Donald Trump: 60 రోజుల గాజా కాల్పుల విరమణకు ఇజ్రాయిల్ అంగీకరించింది..
- గాజాలో 60 కాల్పుల విరమణకు ఇజ్రాయిల్ అంగీకరించింది..
- హమాస్ ఈ ఒప్పందానికి అంగీకరిస్తుందని ఆశిస్తున్నా..
- లేకుంటే పరిస్థితి మరింత దిగజారుతుందని ట్రంప్ హెచ్చరిక..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Donald Trump: హమాస్ ఉగ్రవాదులతో ఇజ్రాయిల్ కాల్పుల విరమణకు అంగీకరించిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. గాజాలో 60 రోజుల పాటు కాల్పుల విరమణకు అంగీకరించినట్లు వెల్లడించారు. దీని కోసం ఖతార్, ఈజిప్ట్ మధ్యవర్తిత్వం వహించారని చెప్పుకొచ్చారు. తన ప్రతినిధులు గాజా గురించి ఇజ్రాయిల్ అధికారులతో సుదీర్ఘమైన, ఫలవంతమైన సమావేశాలు నిర్వహించినట్లు చెప్పారు.
60 రోజుల కాల్పుల విరమణను ఖరారు చేయడానికి ఇజ్రాయెల్ షరతులకు అంగీకరించిందని,‘‘ఈ సమయంలో మేము యుద్ధాన్ని ముగించడానికి అన్ని పార్టీలతో కలిసి పని చేస్తాము’’ అని ట్రంప్ అన్నారు. ఖతార్, ఈజిప్ట్ ప్రతినిధులు హమాస్కు “ఈ తుది ప్రతిపాదన”ను అందజేస్తారని ట్రంప్ అన్నారు. మిడిల్ ఈస్ట్ దేశాల కోసం హమాస్ ఈ ఒప్పందాన్ని ఒప్పుకుంటుందని ఆశిస్తున్నట్లు ట్రంప్ చెప్పారు. ఒక వేళ హమాస్ అంగీకరించకుంటే వారి పరిస్థితి మరింత దిగజారుతుందని హెచ్చరించారు.
Also Read
- Strait of Hormuz: హోర్ముజ్ నుంచి యెమెన్ వరకు హైటెన్షన్.. 86 షిప్స్కు అమెరికా బ్రేక్!
- Turkey-SCO: ‘ఎస్సీవో’లో మేము చేరతాం.. టర్కీ ప్రతిపాదన.. భారత్ అభ్యంతరం!
- US: పౌరసత్వంపై ట్రంప్ కఠిన వైఖరి.. పిల్లల పాస్పోర్ట్కు తల్లిదండ్రుల ఆధారాలు మెలిక?
- Nepal Floods: వరదలకు మీరే కారణం.. భారత్, చైనా, అమెరికాలను టార్గెట్ చేస్తున్న నేపాల్..
Read Also: IndiGo Flight Emergency Landing: ఇండిగో విమానం అత్యవసర ల్యాండింగ్.. 222 మంది ప్రయాణికులు సేఫ్..
ట్రంప్ విలేకరులతో మాట్లాడుతూ, ఇజ్రాయిల్ గాజాలోని హమాస్ ఉగ్రవాదుల మధ్య వచ్చే వారం బందీల కోసం కాల్పుల విరమణ ఒప్పందం కుదురే అవకాశం ఉందని చెప్పారు. మరోవైపు, సోమవారం ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ, వైట్హౌజ్లో ట్రంప్ని కలవనున్నారు. యుద్ధాన్ని ముగించడానికి ఏదైనా ఒప్పందం ప్రకారం గాజాలో మిగిలిన బందీలను విడిపించడానికి సిద్ధంగా ఉన్నామని హమాస్ తెలిపింది. హమాస్ పూర్తిగా తమ ఆయుధాలను విడిచిపెడితేనే అది సాధ్యమవుతుందని ఇజ్రాయిల్ ఇటీవల చెప్పింది. హమాస్ మాత్రం నిరాయుధీకరణకు నిరాకరించింది.
అక్టోబర్, 2023న ఇజ్రాయిల్పై హమాస్ దాడి చేసి 1200 మందిని చంపింది. 251మందిని బందీలుగా గాజాలోకి తీసుకెళ్లింది. అప్పటి నుంచి ఇజ్రాయిల్ గాజాపై దాడి చేస్తోంది. హమాస్ చెబుతున్న దాని ప్రకారం, ఇజ్రాయిల్ దాడుల్లో ఇప్పటి వరకు 56,000 మంది పాలస్తీనియన్లు మరణించారు.
తాజావార్తలు
-
Kurnool DSC: టెట్ అర్హత లేకుండానే టీచర్ ఉద్యోగం.. కర్నూలులో వెలుగులోకి సంచలన వ్యవహారం!
-
EMI Movie: ఫోన్, బైక్ కొన్నారా? గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న ప్రతి నెలా ‘ఇ.ఎం.ఐ’ టెన్షన్
-
BKU : తెలుగులో బెత్లెహం కుడుంబ యూనిట్.. మరో ప్రేమలు అవుతుందా..?
-
Jitendra Mishra: ఆపరేషన్ సింధూర్ హీరోకి రామ మందిర సేవా భాగ్యం.. జితేంద్ర మిశ్రాపై బిగ్ రెస్పాన్సిబిలిటీ!
-
AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ భేటీ.. 40కి పైగా అజెండా అంశాలతో భేటీ!
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!