కరోనా ప్రపంచ వ్యాప్తంగా చేసిన మృత్యు కేళి మరువక ముందే ఒమిక్రాన్ రూపంలో మరో వేరింయట్తో ప్రజల్లో భయాందోళనలు మొదలయ్యాయి. ఈ కొత్త వేరింయట్ వేగంగా ప్రపంచ దేశాలకు విస్తరిస్తుంది. తాజాగా బ్రిటన్లో మునుపెన్నడు లేని విధంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. కోవిడ్ మొదలైన నాటి నుండి బుధవారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదయ్యాయి. ఒక్క రోజే 78, 610 కొత్త కేసులు వెలుగుచూశాయి. జనవరిలో నమోదైన గరిష్ట సంఖ్య కన్నా 10 వేలు ఎక్కువ.
రాబోయే రోజుల్లో కేసుల్లో పెరుగుదల ఉండవచ్చునని బ్రిటన్ సీనియర్ హెల్త్ చీఫ్ ఒకరు ఆందోళన వ్యక్తం చేశారు. బ్రిటన్లో 67 మిలియన్ మంది ప్రజలు ఉండగా.. ఇప్పటి వరకు 11 మిలియన్ల మందికి పైగా ఈ మహమ్మారి బారిన పడ్డారు. నూతన వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి కారణంగా దేశంలో ఒక్క రోజులోనే ఇన్ని కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. దీంతో ప్రధాని బోరిస్ జాన్సన్ మరో వేవ్ మొదలైందంటూ హెచ్చరించారు. కాగా, ఇప్పటి వరకు దేశంలో 10 వేలకు పైగా ఒమిక్రాన్ కేసులు వెలుగుచూడగా.. 10 మంది ఆసుపత్రిలోచేరారు… ఒకరు మృతి చెందినట్లు బ్రిటన్ వైద్యశాఖ అధికారులు ప్రకటించారు.