Trump: భారత్ టార్గెట్గా ట్రంప్ మరో దాడి.. సౌరశక్తి ఉత్పత్తులపై 126 శాతం సుంకాలు విధింపు
- భారత్ టార్గెట్గా ట్రంప్ మరో వాణిజ్య దాడి
- సౌరశక్తి ఉత్పత్తులపై 126 శాతం సుంకాలు విధింపు
- ఇటీవలే గ్లోబల్ టారిఫ్లను రద్దు చేసిన అమెరికా సుప్రీంకోర్టు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతదేశం టార్గెట్గా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో బాంబ్ పేల్చారు. సౌరశక్తి ఉత్పత్తులపై 126 శాతం సుంకం విధిస్తున్నట్లు ప్రకటించారు. గతేడాది ప్రపంచ దేశాలపై ట్రంప్ విధించిన గ్లోబల్ టారిఫ్లను ఇటీవలే అమెరికా సుప్రీంకోర్టు రద్దు చేసింది. అలా రద్దు చేసిందో లేదో వెంటనే ప్రపంచ దేశాలపై 10 శాతం సుంకం విధించారు. అనంతరం గంటల వ్యవధిలోనే దాన్ని 15 శాతానికి పెంచారు.
ఇది కూడా చదవండి: Trump: అమెరికాలో ప్రస్తుతం స్వర్ణయుగం నడుస్తోంది.. వార్షిక ప్రసంగంలో ట్రంప్ వ్యాఖ్య
Also Read
- Donald Trump: "ఆ గౌరవం దక్కించుకున్న ఏకైక యూఎస్ ప్రెసిడెంట్ నేనే".. తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంపై ట్రంప్ ఫిదా!
- Venezuela Earthquake: వెనెజువెలాను మళ్లీ వణికించిన భూకంపం.. ప్రజల్లో భయాందోళనలు
- US Airstrikes on Iran: మధ్యప్రాచ్యంలో మళ్లీ యుద్ధ మేఘాలు.. ఇరాన్పై అమెరికా వైమానిక దాడులు
- Buckingham Palace: రూ. 4,600 కోట్లు ఖర్చు పెట్టినా.. బకింహామ్ ప్యాలెస్ను వీడనున్న కింగ్ చార్లెస్!
తాజాగా అమెరికా పార్లమెంటులో వార్షిక ప్రసంగంలో ట్రంప్ మరో షాకింగ్ ప్రకటన చేశారు. భారతదేశం, ఇండోనేషియా, లావోస్ దేశాలను లక్ష్యంగా చేసుకుని సౌరశక్తి ఉత్పత్తులపై 126 శాతం సుంకం విధిస్తామని వెల్లడించారు. ఈ మూడు దేశాల నుంచి ఎక్కువగా సౌరశక్తి ఉత్పత్తులు జరుగుతుంటాయి. ఈ నేపథ్యంలోనే సుంకాలు విధించినట్లుగా తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: Viral Video: ఛత్రపతి శివాజీ మహరాజ్కు ఘోర అవమానం.. మహాయోధుడి చిత్రాన్ని ఇలా వాడుకోవడం ఏంటి?
వాణిజ్య శాఖ డేటాను పరిశీలిస్తే.. 2024 సంవత్సరంలో అమెరికా భారతదేశం నుంచి సౌరశక్తి దిగుమతుల విలువ 792.6 మిలియన్ డాలర్లు ఉంది. గత కొన్ని సంవత్సరాలతో పోలిస్తే భారీ పెరుగుదలను నమోదు చేసింది. అయితే ట్రంప్ లక్ష్యంగా చేసుకున్న మూడు దేశాల నుంచి గత సంవత్సరం సుమారు 4.5 బిలియన్ డాలర్ల విలువైన సౌరశక్తి ఉత్పత్తులు దిగుమతి అయ్యాయి. దీని ఆధారంగా 2025 మొదటి అర్ధభాగంలో US సౌర నమూనా దిగుమతుల్లో 57 శాతం భారతదేశం, ఇండోనేషియా, లావోస్ నుంచి మాత్రమే వచ్చాయని నివేదిక పేర్కొంది.
బ్లూమ్బెర్గ్ నివేదిక ప్రకారం.. భారతదేశం నుంచి వచ్చే సౌరశక్తి ఉత్పత్తుల దిగుమతులపై అమెరికా వాణిజ్య శాఖ 126 శాతం సుంకాన్ని విధించింది. ఇండోనేషియాకు 86 శాతం నుంచి 143 శాతం వరకు ఉంటుంది. లావోస్కు ఇది 81 శాతం ఉంటుంది. ఈ దిగుమతి సుంకం రేట్లు విదేశీ సబ్సిడీలను పరిగణనలోకి తీసుకుంటాయి. ఈ దేశాల నుంచి ఎగుమతిదారులు తమ ఉత్పత్తులను దేశీయ సౌరశక్తి ఉత్పత్తిదారుల కంటే తక్కువ ధరకు విక్రయించడానికి ఇది వీలు కల్పిస్తుందని అమెరికా విశ్వసిస్తోంది. భారీ సుంకాలను విధించాలనే ట్రంప్ పరిపాలన చర్య దేశీయ తయారీదారులకు ప్రయోజనం చేకూర్చే లక్ష్యంతో ఉంది.
తాజావార్తలు
-
Hero Passion+ Disc: న్యూ లుక్, డిజిటల్ ఫీచర్లతో విడుదలైన హీరో ప్యాషన్ కొత్త మోడల్.. 71KM మైలేజీ
-
Bahubali -3 : బాహుబలి 3.. అసలు సాధ్యమయ్యే పనేనా?
-
Sree Vishnu : శ్రీవిష్ణు బంపర్ ఆఫర్.. ‘దీవాన’కు బై 1 గెట్ 1 ప్రకటించిన హీరో!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు.. భోజనం చేస్తున్న వారి మధ్యే మూత్ర విసర్జన మహిళ..
-
Crispy Raw Potato Paratha Recipe: ఉడికించిన బంగాళదుంపలు అవసరం లేదు.. పచ్చి ఆలూతో నిమిషాల్లో కరకరలాడే పరాఠా తయారీ ఇలా!
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!