Sunita Williams: సునీతా విలియమ్స్కి తీవ్ర ఆరోగ్య సమస్యలు.. భూమికి వచ్చిన తర్వాత భరించలేని బాధ..
- సునీతా విలియమ్స్కి ఆరోగ్య సమస్యలు..
- సుదీర్ఘకాలం అంతరిక్షంలో ఉండటంతో ఇబ్బందులు..
- బేబీ ఫుట్, ఎముకల సాంద్రత నష్టం..
- భూమిపైకి వచ్చిన కొన్ని నెలల పాటు తీవ్రమైన బాధ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sunita Williams: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ISS)లో గత 9 నెలల నుంచి చిక్కుకుపోయిన వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ భూమిపైకి తిరిగి వచ్చేందుకు అంతా సిద్ధమైంది. నాసా-స్పేస్ ఎక్స్కి చెందిన క్రూ-10 ఐఎస్ఎస్ని చేరుకుంది. శుక్రవారం ఫ్లోరిడా నుంచి కెన్నెడీ అంతరిక్ష కేంద్రం నుంచి ఫాల్కన్ -9 రాకెట్ ద్వారా క్రూ-10 అంతరిక్షంలోకి వెళ్లింది. రిటర్న్ జర్మీలో సునీతా విలియమ్స్ భూమికి పైకి వస్తుంది.
అయితే, సుదీర్ఘ కాలం అంతరిక్షంలో గడపడం వల్ల సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. వారు భూమి పైకి రావడం అత్యంత బాధతో కూడుకున్నది. వీరిద్దరికి ‘‘బేబీ ఫుట్’’ అని పిలిచే ఆరోగ్య పరిస్థితి తలెత్తే అవకాశం ఉంది. వ్యోమగామలు నెలల తరబడి అంతరిక్షంలో ఉండటంతో వారి పాదాలు శిశువుల పాదాల వలే మృదువుగా మారుతాయి. అంటే వారు నడవడానికి తీవ్రమైన బాధను అనుభవిస్తారు.
Also Read
- Russia: పుతిన్ దేశంలో పెట్రోల్ బంకులు ఖాళీ! రష్యాకు పెట్రోల్ అమ్ముతున్న భారత్..
- Iran - Israel: ఇరాన్ అణు స్థావరాలపై ఇజ్రాయెల్ గురి.. ట్రంప్ వార్నింగ్ను నెతన్యాహు బ్రేక్ చేస్తారా?
- Russian Couple: ప్రేమ కోసం ప్రాణాలనే పణంగా పెట్టిన జంట.. 1,454 అడుగుల ఎత్తులో ప్రపోజ్!
- India - Pakistan: భారత్ - పాక్ మధ్య అర్ధరాత్రి ఆసక్తికర ఒప్పందం.. ఏంటో తెలుసా!
భూమిపై నడుస్తున్నప్పుడు మన పాదాల చర్మం గురుత్వాకర్షణ, ఘర్షణ కారణంగా మందంగా తయారవుతుంది. ఇది మనం నడిచేటప్పుడు చాలా నిరోధకతను తట్టుకుంటుంది. నొప్పి, అసౌకర్యం నుంచి రక్షిస్తుంది. నెలల తరబడి అంతరిక్షంలో ఉన్నవారు గట్టిపడిన చర్మం కోల్పోతారు. పాదాలు చాలా మృదువుగా తయారవుతాయి. మళ్లీ పాదాలు నార్మల్ స్థితికి వచ్చే వరకు కొన్ని వారాల నుంచి నెలల సమయం పట్టే అవకాశం ఉంది.
Read Also: Pakistan: పాక్ ఆర్మీని చావు దెబ్బతీసిన బీఎల్ఏ.. 90 మంది మృతి..
మరోవైపు గురుత్వాకర్షణ శక్తి లేకపోవడంతో ఎములక సాంద్రత కూడా గణనీయంగా తగ్గుతుంది. నాసా ప్రకారం, అంతరిక్షంలో సరైన చర్యలు తీసుకోకపోతే, ప్రతీ నెల వ్యోమగాములు ఒక శాతం డెన్సిటీని కోల్పోతారు. కండరాలు కూడా బలహీనపడుతాయి. ఫలితంగా భూమిపైకి వచ్చిన కొన్ని రోజుల వరకు వారు సాధారణంగా నడవలేరు. దీనికి అనేక నెలల శిక్షణ అవసరం అవుతుంది.
ఇవే కాకుండా వ్యోమగాముల రక్త పరిమాణం కూడా తగ్గిపోతుంది. గుండె గురుత్వాకర్షణ లేని కారణంగా రక్తాన్ని పెద్దగా కష్టపడి పంప్ చేయాల్సిన పని ఉండదు. శరీరంలో రక్తం ప్రవహించే విధానం కూడా మారుతుంది. కొన్ని ప్రాంతాల్లో నెమ్మదిస్తుంది. దీని వల్ల రక్తం గడ్డకట్టవచ్చు.
అంతరిక్షంలో గడపడం వల్ల అత్యంత ప్రమాదకరమైన రేడియేషన్కు గురికావడం జరుగుతుంది. భూమికి ఉన్న అయస్కాంత క్షేత్రం మానవులను రేడియేషన్ నుంచి రక్షిస్తుంది. అయితే, అంతరిక్షంలో ఉండే వారికి ఈ వెసులుబాటు ఉండదు. వ్యోమగాములు ప్రధానంగా మూడు రకాల రేడియేషన్కు గురవుతారని నాసా పేర్కొంది. వీటిలో భూమి యొక్క అయస్కాంత క్షేత్రంలో చిక్కుకున్న కణాలు, సూర్యుని నుండి వచ్చే సౌర అయస్కాంత కణాలు, గెలాక్సీ కాస్మిక్ కిరణాలు ఉన్నాయి.
తాజావార్తలు
-
IND vs SL Test Series: ఆగస్టు 15 నుంచి భారత్-శ్రీలంక టెస్ట్ సమరం.. షెడ్యూల్ విడుదల.!
-
Modi-Takaichi: మారుతీ మెగా ప్లాంట్ ప్రారంభించిన మోడీ, తకైచి
-
Delhi: దేశ వ్యాప్తంగా బాంబ్ బెదిరింపులు.. ఘజియాబాద్ వ్యక్తి అరెస్ట్
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
Khammam Police : ఖమ్మంలో ఖాకీ కుంభకోణం.. పోలీసులే దోపిడీ ముఠాలో కీలక సభ్యులు
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!