Donald Trump: 60 రోజుల గాజా కాల్పుల విరమణకు ఇజ్రాయిల్ అంగీకరించింది..
- గాజాలో 60 కాల్పుల విరమణకు ఇజ్రాయిల్ అంగీకరించింది..
- హమాస్ ఈ ఒప్పందానికి అంగీకరిస్తుందని ఆశిస్తున్నా..
- లేకుంటే పరిస్థితి మరింత దిగజారుతుందని ట్రంప్ హెచ్చరిక..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Donald Trump: హమాస్ ఉగ్రవాదులతో ఇజ్రాయిల్ కాల్పుల విరమణకు అంగీకరించిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. గాజాలో 60 రోజుల పాటు కాల్పుల విరమణకు అంగీకరించినట్లు వెల్లడించారు. దీని కోసం ఖతార్, ఈజిప్ట్ మధ్యవర్తిత్వం వహించారని చెప్పుకొచ్చారు. తన ప్రతినిధులు గాజా గురించి ఇజ్రాయిల్ అధికారులతో సుదీర్ఘమైన, ఫలవంతమైన సమావేశాలు నిర్వహించినట్లు చెప్పారు.
60 రోజుల కాల్పుల విరమణను ఖరారు చేయడానికి ఇజ్రాయెల్ షరతులకు అంగీకరించిందని,‘‘ఈ సమయంలో మేము యుద్ధాన్ని ముగించడానికి అన్ని పార్టీలతో కలిసి పని చేస్తాము’’ అని ట్రంప్ అన్నారు. ఖతార్, ఈజిప్ట్ ప్రతినిధులు హమాస్కు “ఈ తుది ప్రతిపాదన”ను అందజేస్తారని ట్రంప్ అన్నారు. మిడిల్ ఈస్ట్ దేశాల కోసం హమాస్ ఈ ఒప్పందాన్ని ఒప్పుకుంటుందని ఆశిస్తున్నట్లు ట్రంప్ చెప్పారు. ఒక వేళ హమాస్ అంగీకరించకుంటే వారి పరిస్థితి మరింత దిగజారుతుందని హెచ్చరించారు.
Also Read
- US-Iran Talks: హార్ముజ్పై గుడ్న్యూస్.. ఇరాన్-యూఎస్ మధ్య కీలక చర్చలు.. ఏం నిర్ణయం తీసుకున్నారంటే..!
- Iran-US: ఇస్లామాబాద్లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
- Pakistan Medicine Crisis: పిండి, గ్యాస్ తర్వాత పాకిస్తాన్లో మరో సంక్షోభం.. ప్రజల ప్రాణాలకు ముప్పు..
- Bangladesh: బెంగాల్లో బీజేపీ గెలుపుతో సంతోషంలో బంగ్లాదేశ్ ప్రధాని.. కారణం ఇదే..
Read Also: IndiGo Flight Emergency Landing: ఇండిగో విమానం అత్యవసర ల్యాండింగ్.. 222 మంది ప్రయాణికులు సేఫ్..
ట్రంప్ విలేకరులతో మాట్లాడుతూ, ఇజ్రాయిల్ గాజాలోని హమాస్ ఉగ్రవాదుల మధ్య వచ్చే వారం బందీల కోసం కాల్పుల విరమణ ఒప్పందం కుదురే అవకాశం ఉందని చెప్పారు. మరోవైపు, సోమవారం ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ, వైట్హౌజ్లో ట్రంప్ని కలవనున్నారు. యుద్ధాన్ని ముగించడానికి ఏదైనా ఒప్పందం ప్రకారం గాజాలో మిగిలిన బందీలను విడిపించడానికి సిద్ధంగా ఉన్నామని హమాస్ తెలిపింది. హమాస్ పూర్తిగా తమ ఆయుధాలను విడిచిపెడితేనే అది సాధ్యమవుతుందని ఇజ్రాయిల్ ఇటీవల చెప్పింది. హమాస్ మాత్రం నిరాయుధీకరణకు నిరాకరించింది.
అక్టోబర్, 2023న ఇజ్రాయిల్పై హమాస్ దాడి చేసి 1200 మందిని చంపింది. 251మందిని బందీలుగా గాజాలోకి తీసుకెళ్లింది. అప్పటి నుంచి ఇజ్రాయిల్ గాజాపై దాడి చేస్తోంది. హమాస్ చెబుతున్న దాని ప్రకారం, ఇజ్రాయిల్ దాడుల్లో ఇప్పటి వరకు 56,000 మంది పాలస్తీనియన్లు మరణించారు.
తాజావార్తలు
-
Watermelon Case: పుచ్చకాయ తిని నలుగురు మృతి.. ఫోరెన్సిక్ నివేదికలో షాకింగ్ నిజం..
-
TVK Vijay: విజయ్కు కొత్త చిక్కులు.. వాట్సాప్ మెసేజ్లపై వామపక్షాలు గుర్రు!
-
CM Chandrababu : బుల్లెట్ బండి.. కాలేజీ జ్ఞాపకాలు.. రాయల్ ఎన్ఫీల్డ్ నడపడంపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
-
US-Iran Talks: హార్ముజ్పై గుడ్న్యూస్.. ఇరాన్-యూఎస్ మధ్య కీలక చర్చలు.. ఏం నిర్ణయం తీసుకున్నారంటే..!
-
Ponnam Prabhakar : రాజకీయాల్లో హుందాతనం ముఖ్యం.. భౌతిక దాడులపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం