పాకిస్తాన్ ప్రస్తుతానికి రంగురాళ్లలో ట్రంప్ను అబ్బురపరిచిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
Also Read
- America vs Iran: కాస్కో ఇరాన్..! మీకు రెండే ఆప్షన్స్.. వినకపోతే లేపి పడేస్తాం.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు!
- Tragedy: చూడ ముచ్చటైన జంట.. పెళ్లైన కొద్ది గంటల్లోనే విషాదం.. హెలికాప్టర్ ప్రమాదంలో భారత సంతతి పైలట్ మృతి
- Halloween: అర్థరాత్రి 12 దాటగానే వింత శబ్దాలు.. ఆ యూనివర్శిటీలో దెయ్యాలున్నాయా?
- US airstrikes on Iran: కొనసాగుతున్న ఉద్రిక్తతలు.. ఇరాన్ రాడార్, డ్రోన్ స్థావరాలపై అమెరికా దాడులు..
Read Also: India UNSC Veto Power: UNSCలో భారత్కు వీటో పవర్ దూరం చేస్తుంది ఏంటి? ఇండియా కల నెరవేరుతుందా!
మరోవైపు, ట్రంప్ను ప్రసన్నం చేసుకోవడానికి పాకిస్తాన్ పడరాని పాట్లు పడుతోంది. ఆపరేషన్ సిందూర్ సమయంలో కాల్పుల విరమణకు ట్రంప్ సహకరించారని, శాంతికి సహకరించినందకు ఆయనకు నోబెల్ శాంతి బహుమతిని ప్రధానం చేయాలని షరీఫ్ కోరారు. పాకిస్తాన్ వ్యవసాయం, ఐటీ, గనులు ఖనిజాలు, ఇంధన రంగాల్లో అమెరికన్ కంపెనీలు పెట్టుబడుల్ని పెట్టాలని కోరుతోంది.
పాకిస్తాన్ బలూచిస్తాన్ ప్రాంతంలో ఈ ఖనిజాలు ఉన్నాయి. అయితే, కల్లోలిత ప్రాంతంలో పాకిస్తాన్ ప్రభుత్వ పట్టు లేదు. బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఆధీనంలో మెజారిటీ బలూచిస్తాన్ ప్రాంతం ఉంది. అయితే, పాకిస్తాన్ ఆలోచన ప్రకారం, అమెరికన్ కంపెనీలు ఈ ప్రాంతంలో అడుగుపెడితే ఇటు వేర్పాటువాదుల్ని అణచడంతో పాటు, పాకిస్తాన్కు డాలర్లు వచ్చి అప్పులు తీరిపోతాయని భావిస్తోంది.
తాజావార్తలు
-
CM Chandrababu: వైసీపీకి సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్.. ఎవరూ ఆపలేరు..!
-
Jagapathi Babu: ఎడిటింగ్లో బలయ్యా.. ‘పుష్ప 2’పై జగపతి బాబు సంచలన వ్యాఖ్యలు?
-
Bengaluru Traffic: కడుపుతో ఉన్న భార్య కోసం ఖాకీలతోని కొట్లాట.. నడిరోడ్డుపై కూర్చున్న సామాన్యుడు! వీడియో వైరల్..
-
Srikanth Odela : నాని ‘పారడైజ్’లో మెగాస్టార్? శ్రీకాంత్ ఓదెల మైండ్ బ్లోయింగ్ మల్టీవర్స్ ప్లాన్!
-
Kalita Majhi: బెంగాల్ రాజకీయాల్లో సామాన్య ఆడబిడ్డ సంచలనం .. రాష్ట్ర మంత్రిగా ఇళ్లల్లో పనులు చేసుకునే మహిళ !
ట్రెండింగ్
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్తో గుడ్బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!