USA: 2050 నాటికి న్యూయార్క్తో సహా సముద్రంలో కలవనున్న 32 నగరాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
USA: గ్లోబల్ వార్మింగ్, పొల్యూషన్ భూ వాతావరణాన్ని తీవ్రంగా దెబ్బతీస్తోంది. ఇప్పటికే ధృవాల వద్ద నీరు వేగంగా కరుగుతోంది. ఇదే కొనసాగితే రానున్న కొన్ని ఏళ్లలో సముద్ర నీటి మట్టాలు గణనీయంగా పెరగనున్నాయి. దీంతో సముద్ర తీర ప్రాంత పట్టణాలు సముద్రంలో కలిసిపోయే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. భారత్తో పాటు ప్రపంచంలోని పలు దేశాల నగరాలు హై రిస్క్లో ఉన్నాయి. 2050 నాటికి అమెరికాలోని తీర ప్రాంత నగరాల్లో ప్రతీ 50 మందిలో ఒకరు గణనీయమైన వరదల్ని ఎదుర్కొంటారని విశ్లేషణలు వెల్లడించాయి.
అమెరికాలోని మొత్తం 32 తీర ప్రాంత నగరాల్లో 24 నగరాల్లో ప్రతీ ఏడాది సముద్రమట్టం 2 మిల్లీమీటర్ల కంటే ఎక్కువగా పెరుగుతోంది. ఇందులో సగం నగరాల్లోని కొన్ని ప్రాంతాలు ప్రపంచ సముద్ర నీటి మట్టాల పెరుగుదల కన్నా ఎక్కువగా మునిగిపోతున్నట్లు తేలింది.
అమెరికాల్లో ప్రఖ్యాత న్యూయార్క్తో సహా బోస్టన్, జెర్సీ సిటీ, అట్లాంటిక్ సిటీ, వర్జీనియా బీచ్, విల్మింగ్టన్, మిర్టిల్ బీచ్, చార్లెస్టన్, సవన్నా, జాక్సన్విల్లే, మయామి, నేపుల్స్, మొబైల్, బిలోక్సీ, న్యూ ఓర్లీన్స్, స్లిడెల్, లేక్ చార్లెస్, పోర్ట్ ఆర్థర్, టెక్సాస్ సిటీ, గాల్వెస్టన్, ఫ్రీపోర్ట్, కార్పస్ క్రిస్టి, రిచ్మండ్, ఓక్లాండ్, శాన్ ఫ్రాన్సిస్కో, సౌత్ శాన్ ఫ్రాన్సిస్కో, ఫోస్టర్ సిటీ, శాంటా క్రజ్, లాంగ్ బీచ్, హంటింగ్టన్ బీచ్, న్యూపోర్ట్ బీచ్, శాన్ డియాగో వంటి నగరాలు ఈ జాబితాలో ఉన్నాయి.
Also Read
- Asim Munir: పాకిస్థాన్ మళ్లీ యుద్ధానికి సిద్ధమవుతోందా? ఆయుధ కర్మాగారాన్ని సందర్శించిన మునీర్..
- Mohan Bhagwat: ‘భారత్లో ముస్లింలు ఉండకూడదనేవారు హిందువులే కాదు’.. మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
- Bank Locker Swept: వరదల్లో కొట్టుకుపోయిన బ్యాంకు లాకర్.. రూ. లక్షల్లో డబ్బు.. ఎగబడిన జనం
- NASA: అంగారక గ్రహంపై ఏలియన్ 'జెల్లీఫిష్' కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
Read Also: Kodali Nani: నాకు ఇవే చివరి ఎలక్షన్స్.. 2029 ఎన్నికల్లో పోటీ చేయను
2050 నాటికి అమెరికా తీర ప్రాంతాల వెంబడి సముద్రమట్టం 0.25-0.30 మీటర్లు పెరుగుతుందని నేచర్ జర్నల్లో ప్రచురించిన అధ్యయనం వెల్లడించింది. తీవప్రాంతాల క్షీణత, తీరప్రాంత భూభాగాలు మునిగిపోవడం వల్ల సమస్య తీవ్రం అవుతుందని పేర్కొంది. రాబోయే మూడు దశాబ్ధాల్లో దాదాపుగా 5 లక్షల మంది ప్రజలు ప్రభావితమవుతారని, వరదల వల్ల 35 ప్రైవేట్ యాజమాన్యంలోని ఆస్తుల్లో ఒకటి నష్టపోయే అవకాశం ఉందని అధ్యయనం అంచనా వేసింది. కొత్త అద్యయనం గత అధ్యయనాలను మార్చింది. మరో 500-700 చదరపు మైళ్ల భూమి ముంపుకు గురయ్యే అవకాశం ఉందని, సముద్ర నీరు పెరగడం వల్ల 1,76,000 నుంచి 5,18,000 మంది ప్రజలు ప్రభావితమయ్యే అవకాశం ఉందని విశ్లేషణ వెల్లడించింది. కేవలం యునైటెడ్ స్టేట్స్లోనే 94,000 నుండి 2,88,000 ఆస్తులు, 32 బిలియన్ నుండి 109 బిలియన్ డాలర్ల వరకు నష్టం అంచనా వేయబడ్డాయి.
తాజావార్తలు
-
BCCI-Team India: ఉన్నపళంగా బెంగళూరుకు టీమిండియా స్టార్ క్రికెటర్లు.. ఎందుకో తెలుసా?
-
Asim Munir: పాకిస్థాన్ మళ్లీ యుద్ధానికి సిద్ధమవుతోందా? ఆయుధ కర్మాగారాన్ని సందర్శించిన మునీర్..
-
NEET PG 2026 Exam: నేడే నీట్ పీజీ 2026 ప్రవేశ పరీక్ష.. అభ్యర్థులు ఈ తప్పులు చేయకండి.. కీలక మార్గదర్శకాలు
-
Mohan Bhagwat: ‘భారత్లో ముస్లింలు ఉండకూడదనేవారు హిందువులే కాదు’.. మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
-
Bank Locker Swept: వరదల్లో కొట్టుకుపోయిన బ్యాంకు లాకర్.. రూ. లక్షల్లో డబ్బు.. ఎగబడిన జనం
ట్రెండింగ్
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!