Trump: భారత్పై మరో బాంబ్ పేల్చిన ట్రంప్.. మరిన్ని దశలు ఉన్నాయని హెచ్చరిక
- భారత్పై మరో బాంబ్ పేల్చిన ట్రంప్
- మరిన్ని దశలు ఉన్నాయని హెచ్చరిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్పై ట్రంప్ కక్ష కట్టినట్లుగా కనిపిస్తోంది. ఇప్పటికే భారత్పై 50 శాతం సుంకం విధించారు. తాజాగా ఓవల్ కార్యాలయంలో ట్రంప్ మాట్లాడుతూ.. భారత్పై మరిన్ని దశలు ఉన్నాయని.. రెండు లేదా మూడో దశ సుంకాలు ఉంటాయని సూచించారు.
ఇది కూడా చదవండి: Lisbon: లిస్బన్లో ఎలక్ట్రిక్ స్ట్రీట్కార్ ప్రమాదం.. 20 మంది మృతి
Also Read
- Giorgia Meloni: మెలోని ఢిల్లీలో పోటీ చేస్తే లక్షల ఓట్లు గ్యారెంటీ..
- India-Bangladesh: బంగ్లాదేశ్ పౌరులకు గుడ్న్యూస్.. టూరిస్ట్ వీసాల జారీకి భారత్ గ్రీన్ సిగ్నల్
- Pakistan: సైనికుల జీతాలు 25% పెంచిన పాక్.. సిందూర్ దెబ్బకు పరిహారమా?
- Bangladesh: ‘‘సీఎం సువేందు బాబును ఆపండి’’.. భారత్కు బంగ్లాదేశ్ ఎంపీ విజ్ఞప్తి.
వైట్హౌస్లో పోలాండ్ అధ్యక్షుడు కరోల్ నవ్రోకితో ట్రంప్ భేటీ అయ్యారు. అనంతరం ఓవల్ కార్యాలయంలో ట్రంప్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఓ విలేకరి.. రష్యాపై చర్యలేవీ అంటూ ప్రశ్నించారు. దీంతో ట్రంప్ రుసరుసలాడారు. చర్య లేదని మీకెలా తెలుసు? రష్యాతో సంబంధాలు పెట్టుకున్న భారత్, చైనాపై ద్వితీయ ఆంక్షలు విధించినట్లు తెలిపారు. దీని కారణంగా రష్యాకు వందల బిలియన్ల డాలర్లు ఖర్చయ్యాయని చెప్పారు. ఇది చర్య కాదంటారా? ఇక తాను రెండు లేదా మూడో దశ ఇంకా చేయలేదని.. అది కూడా త్వరలోనే ఉంటుందని ట్రంప్ ఎదురుదాడికి దిగారు.
ఇది కూడా చదవండి: Delhi Floods: డేంజర్లో యమునా నది.. మునిగిన ఢిల్లీ లోతట్టు ప్రాంతాలు
రష్యా దగ్గర చమురు కొనుగోలు చేస్తే భారత్కు పెద్ద సమస్యలు ఉంటాయని ట్రంప్ వ్యాఖ్యానించారు. భవిష్యత్లో కూడా మరింత జరుగుతుందని.. దాని గురించి ఇంకేమీ చెప్పొద్దన్నారు. మాస్కోపై ద్వితీయ ఆంక్షలు విధించబోతున్నారా? అని అడిగినప్పుడు.. ఇప్పటికే భారత్ విషయయంలో అలానే చేశానని.. ఇతర విషయాల్లో కూడా అలానే చేస్తామని చెప్పుకొచ్చారు.
భారత్పై ట్రంప్ తొలుత 25 శాతం సుంకం విధించారు. అనంతరం రష్యాతో సంబంధాలు పెట్టుకున్నందుకు జరిమానాగా మరో 25 శాతం సుంకం విధిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో భారత్పై 50 సుంకం అమల్లోకి వచ్చింది. తాజాగా మాట్లాడుతూ.. మరిన్ని దశల్లో ఆంక్షలు ఉంటాయని హెచ్చరించారు.
ఇక ట్రంప్ సుంకాలపై భారత్ ధీటుగానే సమాధానం ఇచ్చింది. రైతుల కోసం ఎంత భారమైనా భరిస్తామంటూ మోడీ వెల్లడించారు. అన్నదాతలే తమకు ముఖ్యమని.. ఏ విషయంలో రాజీ పడబోమని తేల్చి చెప్పారు.
ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక ఉక్రెయిన్-రష్యా యుద్ధం ఆపేందుకు ప్రయత్నించారు. కానీ ఫలితాన్ని ఇవ్వలేదు. ఇరు దేశాల అధ్యక్షులతో మంతనాలు జరిపినా సమస్య కొలిక్కి రాలేదు. దీంతో రష్యాతో సంబంధాలు పెట్టున్న దేశాలపై భారీగా సుంకాలు ఉంటాయని హెచ్చరించారు. అన్నట్టుగానే భారత్పై 50 శాతం సుంకం విధించారు. చైనాపై విధించినా 90 రోజులు గడువు విధించారు. భారత్పై మాత్రం అమలు చేసేశారు.
- Tags
- america
- china
- india
- Oval Office
- Russia
తాజావార్తలు
-
Animal Ambulance: జంతువుల ప్రాణాలు కాపాడేందుకు తొలి EV బైక్ అంబులెన్స్ షురూ.!
-
Divija Prabhakar: ఎంతో కస్టపడి సినిమా చేశాం.. ‘వెంకట్రామయ్య గారి తాలూకా’ అందరికీ నచ్చుతుంది!
-
TG20 League 2026: రాయుడు ‘హిట్’ ఇన్నింగ్స్.. పాలమూరు స్ట్రైకర్స్ ఘన విజయం!
-
Friday Horoscope: శుక్రవారం దిన ఫలాలు.. వృత్తి, ఉద్యోగ రంగాల్లో మిశ్రమ ఫలితాలు!
-
Ranabaali : ‘రణబాలి’ వివాదంపై మైత్రి రవిశంకర్ స్పందన.. విజయ్పై కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!