Israel Strikes Qatar: ఇదేం ద్రోహం భయ్యా, ట్రంప్ డబుల్ గేమ్.. ఖతార్కు $400 మిలియన్లు బొక్క..
- ఖతార్ని మోసం చేసిన అమెరికా..
- ఇజ్రాయిల్ దాడుల గురించి ఎలాంటి సమాచారం ఇవ్వలేదు..
- 400 మిలియన్ డాలర్లు విమానం గిఫ్ట్గా ఇచ్చినా ట్రంప్ మారడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Israel Strikes Qatar: అరబ్ దేశాల్లో అమెరికాకు అత్యంత మిత్రదేశంగా ఖతార్ ఉంటుంది. అలాంటి ఖతార్పై మంగళవారం ఇజ్రాయిల్ దాడులు చేసింది. రాజధాని దోహాలో ఉన్న హమాస్ పొలిటికల్ బ్యూర్ నేతలే టార్గెట్గా ఎయిర్ స్ట్రైక్స్ చేసింది. అయితే, ఇదంతా అమెరికాకు తెలియకుండా ఉండే అవకాశమే లేదు. కానీ, ఇజ్రాయిల్ దాడి చేసే విషయాన్ని, అమెరికా ఖతార్కు ఆలస్యంగా తెలియజేసిందని తెలుస్తోంది. ఈ దాడికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆశీస్సులు ఉన్నాయని ఇజ్రాయిల్ చెబుతోంది. ‘‘ దురదృష్టవశాత్తు, దాడిని ఆపడానికి చాలా ఆలస్యం అయింది’’ అని ట్రంప్ సమాధాని చెప్పారు. ఇజ్రాయిల్ దాడి గురించి తమకు తెలియజేసిందని చెప్పారు.
ఇదే జరిగితే, అమెరికా, ట్రంప్ కలిసి ఇజ్రాయిల్ని దారుణంగా మోసం చేసినట్లే. వైట్ హౌజ్ అధికారి ఒకరు మీడియాతో మాట్లాడుతూ, ఇజ్రాయిల్ దాడి గురించి తెలిజేసిందని చెప్పారు. అయితే, ఖతార్కు అమెరికా ఇచ్చి సమాచారం ఉద్దేశపూర్వకంగా ఆలస్యం జరిగినట్లు అనిపిస్తోంది. దోహాలో దాడి ప్రారంభమైన 10 నిమిషాల తర్వాత అమెరికా నుంచి కాల్ వచ్చినట్లు ఖతార్ చెప్పింది. పేలుళ్ల శబ్ధం సమయంలో ఒక అమెరికన్ అధికారి నుంచి ఫోన్ వచ్చిందని ఖతార్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మజేద్ అల్ అన్సారీ ట్వీట్ చేశారు.
Also Read
- Jinping: భారీ బృందంతో ఢిల్లీకి వస్తున్న చైనా అధ్యక్షుడు.. బ్రిక్స్లో పాల్గొననున్న జిన్పింగ్
- Jaishankar-Putin: రష్యా అధ్యక్షుడు పుతిన్తో జైశంకర్ భేటీ.. రెండు దేశాల సంబంధాలపై చర్చ
- Makkah: ఉద్రిక్తతల వేళ మక్కా ఒప్పందంలోకి ఇరాన్కు ఆహ్వానం! ఏదో జరుగుతోంది!
- Iran-US Tensions Escalate: అమెరికా ఆర్థిక ఆంక్షలకు మద్దతిస్తే ‘యుద్ధ చర్య’గానే చూస్తాం.. దేశాలకు ఇరాన్ హెచ్చరిక
దీనిని బట్టి చూస్తే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ డబుల్ గేమ్ కనిపిస్తోంది. హమాస్ ఒప్పందం కుదుర్చుకోవాలనే హెచ్చరికతో, దోహాలో హమాస్ పొలిటికల్ బ్యూరో సమావేశం జరుగుతున్న సమయంలో ఇజ్రాయిల్ దాడి చేసింది. అయితే, ఈ దాడిపై ఖతార్ ఆగ్రహంతో స్పందించింది. ఇది పిరికిపంద చర్యగా అభివర్ణించింది.
Read Also: Modi-Trump: భారత్-అమెరికా మధ్య శుభపరిణామం.. త్వరలోనే వాణిజ్య చర్చలు
ఇదేం ద్రోహం..
భారతదేశం లాగే, ఇతర మిత్ర దేశాలతో ట్రంప్ వ్యహరిస్తున్న తీరును ఖతార్ కూడా రుచి చూసింది. నాలుగు నెలల క్రితం ఖతార్ పర్యటన సందర్భంగా 400 మిలియన్ డాలర్ల విలువైన ‘‘ప్లయింగ్ ప్యాలెస్’’గా పిలువబడే లగ్జరీ బోయింగ్ 747-8 జెట్ను ఖతాన్, ట్రంప్కి బహుమతిగా ఇచ్చింది. ఈ పర్యటనలో ఖతార్ నుంచి 243.5 బిలియన్ డాలర్ల ఒప్పందాన్ని పొందారు. ఇక మిడిల్ ఈస్ట్లో ఖతార్లోనే అమెరికాకు అతిపెద్ద సైనిక స్థావరం అల్ ఉదీద్ ఎయిర్ బేస్ ఉంది.
నాటోయేతర ప్రధాని మిత్రదేశంగా ఖతార్కు పేరుంది. ఆఫ్ఘనిస్తాన్ నుంచి వేలాది మంది అమెరికన్ పౌరులను తరలించడంలో కూడా ఖతార్ హెల్ప్ చేసింది. ఇదే కాకుండా హమాస్, తాలిబాన్ వంటి ఉగ్ర సంస్థలతో చర్చించడానికి అమెరికాకు ఖతార్ మధ్యవర్తిగా ఉంది. ఇరాన్ తో కూడా ఖతార్తో మంచి సంబంధాలు ఉన్నాయి. ఇరాన్ తో డీల్ చేసే విషయంలో ఖతార్ ఉపయోగపడుతోంది. అయినా కూడా, ఇజ్రాయిల్ దాడి గురించి ఖతార్కు ముందస్తు సమచారం ఇవ్వలేదని తెలుస్తోంది.
తాజావార్తలు
-
NIA Raids : ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్.. రామగుండంలో NIA మెరుపు దాడులు
-
Off The Record: ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలకు కేటీఆర్ వార్నింగ్..?
-
AP Liquor Scam Case: కారుమూరి అరెస్ట్పై ఈడీ కీలక ప్రకటన
-
Chairmans Desk : కాంగ్రెస్లో పాతకథ పునరావృతమౌతోందా.. రేవంత్ తక్షణ కర్తవ్యమేంటి..?
-
OTR: ప్రభాకర్ చౌదరి ఆరోపణలకు స్పందించని ఎమ్మెల్యే దగ్గుబాటి.. కారణం ఇదేనా..?
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!