Trump: సుంకాలపై మరో బాంబ్ పేల్చిన ట్రంప్.. భారత్కు భారీ ఎఫెక్ట్
- సుంకాలపై మరో బాంబ్ పేల్చిన ట్రంప్
- ఫార్మా దిగుమతులపై 100 శాతం సుంకం విధింపు
- భారత్కు భారీ ఎఫెక్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సుంకాలపై ట్రంప్ మరో బాంబ్ పేల్చారు. ఫార్మా దిగుమతులపై 100 శాతం సుంకం విధిస్తున్నట్లు ప్రకటించారు. బ్రాండెడ్, పేటెంట్ ఔషధాల దిగుమతులపై అక్టోబర్ 1, 2025 నుంచి 100 శాతం సుంకం విధిస్తున్నట్లు వెల్లడించారు. అలాగే అప్హోస్టర్డ్ ఫర్నిచర్పై 30 శాతం, భారీ ట్రక్కులపై 25 శాతం దిగుమతి సుంకాలు విధించనున్నట్లు వెల్లడించారు. ఫార్మా దిగుమతులపై ఎక్కువగా అమెరికాతో భారతదేశమే వాణిజ్యం చేస్తోంది. దీంతో ఎక్కువగా భారత్పైనే ఆ ప్రభావం పడనుంది. ఇప్పటికే భారత్పై 50 శాతం సుంకం అమలవుతోంది. కొత్తగా అక్టోబర్ 1 నుంచి ఫార్మా దిగుమతులపైన కూడా 100 శాతం సుంకం విధించడంతో భారత్పై తీవ్ర ప్రభావం పడనుందని నిపుణులు భావిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Bharat Margani: బాలకృష్ణ మానసిక స్థితిపై అనుమానం ఉంది.. మాజీ ఎంపీ ఫైర్..
Also Read
- US: అమెరికాస్ గాట్ టాలెంట్ షోలో అదరగొట్టిన చైనా రోబోలు.. వీడియో వైరల్
- Pakistan: పాక్లో ఇంధన మంటలు.. రూ.400కు చేరిన లీటర్ పెట్రోల్.. గాడిదలతో నాయకుల నిరసన
- Imran Khan: ‘‘బ్రిటన్ జోక్యం చేసుకోవాలి’’.. ఇమ్రాన్ఖాన్పై యూకే మాజీ ప్రధాని కీలక వ్యాఖ్యలు..
- Netherlands: విమానం గాల్లో ఉండగా పేలిన పవర్ బ్యాంక్.. షాకైన ప్రయాణికులు.. ఆ తర్వాత ఏమైందంటే..!
అమెరికాతో భారతదేశం అతిపెద్ద ఫార్మాస్యూటికల్ వస్తువుల ఎగుమతి మార్కెట్ ఉంది. 2024లో భారతదేశం నుంచి రూ.7,72,31 కోట్లు ఫార్మా ఎగుమతులు జరిగాయని ఫార్మాస్యూటికల్స్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనే పరిశ్రమ సంస్థ తెలిపింది. ఇక 2025 మొదటి అర్ధభాగంలో రూ.32,505 కోట్ల విలువైన ఫార్మా ఉత్తత్తులు ఎగుమతి చేసినట్లు పేర్కొంది. ఆయా నివేదికల ప్రకారం.. అమెరికాలో ఉపయోగించే జనరిక్ ఔషధాలలో 45 శాతం, బయోసిమిలర్ ఔషధాల్లో 15 శాతం భారతదేశం సరఫరా చేస్తుంది. డాక్టర్ రెడ్డీస్, అరబిందో ఫార్మా, జైడస్ లైఫ్ సైన్సెస్, సన్ ఫార్మా , గ్లాండ్ ఫార్మా వంటి సంస్థలు ఆదాయంలో 30-50 శాతం వరకు అమెరికన్ మార్కెట్ నుంచే సంపాదిస్తున్నట్లు సమాచారం. అమెరికన్లు.. భారతదేశంలో తయారయ్యే తక్కువ ధర జనరిక్లపైనే ఆధారపడతారని తెలుస్తోంది. అయితే ఇప్పుడు ఫార్మాపై 100 శాతం సుంకం విధించడంతో అమెరికన్లు ఇబ్బంది పడవచ్చు.
ఇది కూడా చదవండి: Raashi Khanna : పదునైన అందాలతో సెగలు రేపిన రాశిఖన్నా
భారత్పై ట్రంప్ తొలుత 25 శాతం సుంకం విధించారు. అనంతరం రష్యాతో సంబంధాలు పెట్టుకున్నందుకు జరిమానాగా మరో 25 శాతం సుంకం విధించారు. దీంతో భారత్పై 50 శాతం సుంకం విధించినట్లైంది. ఇప్పుడు ఫార్మాపై ఏకంగా 100 శాతం సుంకం విధించారు. ఇది భారత్ను భారీ దెబ్బ కొట్టినట్లవుతుంది.
తాజావార్తలు
-
BJP: ‘‘ప్రతిధ్వని’’ ఎక్కడ.? ‘‘ధమకా’’ ఇక్కడే.. రాహుల్పై బీజేపీ సెటైర్లు..
-
Samsung Galaxy S27 Ultra: శాంసంగ్ గెలాక్సీ S27 అల్ట్రా.. భారత్లో దీని ధర ఎంతో తెలుసా..?
-
Danam Nagender : దానం నాగేందర్ కేసులో బిగ్ ట్విస్ట్.. సుప్రీంకోర్టుకు అప్పీల్
-
Dishwasher Prices: మహిళలకు గిన్నెలు తోమే తిప్పలు తప్పినట్టే! భారీగా తగ్గిన డిష్వాషర్ల ధరలు..
-
US: అమెరికాస్ గాట్ టాలెంట్ షోలో అదరగొట్టిన చైనా రోబోలు.. వీడియో వైరల్
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!